వివరాలు రాలేదని ఓటు వేయనీయలేదు
పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగంలో తలెత్తిన సమస్యలతో పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మచిలీపట్నంలోని చిలకలపూడి మున్సిపల్ పాండురంగ ఉన్నతపాఠశాలలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు.
మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్టుడే: పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగంలో తలెత్తిన సమస్యలతో పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మచిలీపట్నంలోని చిలకలపూడి మున్సిపల్ పాండురంగ ఉన్నతపాఠశాలలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే ఎంతో ఆశతో ఓటు వేసేందుకు వచ్చిన వారిలో కొంతమంది ఉద్యోగుల వివరాలు రాలేదన్న కారణంతో ఓటుహక్కు వినియోగించుకోవడానికి అవకాశం లేదని అధికారులు అన్నారు. దీంతో వారంతా అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాల వద్ద వివరాలు ఇచ్చామని చెప్పినా, తమకు వచ్చిన పత్రంలో వివరాలు లేకుంటే అవకాశం ఇవ్వలేమని వారు సమాధానమిచ్చారు. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు ఉన్నవారు అధికారులనుంచి సరైన సమాచారం లేక ఈనెల 4వ తేదీన కూడా చాలామంది వచ్చి వెనుదిరిగి వెళ్లారు. మళ్లీ ఈ సమస్య తలెత్తడంతో పలువురు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో రెండు రోజులు అవకాశం: కలెక్టర్
జిల్లా కలెక్టర్ డీకె బాలాజీ కేంద్రాన్ని సందర్శించి ఉద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా వివిధ కారణాలతో ఎవరైనా ఓటు హక్కు వినియోగించుకోలేని వారికోసం ఎన్నికల సంఘం మరో రెండు రోజులు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.అలాంటి వారు ఈనెల 7,8 తేదీల్లో ఆ ప్రాంత ఆర్వో కార్యాలయానికి వెళ్లి అక్కడే ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చెప్పారు. పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక సాధారణ సెలవు కూడా మంజూరు చేసిందన్నారు.ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు హెల్ప్డెస్క్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు, పోస్టల్ బ్యాలట్ నోడల్ అధికారి షాహిద్బాబు, నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెట్టుబడి అంటే పట్టుబడినట్టే.. లాభాల పేరుతో సైబర్ నేరగాళ్ల దందా
[ 19-05-2024]
విజయవాడ శివారు ప్రసాదంపాడుకు చెందిన ఓ యువకుడికి ఇటీవల ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీనిని ఆమోదించిన అతనికి బినాన్స్లో ఆన్లైన్ ట్రేడింగ్ చేయొచ్చని, పెద్ద మొత్తంలో రాబడులు వస్తాయని అవతలి వ్యక్తి ఆశ చూపించాడు. -
సైకిల్ సవారీ.. వేస్తారా దారి?
[ 19-05-2024]
విజయవాడ, మచిలీపట్నం నగరాల్లో ప్రజలు వాకింగ్ చేసేందుకు సరైన పార్కులు, ట్రాక్లు లేవు. వివిధ కళాశాలల ప్రాంగణాల్లో సంబంధిత యాజమాన్యాల అనుమతితో వేలాదిమంది ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ చేస్తున్నారు. -
విజ్ఞానం.. వినోదం
[ 19-05-2024]
తిరువూరు పట్టణంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక, గ్రేడ్-1 శాఖ గ్రంథాలయం, ఐడియాస్ సేవా సంస్థలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలకు విద్యార్థుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. -
ఈసారీ అదే తంతు..?
[ 19-05-2024]
పాఠశాలల పునః ప్రారంభసమయం సమీపిస్తోంది. బడులు తెరిచేనాటికే అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించామనీ, ఇప్పటికే పలు మండలాల్లోని ఎమ్మార్సీకేంద్రాలకు కొన్ని పుస్తకాలు చేరాయని తెలిపారు. -
చిలకలపూడి స్టేషన్లో సమస్యల కూత
[ 19-05-2024]
మచిలీపట్నంలో ప్రధాన రైల్వేస్టేషన్తో పాటు చిలకలపూడి స్టేషన్లో పలు సమస్యలు తిష్ఠ వేశాయి. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా రోల్డ్గోల్డ్ నగల వ్యాపారులు, వివిధ కళాశాలలకు వచ్చే విద్యార్థులు ఈ స్టేషన్నే ఆశ్రయిస్తారు. -
భక్తితో వాసవీ మాత జయంతి
[ 19-05-2024]
నగరంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాత జయంతి మహోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలకవర్గ ప్రతినిధులు మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాదు, మామిడి మురళీకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. -
కళాశాల అభివృద్ధిపై నిర్లక్ష్యం
[ 19-05-2024]
పెడన నియోజకవర్గంలో ఉన్న ఏకైక బంటుమిల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి అమడ దూరంలో ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. దీనిని 1997లో ప్రారంభించారు. -
నీ పరుగులేవమ్మ ... కృష్ణమ్మా..
[ 19-05-2024]
కృష్ణానది నీటిమట్టం రోజురోజుకు తగ్గుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చే నీరు లేకపోవడంతో నీటిమట్టం పడిపోతోంది. -
నీరుగారిన చెత్త నిర్వహణ
[ 19-05-2024]
మండల పరిధిలోని చెత్త నిర్వహణ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. రూ.లక్షలు వ్యయంతో నిర్మించిన కేంద్రాలను వినియోగించడం లేదు. ఫలితంగా గ్రామాల్లో రహదారుల వెంట చెత్త ఇష్టానుసారం పడేస్తున్నారు. 24 గ్రామాల్లో ఏడేళ్లనాడు చెత్త కేంద్రాలు నిర్మించారు.
తాజా వార్తలు (Latest News)
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!