logo

గోడల మధ్య ఇరుక్కున్న బాలిక

సరదాగా ఆడుకుంటూ ప్రమాదవశాత్తు రెండుగోడల మధ్య ఇరుక్కుని ఓ బాలిక తీవ్ర అవస్థలు పడింది.

Updated : 16 Apr 2024 05:41 IST

తాడిపత్రి, న్యూస్‌టుడే: సరదాగా ఆడుకుంటూ ప్రమాదవశాత్తు రెండుగోడల మధ్య ఇరుక్కుని ఓ బాలిక తీవ్ర అవస్థలు పడింది. తాడిపత్రి మండలం ఆవులతిప్పాయపల్లికి చెందిన అవంతిక సోమవారం సాయంత్రం స్నేహితులతో సరదా ఆడుకుంటూ ఇంటి పక్కన ఉన్న రెండు గోడల మధ్యలో ఇరుక్కుపోయింది. బయటకు రాలేక బాలిక కేకలు వేయగా గమనించిన కుటుంబ సభ్యులు బాలికను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నం విఫలమవ్వడంతో పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు గంట పాటు శ్రమించి గోడలు పగులగొట్టి బాలికను బయటకు తీసినట్లు సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి తెలిపారు. బాలిక సురక్షితంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని