logo

అసమర్థ ప్రభుత్వాన్ని సాగనంపండి: కేశవ్‌

తాగు, సాగు నీరు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ పిలుపునిచ్చారు.

Published : 07 May 2024 05:05 IST

కొనకొండ్లలో ప్రసంగిస్తున్న పయ్యావుల కేశవ్‌, పక్కన ప్రభాకర్‌చౌదరి

వజ్రకరూరు, న్యూస్‌టుడే: తాగు, సాగు నీరు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన వజ్రకరూరు మండలంలోని చిన్నహోతూరు, గడేహోతూరు, కొనకొండ్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశవ్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లిన తాను చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. ప్రజా సంక్షేమాన్ని మరిచిన విశ్వేశ్వరరెడ్డికి అండగా నిలుస్తారా.. అభివృద్ధికి పాటుపడే తనకు అండగా నిలుస్తారా అని ప్రజలను అడిగారు. తాను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కొనకొండ్లలో తాగునీటి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రైతుల కోసం లష్కర్‌లా పని చేస్తానని తెలిపారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. పని చేసే వారికే పట్టం కట్టాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే కేశవ్‌కు అండగా నిలవాలని ప్రభాకర్‌చౌదరి ప్రజలను కోరారు. కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్‌ వెంకటేశులు, నాయకులు డాక్టర్‌ నాగభూషణం, నాగేంద్ర, దస్తగిరి, సుధాకర్‌, మనోహర్‌, గౌతమ్‌, మునిస్వామి, శ్రీనివాసులు, రవి, తిమ్మప్ప, ఈశ్వరయ్య, వన్నూరుస్వామి, మోహన్‌రావు, వేణు, నారాయణస్వామి, రమణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని