logo

తెదేపాతోనే సామాజిక న్యాయం

తెదేపా ప్రజల కోసమే పనిచేస్తుందని, అన్నివర్గాల వారికి సామాజిక న్యాయం చేస్తూ అభివృద్ధికి బాటలు వేస్తుందని హిందూపురం పార్లమెంటు అభ్యర్థి బీకే పార్థసారథి పేర్కొన్నారు.

Published : 16 Apr 2024 03:10 IST

ప్రచార రథం నుంచి ప్రసంగిస్తున్న  హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ
తెదేపా అభ్యర్థి బీకే, పెనుకొండ అసెంబ్లీ అభ్యర్థి సవిత

గోరంట్ల, న్యూస్‌టుడే: తెదేపా ప్రజల కోసమే పనిచేస్తుందని, అన్నివర్గాల వారికి సామాజిక న్యాయం చేస్తూ అభివృద్ధికి బాటలు వేస్తుందని హిందూపురం పార్లమెంటు అభ్యర్థి బీకే పార్థసారథి పేర్కొన్నారు. గోరంట్ల మండలంలోని గౌనివారిపల్లి పంచాయతీ పరిధిలోని చెట్లమొరంపల్లి, భగవంతంపల్లి, కమ్మలవాండ్లపల్లి, గౌనివారిపల్లి, శీనప్పల్లి గ్రామాల్లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అసెంబ్లీ కూటమి అభ్యర్థి సవితతో కలిసి బీకే రెండు గ్రామాల్లో మాత్రం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా చంద్రబాబునాయుడు భవిష్యత్తు ఆలోచిస్తారని తెలిపారు. రాష్ట్రంలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండుకళ్లుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన విజన్‌ ఉన్న నాయకుడిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సవిత మాట్లాడుతూ ప్రతిఒక్కరూ సైనికుల్లా పనిచేసి పెనుకొండ కోటపై తెదేపా జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో మండల కన్వీనర్‌ సోమశేఖర్‌, ఆ పంచాయతీ నాయకులు రంగప్ప, ఉత్తమరెడ్డి, శ్రీనివాసులు, రవికుమార్‌, తిరుపాల్‌, నాగభూషణ, వివిధ పంచాయతీలకు చెందిన నాయకులు, కార్యకర్యలు, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని