వైకాపా భూస్మాసురులు
పేదలకు దక్కాల్సిన డీకేటీ భూములు వైకాపా అభ్యర్థుల సొంతమయ్యాయి. ఈ మేరకు వారే ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లలో పేర్కొనడం గమనార్హం.
డీకేటీ భూములు స్వాహా
ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో వెల్లడి
ఈనాడు-తిరుపతి: పేదలకు దక్కాల్సిన డీకేటీ భూములు వైకాపా అభ్యర్థుల సొంతమయ్యాయి. ఈ మేరకు వారే ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లలో పేర్కొనడం గమనార్హం.
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో ఒక్కసారిగా తెరమీదకు వచ్చి ప్రస్తుత ఎంపీ మద్దెల గురుమూర్తి పేరిట రెండు ఎకరాల డీకేటీ భూమి ఉంది. మన్నసముద్రం గ్రామంలోని 332/5 సర్వే నంబరులో 2018లో ప్రభుత్వం ఆయనకు ఇచ్చినట్లు రికార్డుల్లో పొందుపర్చారు. ఈయన పేరిట సొంతంగా కారు లేదు. ఎంపీ భార్య పేరుతో మాత్రమే కారు ఉన్నట్లు చూపించారు.
గూడూరు వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్కు సైతం డీకేటీ భూమి ఉంది. ఆయన పేరిట రాపూరులోని 1148/1 సర్వే నంబరులో ఐదు ఎకరాల భూమి ఉంది. ఆయనకు రాపూరులో సుమారు 42 అంకణాల్లో (5190 చ.అ.)ల విస్తీర్ణంలో రూ.1.50 కోట్ల విలువైన వాణిజ్య భవనం ఉంది. రూ.73.81 లక్షల అప్పులున్న మేరిగ మురళీధర్కు నిరుపేదలకు దక్కాల్సిన డీకేటీ పట్టాలు ఉండటం గమనార్హం.
- మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పేరిట రూ.41,974 మాత్రమే ఉన్నాయి. చేతిలో రూ.40వేలు, హరేకృష్ణ ఎస్బీఐ బ్రాంచిలో రూ.1974 మాత్రమే ఉన్నట్లు ఎన్నికల సంఘానికి నివేదించారు.
- సత్యవేడు కూటమి అభ్యర్థి ఆదిమూలం, అతని భార్య వద్ద 60 గ్రాముల బంగారం మాత్రమే ఉంది. వీటి విలువ రూ.1.80 లక్షలు కావడం గమనార్హం.
- సూళ్లూరుపేట కూటమి అభ్యర్థిని నెలవల విజయశ్రీకి పేరిట 1.75 ఎకరాలు, భర్త పేరుతో ఎకరం భూమి మాత్రమే ఉంది. దంపతులిద్దరికీ కలిపి 150 గ్రాముల బంగారం ఉన్నట్లు అఫిడవిట్లో చూపారు. విజయశ్రీ పేరుతో రెండు గ్యాస్ ట్యాంకర్లు, ఓమినీ బస్సు, అశోక్ లేల్యాండ్ స్టేజి క్యారియర్ ఉన్నాయి.
లోక్సభ స్థానం- తిరుపతి
- అభ్యర్థి : మద్దిల గురుమూర్తి
- పార్టీ : వైకాపా
- ఐటీ చెల్లింపులు : రూ.12,16,960 (2022-23)
- ఆస్తుల విలువ : రూ.67,91,014
- భార్య పేరిట : రూ.51,42,520
- అప్పులు : రూ.10,97,657
లోక్సభ స్థానం: తిరుపతి
- అభ్యర్థి : చింతా మోహన్
- పార్టీ : కాంగ్రెస్
- ఐటీ చెల్లింపులు : 6,60,000 (2022-23)
- ఆస్తుల విలువ : రూ.41,974
- భార్య పేరిట : రూ.2,27,33,300
- అప్పులు : లేవు
అసెంబ్లీ - గూడూరు
- అభ్యర్థి : మేరిగ మురళీధర్
- పార్టీ : వైకాపా
- ఐటీ చెల్లింపులు : రూ.6,95,180 (2022-23)
- ఆస్తుల విలువ : రూ.2,12,68,850
- భార్య పేరిట : రూ.66,30,000
- అప్పులు : రూ.73,81,740
అసెంబ్లీ: సత్యవేడు
- అభ్యర్థి : కోనేటి ఆదిమూలం
- పార్టీ : తెదేపా
- ఐటీ చెల్లింపులు : రూ.2,580 (2022-23)
- ఆస్తుల విలువ : రూ.85,71,198
- భార్య పేరిట : రూ.10,47,719
- అప్పులు : లేవు
అసెంబ్లీ: సూళ్లూరుపేట
- అభ్యర్థి : నెలవల విజయశ్రీ
- పార్టీ : తెదేపా
- ఐటీ చెల్లింపులు : 6,12,212 (2023-24)
- ఆస్తుల విలువ : రూ.1,22,59,034
- భర్త పేరిట : రూ.2,05,05,000
- అప్పులు : రూ.65,41,370
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు సాగుదారు.. జగన్ హక్కుదారు
[ 02-05-2024]
జగనన్న జమానాలో భూ పరిపాలన.. ప్రజలకు మెరుగైన సేవల్ని అందించడం ఏమో కానీ చుక్కలు చూపించింది.. -
పప్పన్నం లేనట్లే..
[ 02-05-2024]
రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రతి నెలా బియ్యం కార్డుదారులందరికీ బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమపిండి అందజేస్తున్నామని ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలే తప్ప. -
పరిశ్రమలపై పగ.. ఔత్సాహికులకు దగా
[ 02-05-2024]
-
పొద్దంతా తిప్పారు.. పొద్దుపోయాక పంచారు
[ 02-05-2024]
పింఛనుదారుల్లో కొందరికి ఇంటి వద్ద పంపిణీ చేసేందుకు సచివాలయ సిబ్బంది ఖాతాల్లో ఏప్రిల్ 30నే రూ.22.26 కోట్లు వేశారు. వీరు అదేరోజు నగదు డ్రా చేసి.. -
ఎ‘వరి’కి చెప్పుకోవాలో
[ 02-05-2024]
కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో సాగునీటి ఎద్దడి తీవ్రత అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఉద్యాన పంటలు, పశుపోషణపై ఆధారపడిన రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదు. -
ప్రాణాలు పోతున్నాయి జగన్...
[ 02-05-2024]
జిల్లాలో ఆర్టీసీలో సుమారు 5వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఏదైనా ఆరోగ్యం బాగోలేక పోతే చిత్తూరులోని డిస్పెన్సరీలో పరీక్షలు నిర్వహించుకుంటుంటారు. -
కర్రలు, రాళ్లతో వెంటాడి..
[ 02-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఊరైన చిత్తూరు జిల్లా సదుం మండలం యర్రాతివారిపల్లెలో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) కార్యకర్తలపై ఏప్రిల్ 29న జరిగిన దాడి ఘటన వీడియో బుధవారం వెలుగులోకి వచ్చింది. -
మేనిఫెస్టోలో భాజపా చిత్రాలేవి: మంత్రి పెద్దిరెడ్డి
[ 02-05-2024]
ఎన్డీయే కూటమి మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. -
మీది ప్రజలే అంగీకరించడం లేదు: మాజీ మంత్రి అమర్
[ 02-05-2024]
తేలిపోయిన వైకాపా మ్యానిఫెస్టోను ప్రజలు అంగీకరించడం లేదని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం అప్పినపల్లెలోని నాలుగురోడ్ల కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. -
వైద్యో.. జగనో.. ప్రాణాలు హరీ..!
[ 02-05-2024]
ఆర్టీసీ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థలో విలీనమైతే తమ బతుకులు బాగుపడతాయని ఆర్టీసీ ఉద్యోగులు ఆశ పడ్డారు. విలీనం కోసం ఉద్యమాలు చేశారు -
పోలీసులకు ఒక్కరోజే..!
[ 02-05-2024]
ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మొదటి రోజు విలపింఛెన్దారులు
[ 02-05-2024]
ప్రభుత్వ తీరుతో నెల మొదటిరోజే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఆగమాగమైంది. అధికశాతం మందికి అందని ద్రాక్షలా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, -
హామీల వలలో మున్సి‘పల్టీలు’
[ 02-05-2024]
ఎన్నికలొస్తే చాలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ప్రజలపై ఎనలేని ప్రేమ పుట్టుకొస్తుంది. అప్పటికప్పుడు ప్రజల సమస్యలన్నీ తీర్చుతామని హామీల వల విసురుతారు.
తాజా వార్తలు (Latest News)
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
-
బద్వేలులో భూబకాసురులు...ఆ బావబామ్మర్దులు!
-
రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు
-
రేవంత్ మహారాష్ట్ర.. కేసీఆర్ గుజరాత్!
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు