అందుకే విజయవాడ పశ్చిమ సీటు ఇచ్చేశా: పవన్ కల్యాణ్
‘విజయవాడ పశ్చిమ సీటు జనసేనకే ఖాయమైంది. కానీ.. భాజపా అధినాయకత్వం నన్ను ఒక్కటే అడిగింది.
బెజవాడలో అభిమానుల బ్రహ్మరథం
కూటమి శ్రేణుల సమరోత్సాహం
అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్
ఈనాడు, డిజిటల్, అమరావతి - న్యూస్టుడే, విజయవాడ వన్టౌన్: ‘విజయవాడ పశ్చిమ సీటు జనసేనకే ఖాయమైంది. కానీ.. భాజపా అధినాయకత్వం నన్ను ఒక్కటే అడిగింది. మీకు అమరావతి కావాలంటే.. దానిలో మా ప్రాధాన్యం ఉండాలి కదా.. అన్నారు. విజయవాడలోని మూడు సీట్లలో ఇద్దరు తెదేపా నేతలు ఎప్పటి నుంచో ఉన్నారు.
అందుకే నేను త్యాగం చేశాను. కానీ.. పశ్చిమ సీటు వదిలేసేటప్పుడు రెండే అడిగాను. ఒకటి అమరావతి, రెండు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడాలని. వాళ్లు అంగీకరించడం వల్లే సీటును వదులుకున్నాను. పశ్చిమలో నేను తీర్చిదిద్దిన నాయకుడే ఇప్పుడు వైకాపా మాయలో పడి నన్ను తిడుతున్నారు. కానీ.. నేను ఇలాంటి వాటికి భయపడను. నేను అతడిని క్షమిస్తున్నానని’ పోతిన వెంకట మహేశ్ గురించి పరోక్షంగా ఆయన పేరు పలకకుండా పవన్ ప్రస్తావించారు.
మిద్దెనెక్కిన అభిమానం
పంజాసెంటర్ను గంజాయి కేంద్రం చేశారు..
రాష్ట్రంలో అరాచక పాలన పోవాలనే.. పవన్ కల్యాణ్ కూటమిని ఏర్పాటు చేశారు. మేమేం పదవులపై ఆశతో రాలేదు. ప్రజా సేవ చేయడానికి వచ్చాం. విజయవాడలోని ఈ పంజాసెంటర్ను.. గంజాయికి కేంద్రంగా వైకాపా మూకలు మార్చాయి. చీడ పురుగులు మనల్ని పాలిస్తున్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో జీవనం దుర్భరంగా మార్చారు. దుష్టపాలన పోగొట్టాలంటే.. మే 13న కూటమికి ఓటేయాలి. కూటమిని గెలిపించండి.
- యలమంచిలి సత్యనారాయణచౌదరి, విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి
కూటమి రాకతో రాష్ట్రం బాగుపడుతుంది..
పవన్ కల్యాణ్ వల్లే ఈరోజు కూటమి ఏర్పాటు సాధ్యమైంది. రాష్ట్రం బాగు కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నగరానికి ఆయన రాకతో డబుల్ జోష్ వచ్చింది. పవన్కు ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి. ఆయన త్యాగం వల్ల.. రాష్ట్రంలోని ప్రజలందరి మనస్సులో స్థిరంగా నిలిచిపోతారు. మళ్లీ కూటమి రాకతోనే.. ఈ రాష్ట్రం బాగుపడుతుంది.
- కేశినేని శివనాథ్(చిన్ని), కూటమి విజయవాడ లోక్సభ అభ్యర్థి
జగన్ ఎంత నొక్కారో చెప్పాలి
గత ఐదేళ్లలో.. తాను 130 సార్లు బటన్ నొక్కానంటూ చెప్పుకొంటున్న జగన్.. అసలు తానెంత నొక్కారో బయటపెట్టాలి. ఇది పార్టీలతో ఏర్పడిన కూటమి కాదు.. ప్రజా కూటమి. రాష్ట్రంలో జనసేన అధినేత పిలిస్తే.. 175 నియోజకవర్గాల్లోనూ జనసైన్యమే కదలి వస్తోంది. అదీ ఆయన స్థాయి. వైకాపా అరాచక పాలనను అంతమొందించడానికే.. ఈ కూటమి చేయిచేయి కలిపింది.
- వంగవీటి రాధాకృష్ణ, తెదేపా నేత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెగ్గేది మేమే.. తగ్గేది లేదే..!
[ 20-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడంతో.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువనే దానిపైనే అన్ని పార్టీల్లో, ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది. -
‘ఓటే’మాతరం
[ 20-05-2024]
ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటరే. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యతా వీరిదే. సమర్థులు ఇంట్లో ఉంటే.. అసమర్థులు రాజ్యమేలతారని ఓ సినీ రచయిత ఏనాడో చెప్పారు. -
డొక్కువి తప్పించరు.. కొత్తవి తెప్పించరు..
[ 20-05-2024]
ఆర్టీసీకి సకాలంలో కొత్త బస్సులు రాక.. పాత వాటినే నడపాల్సి వస్తోంది. ఫలితంగా నడిరోడ్లపై నిత్యం ఆగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. -
జాతీయ రహదారైతే మాకేంటి?
[ 20-05-2024]
16వ జాతీయ రహదారి వాహనాల పార్కింగ్కు అడ్డాగా మారిపోయింది. చెన్నై నుంచి కోల్కతా వరకు వ్యాపించి ఉన్న ఈ మార్గంలో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం పరిపాటైంది. -
ఓటమి భయంతోనే ముందస్తు దాడులు
[ 20-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తేలడంతోనే పోలింగ్ సందర్భంగా వైకాపా మూకలు ముందస్తు అల్లర్లు, దాడులకు దిగాయని తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. -
ఆసుపత్రి నుంచి కొనకళ్ల డిశ్ఛార్జి
[ 20-05-2024]
గుండెపోటుతో అస్వస్థతకు గురై గత నాలుగు రోజులుగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న మచిలీపట్నం మాజీ ఎంపీ, జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆదివారం డిశ్ఛార్జి అయ్యారు. -
ఓపెన్ చదరంగం విజేత మహేష్కుమార్
[ 20-05-2024]
తూర్పుగోదావరి జిల్లా చదరంగం సంఘ ఆధ్వర్యంలో ఫ్యూచర్కిడ్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం టోర్నమెంట్ ఆదివారం జరిగింది. -
నైపుణ్యనారీ.. విజయాల భేరి
[ 20-05-2024]
కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. -
అక్రమార్కులపై ఔదార్యం ఎందుకో..!
[ 20-05-2024]
ఇసుక అక్రమార్కులపై పోలీసు, రెవెన్యూ అధికారులు ఎనలేని ఔదార్యం చూపిస్తున్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఆదివారం తెల్లవారుజాము నుంచే మొదలైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. -
సీసాలో పెట్రోల్ పోయలేదని బెదిరింపుల
[ 20-05-2024]
సీసాలో లూజుగా పెట్రోల్ పోయనని చెప్పిన పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. బంక్ను తగలబెడతానన్న యువకుడిపై గవర్నర్పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. -
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేడు
[ 20-05-2024]
ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరువూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి వి.మల్లేశ్వరరావు తెలిపారు.