అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
న్యూస్టుడే బృందం: విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్య కూడళ్లలో సుజనా మాట్లాడుతూ పశ్చిమ ప్రజలు కులమతాలకు అతీతంగా మంచి అభ్యర్థులను ఆదరిస్తారన్నారు. గత ప్రజాప్రతినిధులు డ్రెయినేజీ, తాగునీరు, రోడ్లు వంటి వసతులు కల్పించలేదన్నారు. అన్ని వర్గాలు తనపై చూపుతున్న అభిమానాన్ని జీవితాంతం మరచిపోలేనన్నారు.
తరలివచ్చిన నేతలు: తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని), మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధ, జలీల్ఖాన్ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కూటమి నాయకులు అడ్డూరి శ్రీరామ్, ఎంఎస్ బేగ్, అబ్దుల్ ఖాదర్, నాగభూషణం, బాడిత శంకర్ పాల్గొన్నారు.
సమరోత్సాహం: సుజనా.. తొలుత చిట్టినగర్ సెంటరులోని నగరాల సీతారామస్వామి, మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో పూజలు చేశారు. తర్వాత తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు, నాయకులతో కలిసి భారీ ఊరేగింపుగా బ్రాహ్మణ వీధి మీదుగా రథం సెంటర్కు చేరుకున్నారు. రెండు కిలోమీటర్ల దూరానికి నాలుగు గంటల సమయం పట్టింది. ఊరేగింపులో డప్పు వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, పార్టీ జెండాలతోపాటు అభ్యర్థి గుర్తు కమలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రథం సెంటర్లో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో క్రేన్ సహాయంతో భారీ గజమాలను సుజనా చౌదరి మెడలో వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏమైనా ఇచ్చేస్తాం.. ఎంతైనా కొనేస్తాం!.. ఓట్ల కొనుగోలుకు బరితెగించిన వైకాపా
[ 02-05-2024]
ఆ నియోజకవర్గంలో ఓ సామాజిక వర్గం వారు తెదేపాకు మద్దతివ్వాలని నిర్ణయించారు. ఇది తెలిసిన వైకాపా ప్రజాప్రతినిధి అక్కడ వాలిపోయారు. అప్పటికప్పుడు రూ.10 లక్షల చెక్కు, రూ.3 లక్షలు నగదు ఇచ్చారు. తర్వాత ఓటుకు ఇంతని ఇస్తానని హామీ ఇచ్చారు. -
జనం గొంతులో.. జగన్ గరళం..!
[ 02-05-2024]
ప్రజారోగ్యం ప్రమాదంలో పడ్డప్పుడు పాలకులు ఏం చేయాలి? తాగునీరే గరళమై.. జనం ప్రాణాలనే బలి తీసుకుంటుంటే ఏం చర్యలు తీసుకోవాలి? -
నాడు జోరుమీదొచ్చారు.. నేడు జారుకున్నారు
[ 02-05-2024]
ఎన్నిక ప్రకటన ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు జోగి రమేష్ పోరంకి ద్వారకా రెసిడెన్సీలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులు బుట్టదాఖలయ్యాయి. ఆన్లైన్లో నమోదు చేసి రశీదులు ఇచ్చినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. -
పేరు రక్షితం.. నీరు కలుషితం
[ 02-05-2024]
ప్రజలకు రోజూ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావడం లేదు. చాలాచోట్ల డ్రెయిన్ల వెంబడి పైపులైన్లు ఉండడం.. లీకైన వాటిని మరమ్మతులు చేపట్టకపోవడంతో మురుగునీరు సరఫరా అవుతుందని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. -
ప్రతి పథకమూ దోపిడీ కోసమే
[ 02-05-2024]
రాష్ట్రంలో ఐదేళ్లలో అమలు చేసిన ప్రతి పథకాన్నీ తన దోపిడీకి అనుగుణంగా మార్చుకున్న జగన్, అతని టీంకు మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కోరారు. -
ఈ ప్రశ్నకు జవాబు చెప్పు?
[ 02-05-2024]
‘నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి చేస్తున్నాం.. విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో బోధనతో పాటు, టోఫెల్, స్లాష్, క్లాస్రూం ఎస్సెస్మెంట్ పరీక్షలు చేపడుతూ వారి సామర్థ్యాన్ని ఏ ప్రభుత్వం చేయలేని పద్ధతిలో పెంపొందిస్తున్నాం’ -
‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్’
[ 02-05-2024]
మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేసిన ఘనుడు జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. -
వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదాం
[ 02-05-2024]
వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపాలని కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని శింగరాయపాలెం, బల్లిపర్రు, కాకర్లమూడి, మడక, అచ్చయ్యవారిపాలెం, పుల్లపాడు తదితర గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. -
చీకటి పాలన నుంచి విముక్తులవుదాం: కొల్లు
[ 02-05-2024]
ఐదేళ్ల చీకటి పాలన నుంచి విముక్తులయ్యేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్ర కోరారు. -
దళిత వ్యతిరేకి జగన్: జవహర్
[ 02-05-2024]
దళిత వ్యతిరేకి జగన్మోహన్రెడ్డికి తగు రీతిన బుద్ధి చెప్పేందుకు అందరూ సంఘటితం కావాలని మాజీ మంత్రి, తెదేపా నాయకులు కేఎస్ జవహర్ కోరారు. -
సంక్షేమ పాలన తెదేపాతోనే సాధ్యం
[ 02-05-2024]
కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ అన్నారు. పెడన మండలం నందమూరు, జింజేరు, జింజేరు గౌడపాలెం గ్రామాల్లో బుధవారం -
తెదేపా అభ్యర్థులకు ఘన స్వాగతం
[ 02-05-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిల విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం రాత్రి వరకు ఉయ్యూరులో బైక్ ర్యాలీ జరిగింది. -
వైకాపా కుక్కర్ కూపన్ల కేసు కంచికే..!
[ 02-05-2024]
అజిత్సింగ్నగర్ తోటవారివీధిలోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్లో ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న వైకాపా కుక్కర్ కూపన్ల కేసు.. కంచికి చేరింది. -
వైద్యుడి కుటుంబం మృతి కేసులో విచారణ వేగవంతం
[ 02-05-2024]
పటమట పరిధిలో వైద్యుడు శ్రీనివాస్ కుటుంబం మృతి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసును సీపీ స్వయంగా పర్యవేక్షిస్తుండంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేసి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. -
వెలంపల్లికి చేదు అనుభవం
[ 02-05-2024]
సెంట్రల్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఆయన 23, 62 డివిజన్లలో పర్యటించారు. -
కొడాలి నానిని నిలదీసిన గ్రామస్థులు
[ 02-05-2024]
వలివర్తిపాడు గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) బుధవారం ఎన్నికల ప్రచారం చేస్తుండగా..పలువురు మహిళలు ఆయన్ను తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించలేదంటూ నిలదీశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
-
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
-
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!
-
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు