జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు.
విజయవాడకు వన్నె తెచ్చిన ఐఎఫ్ఎస్ అధికారి
కానూరు, విజయవాడ(గాంధీనగర్), న్యూస్టుడే: సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. తన ప్రతిభతో వృత్తిపరమైన శిక్షణ కోర్సులో ఏడు పతకాలు సాధించి జాతీయ స్థాయిలో తెలుగువారి సత్తా చాటారు విజయవాడకు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి అబ్దుల్ రవూఫ్ నగరానికి చెందిన అబ్దుల్రవూఫ్ షేక్ చిన్ననాటి నుంచి చదువులో దిట్ట. ఆయన తండ్రి మహమ్మద్ ఇక్బాల్ వ్యవసాయ శాఖలో సూపరింటెండెంట్ కాగా.. తల్లి డాక్టర్ గౌసియాభేగం అగ్రికల్చర్ విభాగంలో జేడీగా పనిచేస్తున్నారు. అబ్దుల్ రవూఫ్ నగరంలోని ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో సీబీఎస్ఈలో 10వ తరగతిలో టాపర్గా నిలిచారు. అనంతరం నారాయణలో ఇంటర్ పూర్తిచేసి, ఐఐటీ ముంబయిలో సివిల్ విభాగంలో సీటు సాధించారు. యూఎస్లో ఎంఎస్ పూర్తి చేశారు. చదువు పూర్తి చేసిన అనంతరం నాబార్డులో మేనేజర్గా రెండేళ్లు విధులు నిర్వహించారు. అనంతరం సివిల్స్పై దృష్టి సారించారు. శిక్షణ తీసుకోగా.. మూడో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారెస్టు సర్వీసులో) ఆల్ ఇండియా స్థాయిలో 30వ ర్యాంకు సాధించారు.
శిక్షణలోనూ ప్రతిభ : 2022-24 వరకు రెండేళ్లు డెహ్రాడూన్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్టు అకాడమీ ద్వారా శిక్షణ తీసుకున్నారు. ఆ కాలంలోనూ అత్యంత ప్రతిభ కనబర్చారు. శిక్షణ పూర్తయి ఇండియన్ ఫారెస్టు సర్వీస్ ఆఫీసర్సు-2022 బ్యాచ్ కాన్వోకేషన్ కార్యక్రమం నిర్వహించారు. వృత్తిపరమైన శిక్షణ కోర్సులో అత్యధిక మార్కులు సాధించడంతో పాటు ఏడు విభాగాల్లో టాపర్గా నిలిచి బంగారు పతకాలు అందుకున్నారు. బుధవారం డెహ్రాడూన్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి, ప్రజలకు తాను చక్కని సేవలందించడమే లక్ష్యమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
[ 04-05-2024]
ఐదు సంవత్సరాలుగా అధికార పార్టీ సేవలకే పరిమితమైన పోలీస్శాఖ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా తీరు మార్చుకోవడం లేదు. -
జగన్.. ‘పైసా’చికానందం..!
[ 04-05-2024]
‘ఇది అత్యంత దారుణం.. పండుటాకులతో జగన్ పైశాచిక క్రీడ ఆడుతున్నారు. వృద్ధులంతా ఎండలో నరకం అనుభవించాలని.. తమ బాధకు కారణం.. వాలంటీర్లు లేకపోవడమేనని వాళ్లు భావించాలనేదే.. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. -
బ్యాలట్ కాదు.. బుల్లెట్
[ 04-05-2024]
ఒక పూటలో తినే కూరగాయల్నే ఏరి ఏరి కొంటాం.. మరి అయిదేళ్లకోసారి వేసే ఓటు ఆచితూచి వేయలేమా..! సామాజిక మాధ్యమాల్లో ఇటీవల చక్కర్లు కొడుతున్న పోస్టు ఇది. -
సహకారానికి జగన్ కత్తెర
[ 04-05-2024]
సహకార చట్టం ప్రకారం.. సంఘానికి నిర్ధరిత కాలవ్యవధిలో ప్రత్యేక ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. -
జగన్ జమాన.. జనం భయాన!
[ 04-05-2024]
ప్రశాంతంగా కుటుంబంతో పార్కుకు వెళ్లాలంటే భయం.. పద్మావతి ఘాట్కో... కృష్ణవేణి ఘాట్కో వెళ్లి కొద్దిసేపు సేదదీరాలన్నా భయమే... నిర్మానుష్యంగా.. చీకటిగా ఉన్న రోడ్లపై వెళ్లాలన్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే...ఎటువైపు నుంచి బ్లేడ్, గంజాయి బ్యాచ్లు దాడి చేస్తాయో తెలీదు. -
పోలీసుపై కొడాలి నాని ప్రధాన అనుచరుడి అరాచకం
[ 04-05-2024]
గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరుడైన కసుకుర్తి జనార్దన్ (గుడ్లవల్లేరు బాబ్జి) ట్రాఫిక్ విధుల్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఆటోనగర్పై పగ.. శ్రామికులకు సెగ
[ 04-05-2024]
ఆసియాలోనే పెద్దదైన బెజవాడ ఆటోనగర్ పారిశ్రామికవాడ నేడు అనేక సమస్యలతో సతమతమౌతోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీనిని పట్టించుకోవడం మానేసింది. -
వంశీ, నానీ.. ‘దారి’ మరిచారేం?
[ 04-05-2024]
గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలకు ఎంతగానో ఉపకరించే కీలక రహదారి అభివృద్ధిపై వైకాపా ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం చూపారు. చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. -
రూ.కోట్ల విలువైన స్థలంఫై విష్ణు కన్ను
[ 04-05-2024]
నగరంలో గత అయిదేళ్లలో వైకాపా ప్రజాప్రతినిధులు.. ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపించినా కబ్జా చేసేశారు. స్థానిక కార్పొరేటర్ల అండతో ప్రభుత్వ స్థలాలను మింగేశారు. -
బూతుల నేత.. మెరకలో మేత!
[ 04-05-2024]
శతకోటి అక్రమాలకు అనంతకోటి ఉపాయాలు! మట్టి నుంచి రూ. కోట్లు ఎలా పిండుకోవచ్చో గుడివాడ వెళ్లి చూస్తే తెలుస్తుంది.ఆ పిండుకున్నదాన్ని చట్టానికి దొరక్కుండా ఎలా జేబులో వేసుకోవచ్చో కూడా చూడొచ్చు. -
తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయుల దాడి
[ 04-05-2024]
బాపులపాడు మండలం కొత్తమల్లవల్లిలో తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. ఇళ్ల మీదకు వెళ్లి దాడికి పాల్పడ్డారు. -
మళ్లీ అదే తంతు
[ 04-05-2024]
అనుమతి లేకుండా 59వ డివిజన్లోని పలు నివాసాలపై వైకాపా నేతలు ఆ పార్టీ స్టిక్కర్లు అంటించడం వివాదాస్పదమైంది. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను
[ 04-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని చిన్ని, శ్రీరాం తాతయ్య పేర్కొన్నారు. -
కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యం: సుజనా
[ 04-05-2024]
ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు కృషి చేయాలని పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. -
చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు
[ 04-05-2024]
నగరంలోని ఆంధ్రా ఆసుపత్రిలో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే సౌజన్యంతో 15 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. -
తెదేపాతోనే యువతకు భవిష్యత్తు
[ 04-05-2024]
యువత భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని విజయవాడ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. -
నేటి నుంచి పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
[ 04-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ నెల 4, 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
టికెట్టు లేని ప్రయాణాలకు జరిమానా
[ 04-05-2024]
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో టికెట్టు లేని ప్రయాణికుల ద్వారా ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రికార్డు స్థాయిలో డివిజన్కు రూ.7.96కోట్ల ఆదాయం లభించింది. -
ప్రధాని రోడ్షో భద్రతపై సమీక్ష
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విజయవాడలో రోడ్షోలో పాల్గొననున్నారని ఇందుకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రధాని పర్యటనకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..