logo

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

వేరే పార్టీకి ఓటు వేస్తే ఎలాంటి పథకాలు రావని ధర్మవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓటర్లను బెదిరించేలా మాట్లాడారు.

Published : 10 May 2024 03:49 IST

బత్తలపల్లి, న్యూస్‌టుడే : వేరే పార్టీకి ఓటు వేస్తే ఎలాంటి పథకాలు రావని ధర్మవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓటర్లను బెదిరించేలా మాట్లాడారు. గురువారం బత్తలపల్లిలో రోడ్డుషో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భాజపా అభ్యర్థి సత్యకుమార్‌ పెద్ద మాయల మరాఠీÈ అని ఎద్దేవా చేశారు. ఇటీవల వైకాపాను వీడి భాజపాలోకి చేరిన కురబ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ సూర్యప్రకాశ్‌ బాబుపై పరోక్షంగా విమర్శలు చేశారు. రోడ్డు షో కారణంగా జనం ఇబ్బంది పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు