logo

మా అడ్డాలో ప్రచారమా?

పెళ్లకూరు మండలం చిల్లకూరులో తెదేపా ప్రచార వాహనం(ఆటో)పై వైకాపాకు చెందిన అల్లరి మూకలు దాడి చేసినట్లు బాధితుడు గోపీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Published : 16 Apr 2024 01:38 IST

తెదేపా వాహనంపై వైకాపా మూకల దాడి

పెళ్లకూరు, న్యూస్‌టుడే: పెళ్లకూరు మండలం చిల్లకూరులో తెదేపా ప్రచార వాహనం(ఆటో)పై వైకాపాకు చెందిన అల్లరి మూకలు దాడి చేసినట్లు బాధితుడు గోపీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిల్లకూరులో సోమవారం మధ్యాహ్నం ప్రచారంలో భాగంగా అనుమతి ఉన్న ఆటోతో పాటలు పెట్టి ఉండగా ఇదే గ్రామానికి  చెందిన కొందరు వ్యక్తులు ‘ఏందిరా ఇక్కడ ప్రచారం.. ఇది మా అడ్డా.. ఎవరి అనుమతితో తిరుగుతున్నావ్‌’ అంటూ దుర్భాషలాడి ఆటోకి ఉన్న పోస్టర్‌ని చించేశారు. ఇదే గ్రామానికి చెందిన ఎన్‌డీసీసీబీ ఛైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి తన అనుచరుల ద్వారా ఇలా చేయించినట్లు బాధితుడు పేర్కొన్నారు. మరోవైపు ఆటోని, ఫిర్యాదుదారుడిని పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లారు. నిందితులను పట్టుకోవడంతో విఫలమైనట్లు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ సీసీ కెమెరాలున్నా నిందితులను పట్టుకోలేని స్థితిలో వ్యవస్థ ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని