రాళ్ల దాడి మరో డ్రామా
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై రాళ్ల దాడి మరో డ్రామా అని తెలుగు మహిళ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షురాలు కార్జాల అరుణ ఆరోపించారు
మాట్లాడుతున్న అరుణ
చిత్తూరు(జిల్లా పంచాయతీ): ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై రాళ్ల దాడి మరో డ్రామా అని తెలుగు మహిళ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షురాలు కార్జాల అరుణ ఆరోపించారు. సోమవారం చిత్తూరు నగరంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా లాగా.. ఇప్పుడు ఎన్నికల్లో మరో డ్రామాకు తెర తీసినట్లు విమర్శించారు. తెదేపా అధినేత చంద్రబాబుపై దాడులు జరిగినప్పుడు సానుభూతి కోసమని మాట్లాడిన మంత్రులు ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారన్నారు. గాజువాకలో చంద్రబాబుపై రాళ్లదాడిని ఖండించారు. తెలుగుమహిళలు గురజాల ప్రతిమ, నాగలక్ష్మి, వరలక్ష్మి, రాణి, అన్నపూర్ణ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!