logo

బలవంతంగా వైకాపా కండువా.. అరగంటలోనే తెదేపాలోకి

బొమ్మనహాళ్‌లో పలువురు తెదేపా నాయకులకు, వైకాపా నాయకులు బలవంతంగా కండువాలు కప్పడం విమర్శలకు తావిచ్చింది.

Updated : 16 Apr 2024 05:40 IST

తెదేపా కండువాలు వేసుకున్న నాయకులు

బొమ్మనహాళ్‌, న్యూస్‌టుడే: బొమ్మనహాళ్‌లో పలువురు తెదేపా నాయకులకు, వైకాపా నాయకులు బలవంతంగా కండువాలు కప్పడం విమర్శలకు తావిచ్చింది. స్థానిక తెదేపా నాయకులు నాగిరెడ్డి, మల్లి, బసవరాజు, పాలాక్షిలను సోమవారం వైకాపా నాయకుడు బసవరాజు తన ఇంట్లో సంఘం సమావేశం ఉందని పిలిపించారు. అక్కడ రాయదుర్గం వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి చేత బలవంతంగా పార్టీ కండువాలు వేయించారు. అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిన వారు తెదేపా మండల మాజీ ఉపాధ్యక్షుడు పయ్యావుల మోహన్‌బాబు, పయ్యావుల అనిల్‌ సమక్షంలో పార్టీలో చేరి కండువాలు కప్పుకున్నారు. తమకు మాయ మాటలు చెప్పి వైకాపా కండువాలు వేశారని బాధితులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని