మూడేళ్లు.. 2,103 ప్రమాదాలు
జిల్లాలో జాతీయ.. రాష్ట్ర రహదారులు విస్తరించాయని సంబరపడినా రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు. అందులోనూ బ్లాక్స్పాట్స్, హాట్స్పాట్స్గా గుర్తించిన ప్రాంతాల్లోనే అధికమవుతున్నాయి.
కారణాలు గుర్తించినా చర్యలేవీ..
ప్రతిపాదనలకే రవాణా, పోలీసు శాఖల సర్వే
న్యూస్టుడే, చిత్తూరు(నేరవార్తలు)
పూతలపట్టు: ప్రమాదాల కూడలి రంగంపేట క్రాస్
జిల్లాలో జాతీయ.. రాష్ట్ర రహదారులు విస్తరించాయని సంబరపడినా రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు. అందులోనూ బ్లాక్స్పాట్స్, హాట్స్పాట్స్గా గుర్తించిన ప్రాంతాల్లోనే అధికమవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో రవాణా, పోలీసు శాఖ అధికారులు కలిసి సర్వే చేపట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వానికి నివేదించారు. ఇందుకు సుమారు రూ.45 లక్షల వరకు ఖర్చవుతుందని లెక్కలు కూడా తేల్చారు. నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఇకనైనా స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
25 బ్లాక్ స్పాట్లు
మూడేళ్లలో కనీసం ఐదు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను అధికారులు బ్లాక్స్పాట్స్గా సూచిస్తూ.. జిల్లాలో 25 ప్రాంతాలను గుర్తించారు. అందుకు కారణాలను కూడా గుర్తించి నివేదిక సిద్ధం చేశారు. అందులో.. ప్రధానంగా స్టాపర్స్, బ్లింకింగ్ లైట్లు, జీబ్రా లైన్లు లేవని గుర్తించారు. వీటితో పాటు స్పీడ్ బ్రేకర్లు, స్పీడ్ లిమిట్ బోర్డులు, సూచిక బోర్డులు అవసరమని నిర్ధారించారు.
తొమ్మిది హాట్స్పాట్లు
జిల్లాలో అధికారులు సర్వే చేపట్టి.. తొమ్మిది ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించారు. గత మూడేళ్లలో ఈ ప్రాంతాల్లో 118 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు తేల్చారు. అందులో.. కేజీ సత్రం, చీలాపల్లి, మొగిలిఘాట్, కుప్పం - విజలాపురం మలుపు, పలమనేరు - జగమర్ల మలుపు, యాదమరి వరిగిపల్లి కూడలి, చిత్తూరు నగరం మురం కబట్టు కూడలి, ఆళ్ల కుప్పంలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలకు కారణాలు కూడా తేల్చి.. నివేదిక సిద్ధం చేశారు. ప్రధానంగా కూడళ్లు ప్రమాదకరంగా ఉండడం.. వాహనాల రద్దీ పెరగడం, రహదారి పక్కనే కల్వర్టు, పెట్రోలు బంక్లు ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు నిర్ధారించారు.
ఎక్కడె క్కడంటే..
చిత్తూరు: మురకంబట్టులో సమీపంలో బ్లాక్స్పాట్ వద్ద బారికేడ్ ఏర్పాటు చేస్తున్న పోలీసులు
తవణంపల్లెలోని తెల్లగుండ్లపల్లి గ్రామం, చిత్తూరు హైరోడ్డు, మురకంబట్టు కూడలి, కల్లూరులోని కోమిరెడ్డిపల్లి, గుడిపాలలోని కిల్లారపల్లి కూడలి, చిత్తూరు గంగాసాగరం, మొగిలిఘాట్, గంగవరంలోని పొన్నమకుపలపల్లి మలుపు, ఆళ్లకుప్పం, కుప్పంలోని కేసీ ఆసుపత్రి, రాళ్లబుదుగూరులోని కడపల్లి గ్రామ మార్గం, నాయనపల్లి పెట్రోలు బంకు మార్గం, వి.కోట జావినిపల్లి మలుపు, కుమ్మరమడుగుమలుపు, కృష్ణాపురం మలుపు, అన్నవరం మలుపు, బైరెడ్డిపల్లిలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద, కుటలవంక మలుపు, పుంగనూరులోని వర్షాదాబా, సుగాలిమిట్ట మలుపు, తోపుమట్టం, రొంపిచెర్లలోని మట్లోల్లపల్లి, నగరిలోని ఏరియా ఆస్పత్రి మార్గం, గంగాధరనెల్లూరులో ఠానా కూడలి, కార్వేటినగరంలోని తురకమిట్టమలుపు.
కనిపించని ప్రణాళిక
రోడ్డు ప్రమాదాలకు కారణాలు, బ్లాక్, హాట్స్పాట్లను గుర్తించినా.. వాటి నివారణకు అధికారుల యాక్షన్ ప్లాన్ అమలు చేయలేకపోతున్నారు. ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే అధికారులు స్థానికంగా సర్వే చేపట్టి, ప్రమాదాలకు కారణాలను గుర్తిస్తూ.. పాలనాధికారి, ఎస్పీ, డీటీసీలకు నివేదికలు పంపించి మిన్నకుండిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అధికారులు సర్వే చేపట్టి ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించినా ఆయా ప్రాంతాల్లో నేటికీ ఎలాంటి అడుగులు పడలేదు.
నిధులు రాగానే.. బసిరెడ్డి, డీటీసీ
పోలీసు శాఖతో కలసి బ్లాక్స్పాట్లు ఉన్న ప్రాంతాలను పరిశీలించాం. స్థానికంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో రూ.45 లక్షలతో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే అన్ని ఏర్పాట్లు చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
[ 27-04-2024]
జగనన్న ఎడాపెడా బాదుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. -
ఆయన ‘చె’ప్పింది ‘వి’నాల్సిందే
[ 27-04-2024]
చంద్రగిరి దుర్గానికి చెందిన కీలక వైకాపా నేత దౌర్జన్యాలు, దోపిడీలకు అంతే లేదు. నుదుటిపై బొట్టుతో నవ్వుతూ గంగి గోవులా కనిపించే ఈ నేతను చూస్తే నియోజకవర్గ ప్రజలు వణికిపోయే పరిస్థితికి వచ్చారు. -
‘ఇసుఖ’శాంతులన్నీ వైకాపా మేతలకే
[ 27-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రకృతి సంపద సర్వనాశనమైంది. సామాన్యులు ఇళ్లు కట్టుకోవడానికి అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచడానికి బదులు ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు యథేచ్ఛగా దోచేశారు. -
అటవీశాఖ మంత్రి.. ‘పెద్ద’ మనసు లేని వైచిత్రి
[ 27-04-2024]
అడవుల్లో స్వేచ్ఛగా విహరించాల్సిన వన్యప్రాణులు దాహం.. ఆకలి బాధలు తట్టుకోలేక జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆహారం, నీటి అన్వేషణలో.. జనావాసాల వైపు వస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. -
జగన్ జమానా.. ఖర్మ నాయనా..!
[ 27-04-2024]
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు అప్పు అడిగితే వెతుక్కుని మరీవచ్చి ఇచ్చేవారు.. ఎందుకంటే ప్రతినెలా ఒకటో తేదీన జీతం వస్తుంది కాబట్టి.. ప్రతి నెలా తేదీ తప్పకుండా నగదు వాయిదా పద్ధతిలో చెల్లిస్తారనే నమ్మకంతో.. కానీ వైకాపా హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి తారుమారైంది.. -
నిజాలు చెబితే తాఖీదులు
[ 27-04-2024]
‘ఎప్పుడూ సత్యం పలుకవలెను, అబద్ధాలు చెప్పరాదు’ అంటూ విద్యార్థులకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజాలు అప్లోడ్ చేస్తే షోకాజ్ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. -
వైకాపాకే వంతపాడిన యంత్రాంగం
[ 27-04-2024]
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఊదరగొడుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం వైకాపాకే వంత పాడుతున్నారు. -
‘వైకాపా పాలనలో అత్యాచారాల్లో ఏపీకి అగ్రస్థానం’
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే మహిళా సాధికారత సాధ్యమని ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. -
నిన్న అనుమతించలేదు.. నేడు తిరస్కరించారు..
[ 27-04-2024]
నామినేషన్ల చివరి రోజు గురువారం చిత్తూరు ఎంపీ అభ్యర్థినిగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి చెందిన భూలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. -
ఇసుకలో దోచేసి..మట్టితో దండుకుని
[ 27-04-2024]
వైకాపా నేతలకు ఇసుక, మట్టి ఆదాయ వనరులుగా మారాయి.. ఇసుక, చెరువులు, గుట్టల నుంచి మట్టిని దర్జాగా తరలించి జేబులు నింపుకొంటున్నారు.. -
‘తెదేపాను గెలిపించండి.. రాష్ట్రాన్ని రక్షించండి’
[ 27-04-2024]
తెదేపా కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని రక్షించాలని తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ సతీమణి ప్రతిమ అన్నారు. -
ఎస్బీ కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోండి
[ 27-04-2024]
స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ)లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్ దాము.. చిత్తూరు వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ -
ముగిసిన పరిశీలన.. మిగిలింది ఉపసంహరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఆమోదం 177.. తిరస్కారం 50
[ 27-04-2024]
నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం పూర్తయింది. -
తిరస్కరణ భయం.. బరిలో భార్యలు, వారసులు
[ 27-04-2024]
సార్వత్రిక సమరం 2024లో కీలకమైన నామపత్రాల స్వీకరణ పర్వం ముగిసింది. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
[ 27-04-2024]
చిత్తూరు పలమనేరు జాతీయ రహదారిలోని గుండ్లకట్టమంచి వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మహిళ మృతి చెందిందని ఏఎస్సై రామచంద్రారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు