బొండా ఉమాపై మైక్లో అసత్య ప్రచారం.. అజిత్సింగ్ నగర్లో ఉద్రిక్తత
ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న సెంట్రల్ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు.. ఎన్డీయే కూటమి సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావుపై వ్యక్తిగత ఆరోపణలతో మైక్ ప్రచారం ప్రారంభించారు.
అజిత్సింగ్నగర్ (మధురానగర్), న్యూస్టుడే : ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న సెంట్రల్ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు.. ఎన్డీయే కూటమి సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావుపై వ్యక్తిగత ఆరోపణలతో మైక్ ప్రచారం ప్రారంభించారు. అసత్య ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. వైకాపా ప్రచార వాహనాలను అజిత్సింగ్నగర్ పరిసరాల్లో తిప్పుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా చేస్తున్న ప్రచారాన్ని మంగళవారం తెదేపా శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.
కూటమి అభ్యర్థే లక్ష్యంగా...
ఎన్డీయే కూటమి అభ్యర్థి బొండా ఉమామహేశ్వరావును లక్ష్యంగా చేసుకుని ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ మంగళవారం ఉదయం నుంచి వైకాపా ప్రచార వాహనాలు మైక్లో ప్రచారం చేయడం ప్రారంభించాయి. అజిత్సింగ్నగర్ ఎంకే బేగ్ స్కూలు పరిసరాల్లో ఒక వాహనాన్ని స్థానిక నాయకులు అడ్డుకున్నారు. మరో వాహనాన్ని నూజివీడు రోడ్డులో సాయిబాబా గుడి వద్ద తెదేపా నాయకులు అడ్డుకున్నారు. ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది. కొంత మంది వ్యక్తులు ప్రచార వాహనంలో మైక్సెట్కు ఉన్న పెన్డ్రైవ్ తీసుకుని పరారయ్యారు. లాక్కుని వెళ్లింది ఎవరనేది వాహన డ్రైవర్ కూడా చెప్పలేకపోతున్నారు. ఈ ఘటనతో వైకాపా నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అజిత్సింగ్నగర్ సీఐ గురుప్రకాశ్ వచ్చి వైకాపా నాయకులతో మాట్లాడారు. వ్యాన్ డ్రైవర్తో మాట్లాడితే.. కారులో వచ్చిన వారెవరో పెన్డ్రైవ్ లాక్కుపోయారని చెబుతున్నారు. ఆ పెన్డ్రైవ్తో బొండా ఉమాను వ్యక్తిగతంగా దూషిస్తూ.. మైక్లో ప్రచారం చేస్తున్నారని, దానిపైనే తాము ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వాహనాన్ని నిలువరించామని తెదేపా నాయకులు చెబుతున్నారు. పెన్డ్రైవ్లో కంటెంట్ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. దాని వివరాలు తెలిస్తే.. చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని చెబుతున్నారు. పెన్డ్రైవ్లో వివరాలు బయటకు తెలిస్తే తమ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందన్న భయంతో వైకాపా నాయకులు నాటకం ఆడుతున్నారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.
- నూజివీడు రోడ్డులో తెదేపా నాయకులు గరిమెళ్ల చిన్న, దాసరి ఉదయశ్రీలు తనను అడ్డగించి, చేతులతో కొట్టి, డబ్బులు, పెన్డ్రైవ్ లాక్కున్నారంటూ వ్యాన్ డ్రైవర్ అజిత్సింగ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- ఎం.కె.బేగ్ పాఠశాల వద్ద సగ్గుర్తి రవీంద్రబాబు అనే ఆటోడ్రైవర్ బొండా సిద్ధార్థ, జాన్వలీ, గరిమెళ్ల చిన్న, నవనీతం సాంబశివరావు, బంగారునాయుడు, వేల్పుల రాజేష్, నెలటూరి ఇందిర మరికొంత మంది దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- ఎం.కె.బేగ్ పాఠశాల వద్ద గోగుల విజయ్, హఫీజుల్లా, అమిత్, రమేష్రెడ్డి మరికొందరు తనను చేతులతో కొట్టి, బెదిరించి కులం పేరుతో దూషించారంటూ వేల్పుల రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెట్టుబడి అంటే పట్టుబడినట్టే.. లాభాల పేరుతో సైబర్ నేరగాళ్ల దందా
[ 19-05-2024]
విజయవాడ శివారు ప్రసాదంపాడుకు చెందిన ఓ యువకుడికి ఇటీవల ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీనిని ఆమోదించిన అతనికి బినాన్స్లో ఆన్లైన్ ట్రేడింగ్ చేయొచ్చని, పెద్ద మొత్తంలో రాబడులు వస్తాయని అవతలి వ్యక్తి ఆశ చూపించాడు. -
సైకిల్ సవారీ.. వేస్తారా దారి?
[ 19-05-2024]
విజయవాడ, మచిలీపట్నం నగరాల్లో ప్రజలు వాకింగ్ చేసేందుకు సరైన పార్కులు, ట్రాక్లు లేవు. వివిధ కళాశాలల ప్రాంగణాల్లో సంబంధిత యాజమాన్యాల అనుమతితో వేలాదిమంది ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ చేస్తున్నారు. -
విజ్ఞానం.. వినోదం
[ 19-05-2024]
తిరువూరు పట్టణంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక, గ్రేడ్-1 శాఖ గ్రంథాలయం, ఐడియాస్ సేవా సంస్థలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలకు విద్యార్థుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. -
ఈసారీ అదే తంతు..?
[ 19-05-2024]
పాఠశాలల పునః ప్రారంభసమయం సమీపిస్తోంది. బడులు తెరిచేనాటికే అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించామనీ, ఇప్పటికే పలు మండలాల్లోని ఎమ్మార్సీకేంద్రాలకు కొన్ని పుస్తకాలు చేరాయని తెలిపారు. -
చిలకలపూడి స్టేషన్లో సమస్యల కూత
[ 19-05-2024]
మచిలీపట్నంలో ప్రధాన రైల్వేస్టేషన్తో పాటు చిలకలపూడి స్టేషన్లో పలు సమస్యలు తిష్ఠ వేశాయి. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా రోల్డ్గోల్డ్ నగల వ్యాపారులు, వివిధ కళాశాలలకు వచ్చే విద్యార్థులు ఈ స్టేషన్నే ఆశ్రయిస్తారు. -
భక్తితో వాసవీ మాత జయంతి
[ 19-05-2024]
నగరంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాత జయంతి మహోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలకవర్గ ప్రతినిధులు మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాదు, మామిడి మురళీకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. -
కళాశాల అభివృద్ధిపై నిర్లక్ష్యం
[ 19-05-2024]
పెడన నియోజకవర్గంలో ఉన్న ఏకైక బంటుమిల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి అమడ దూరంలో ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. దీనిని 1997లో ప్రారంభించారు. -
నీ పరుగులేవమ్మ ... కృష్ణమ్మా..
[ 19-05-2024]
కృష్ణానది నీటిమట్టం రోజురోజుకు తగ్గుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చే నీరు లేకపోవడంతో నీటిమట్టం పడిపోతోంది. -
నీరుగారిన చెత్త నిర్వహణ
[ 19-05-2024]
మండల పరిధిలోని చెత్త నిర్వహణ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. రూ.లక్షలు వ్యయంతో నిర్మించిన కేంద్రాలను వినియోగించడం లేదు. ఫలితంగా గ్రామాల్లో రహదారుల వెంట చెత్త ఇష్టానుసారం పడేస్తున్నారు. 24 గ్రామాల్లో ఏడేళ్లనాడు చెత్త కేంద్రాలు నిర్మించారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీపై వ్యతిరేక ప్రచారం.. జైలుపాలైన ఉపాధ్యాయుడు
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు