నిఘా లేని ఘాట్!
గతనెల 29న కోలారుకు చెందిన 13 మంది భక్తులు శ్రీవారి దర్శనానంతరం టెంపోలో మొదటి ఘాట్రోడ్డులో తిరుపతికి వస్తూ 6వ మలుపు వద్ద ప్రమాదానికి గురయ్యారు.
ప్రమాదాలు పట్టని రవాణా శాఖ
ఖాళీగా తిరుమల ఎంవీఐ పోస్టు
న్యూస్టుడే, తిరుపతి (నేరవిభాగం), తిరుమల
మోకాళ్ల మెట్టు నుంచి తిరుపతికి వస్తున్న వాహనాలు
గతనెల 29న కోలారుకు చెందిన 13 మంది భక్తులు శ్రీవారి దర్శనానంతరం టెంపోలో మొదటి ఘాట్రోడ్డులో తిరుపతికి వస్తూ 6వ మలుపు వద్ద ప్రమాదానికి గురయ్యారు. డ్రైవరుకు విశ్రాంతి లేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిజానికి 8 గంటలకు మించి వాహనం నడపకూడదని ఎంవీఐ చట్టం చెబుతోంది. కోలారు నుంచి ఒకే డ్రైవరు తిరుమల వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో అలసిపోయి ప్రమాదం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా తీసుకెళ్లగలరా.. లేదా అనే నిఘా పెట్టే యంత్రాంగం లేదు.
గతనెల 31న తిరుమల మొదటిఘాట్ చివరి మలుపు వద్ద జీపు బారికేడ్లను ఢీ కొట్టింది. ఎవరికీ గాయాలు కాకపోయినా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. డ్రైవరు వాహన చోదక అనుమతి కలిగి ఉన్నారా.. వాహన సామర్థ్యం ఏ మేరకు ఉంది.. నిర్ణయించిన సమయానికి లోబడి వాహనం నడుపుతున్నారా.. లేదా అని పరిశీలించే వ్యవస్థ లోపించింది.
దూర ప్రాంత వాహనదారులకు తిరుమల ఘాట్రోడ్లపై అవగాహనలేమి.. కాలం చెల్లిన ట్యాక్సీల అతివేగం.. నిష్ణాతులైన చోదకులు తగ్గిపోవడం వంటి కారణాలతో ఇటీవల తిరుపతి- తిరుమల ఘాట్రోడ్లలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సొంత వాహనదారులకు చోదక అనుమతులు (డీఎల్) ఉన్నప్పటికీ ఘాట్రోడ్డుపై అవగాహనలేక డివైడర్ను ఢీ కొడుతున్నారు. ఘాట్ ప్రమాద ఘటనలపై నిత్యం నిఘా పెట్టాల్సిన రవాణా శాఖ పట్టించుకోవడం లేదు. ఐదేళ్లుగా తిరుమల ఎంవీఐ అధికారి లేకపోవడంతో నిఘా కొరవడింది.
అవన్నీ బుట్టదాఖలు: ఐదేళ్ల కిందట ఘాట్రోడ్డులో ప్రమాదాల నివారణకు పలు విభాగాల అధికారులతో కూడిన కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఘాట్లోని రక్షణ గోడ పటిష్ఠ పరచడం, రోడ్డు రీ డివిజన్ చేయడం, ప్రమాదకర ప్రాంతాల్లో క్రాస్ బ్యారియర్స్, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు అవశ్యమని సూచించింది. మోకాళ్ల పర్వతం వద్ద రోడ్డుపై నడిచి వెళ్లే వారికి వారధి, రాత్రుల్లో తగినంత వెలుతురు మెరుగు పరచాలని కమిటీ పేర్కొంది. ఇవేమీ అమలు కావడం లేదు.
కాల వ్యవధి కొలిచేదెవరు?
ఇది వరకు నిర్ణయించిన 40 నిమిషాల ప్రయాణ కాల వ్యవధిని పట్టించుకోవడం లేదు. అతివేగం.. ముందు వాహనాలను అధిగమించే క్రమంలో అదుపు తప్పుతున్నాయి. అలాగే ప్రయాణ కాలవ్యవధిని తప్పించుకునేందుకు తిరుమల నుంచి వేగంగా వచ్చి దివ్యారామం వద్ద, అలాగే తిరుమలలో జీఎన్సీ టోల్గేట్ వద్ద వాహనాలు నిలిపి ఉంచుతున్నారు. కాల వ్యవధిని గురించి ఆర్టీఏ, తితిదే విజిలెన్స్ పట్టించుకోనందున అతివేగం ఎక్కువైంది.
ఘాట్లో నిర్ణీత వేగం ఎంత?
తిరుమల ఘాట్రోడ్డులో ఎంత వేగంగా వాహనాలు ప్రయాణించాలనే నిర్ణయం ఇంత వరకు జరగలేదు. రెండు మార్గాల్లో స్పీడ్ గన్స్ అందుబాటులోకి తెస్తే అతివేగం.. వాహనాలను అధిగమించడం తగ్గుతుంది.
మరుగున పడిన ప్రతిపాదన
15 ఏళ్లు దాటిన వాహనాలను స్వాధీనం చేసుకుని.. వాటి స్థానంలో కొత్తవి అందజేసి నెలవారీ రికవరీ చేసుకునే ప్రతిపాదనతో ఓ మోటారు కంపెనీ తితిదేకి గతంలో ప్రతిపాదన పంపగా మరుగున పడింది.
అవగాహన లేమి: డీఎల్ అనుమతి ఉన్న సొంత వాహనదారులు, ఇతర ప్రాంతాల డ్రైవర్లు అలిపిరికి వస్తే ఘాట్రోడ్డులోకి అనుమతిస్తున్నారు. అసలు ఘాట్రోడ్డుపై వారికి అవగాహన ఎంత మేరకు ఉందనే విషయాన్ని గుర్తించడం లేదు. డ్రైవరు ఎంత దూరం నుంచి వాహనాన్ని నడుపుతూ వచ్చారు. ఘాట్లోకి అనుమతిస్తే అప్రమత్తంగా ఉండగలరా లేదా అనే విషయమై నిఘా పెట్టాల్సి ఉంది.
ప్రమాదాలకు కారణాలివే..
సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, అతివేగం, అటవీ జంతువులను చూసి అకస్మాత్తుగా వాహనాలు ఆపడం, సెల్ఫీల కోసం వాహనాలు నిలపడం, బ్రేక్ ఫెయిల్ కావడం, పరిమితికి మించి భక్తులను తీసుకెళ్లడం.
30కి పైగా ఘటనలు
ఆరునెలల వ్యవధిలో ఘాట్ రోడ్లలో 30కి పైగా ప్రమాదాలు జరిగాయి. 40 మంది వరకు గాయపడ్డారు. ఇద్దరు భక్తులు మృతి చెందారు.
సంయుక్తంగా తనిఖీలు ప్రారంభించాం
- కె.సీతారామిరెడ్డి, డీటీవో, తిరుపతి
ఘాట్రోడ్లలో తితిదే విజిలెన్స్, తిరుమల పోలీసు, ఆర్టీఏ శాఖల అధికారులు సంయుక్తంగా దిగువ ఘాట్లోకి వచ్చే వాహనాలను తనిఖీ చేశాం. ఇకపై కొనసాగిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోపాలరావు వంక.. గుటకాయ స్వాహా..!
[ 17-05-2024]
కుప్పం- పలమనేరు జాతీయ రహదారి పక్కన భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. మంచి ధరలు పలుకుతుండటంతో.. ప్రభుత్వ స్థలాలపై అక్రమార్కుల కన్ను పడింది. -
ఎవరి కళ్లకు కడతారు గంతలు?
[ 17-05-2024]
ఎక్కడైనా ప్రకృతి వనరులను అక్రమార్కులు దోచేస్తుంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వం రంగంలోకి దిగి తవ్వకాలు, రవాణాను నిలిపేస్తుంది. -
శివయ్యా.. ఇదేం ఘోరమయ్యా
[ 17-05-2024]
శివయ్య సేవలో తరించడానికి వెళ్లిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆడపిల్లలను మృత్యువు రూపంలో చెరువు మింగేసింది. -
సర్వదర్శనానికి 18 గంటలు
[ 17-05-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లో వేచి ఉన్నారు. -
ప్రవేశాల ప్రకటన ఆలస్యమేనా..?
[ 17-05-2024]
పది తర్వాత వ్యవసాయ పాలిటెక్నిక్లో భాగంగా మూడేళ్లు డిప్లమో చదివితే ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఆ కోర్సుల్లో చేరేందుకు అవసరమైన ప్రవేశ ప్రకటన ఈ ఏడాది ఆలస్యం కానుంది. -
క్షేత్రస్థాయికి వెళ్తే.. కార్యాలయానికి తాళమే
[ 17-05-2024]
సచివాలయ వ్యవస్థతో గొప్ప మార్పు తెచ్చామని.. ప్రజల ముగింటకే అధికారులను తెచ్చామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. -
జీతాలు చెల్లించండి.. మహాప్రభో
[ 17-05-2024]
తమకు న్యాయంగా అందాల్సిన జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయా డెయిరీ కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష ఎనిమిది నెలలుగా కొనసాగుతోంది. -
విచారణకు పిలిచి చితకబాదిన ఎస్సై?
[ 17-05-2024]
సోదరుల ఘర్షణ కేసులో విచారణకు పిలిచిన ఎస్సై కులం పేరుతో దూషించి.. లాఠీతో చితకబాదారని రామకుప్పం మండలం వీర్ణమల తండాకు చెందిన వెంకటేశ్నాయక్ ఆరోపించారు. -
సూత్రదారితెన్నూ లేని దర్యాప్తు
[ 17-05-2024]
తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనలో పోలీసులు ఇంకా వైకాపా నేతలకు వంత పాడుతూనే ఉన్నారు. -
బండ వేషం.. జాతర విశేషం
[ 17-05-2024]
గంగజాతరలో బండ వేషధారణలు అలరించాయి. తిరుపతి ప్రజల ఇలవేల్పుగా.. పిలిస్తే పలికే దైవంగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర రెండోరోజు గురువారం సందడిగా సాగింది. -
వేసవి శిబిరాలు లేనట్టే..!
[ 17-05-2024]
వేసవి సెలవులంటే పాఠశాల విద్యార్థులకు, చిన్నారులకు పండగనే చెప్పాలి. స్నేహితులతో కలిసి ఆటలాడుకుంటూ వినోదం.. ఉల్లాసం.. ఉత్సాహాన్ని పొందుతుంటారు. -
అటకెక్కిన భూసార పరీక్షలు
[ 17-05-2024]
భూసార పరీక్షలు అటకెక్కాయి. సాగులో మట్టి నమూనాలు కీలకం కాగా ప్రభుత్వం వీటిని గాలికి వదిలేసింది. ఎక్కడో ఓ చోట తీసి అయ్యిందనిపిస్తున్నారు. -
చెవికెక్కించుకుంటే ఇంతే..!
[ 17-05-2024]
వైకాపా నేతలతో భుజాలు రాసుకుని వారి చెప్పినట్లు వంతపాడిన అధికారులపై సీఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైనట్లు అధికారులు నిర్ధారించారు. -
వీరూ ఆ ఫ్యానుముక్కలే
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. అందుకు బాధ్యులైన జిల్లా పోలీసు బాస్ కృష్ణకాంత్ పటేల్పై బదిలీ వేటు వేసింది. -
ముఖ్యమంత్రి జగన్ను అరెస్టు చేయాలి
[ 17-05-2024]
ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో లెక్కకు మిక్కిలి అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. -
మహిళా వర్సిటీకి మాయని మచ్చ
[ 17-05-2024]
శ్రీపద్మావతి మహిళా వర్సిటీ అవరణలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన మాయని మచ్చగా మారింది. -
ఆరోగ్య కేంద్రాల సేవలు అరకొరే
[ 17-05-2024]
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలూ వైద్య సేవలు గగనంగా మారాయి. కాన్పులు సైతం జరగడం లేదు. పలుచోట్ల వైద్యులు, సిబ్బంది విధులకు డుమ్మా కొట్టి తిరుగుతున్నా.. పట్టించుకునే వారేలేరు. -
ఓటమి భయంతోనే వైకాపా దాడులు
[ 17-05-2024]
వైకాపా ప్రభుత్వం ఓటమి భయంతోనే దాడులకు దిగుతోందని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు. ఇటీవల వైకాపా మూకల దాడిలో గాయపడిన తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని తనపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి గురువారం పరామర్శించారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
[ 17-05-2024]
శ్రీవారిని పలువురు ప్రముఖులు గురువారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని భాజపా నాయకులు... -
తెదేపా ఏజెంట్ల కిడ్నాప్ వ్యవహారంలో పురోగతి
[ 17-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలంలో వైకాపా నాయకులపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. -
ప్రత్యేక తరగతులు ఎక్కడ?
[ 17-05-2024]
పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 24 నుంచి సప్లిమెంటరరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన పరీక్షల్లో 2,006 మంది ఫెయిల్ అయ్యారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జేసీ శ్రీనివాసులు ఆదేశించారు. చిత్తూరు ఎస్వీ సెట్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. -
వేరుసెనగ విత్తన ధర ఖరారు
[ 17-05-2024]
త్వరలో మొదలుకానున్న ఖరీఫ్ సీజన్కు వేరుసెనగ విత్తన కాయల ధరలు ఖరారయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
బీసీజీ టీకా వేయించుకోండి
[ 17-05-2024]
జిల్లాలోని వృద్ధులు, 18 ఏళ్లు నిండిన మధుమేహ, క్షయ వ్యాధిగ్రస్థులు, వారి కుటుంబ సభ్యులందరూ అడల్ట్ బీసీజీ టీకాను వేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని డీఎంహెచ్వో ప్రభావతీదేవి కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి