ప్రాణాలు పోతున్నాయి జగన్...
జిల్లాలో ఆర్టీసీలో సుమారు 5వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఏదైనా ఆరోగ్యం బాగోలేక పోతే చిత్తూరులోని డిస్పెన్సరీలో పరీక్షలు నిర్వహించుకుంటుంటారు.
ఈహెచ్ఎస్లో దంతాలు, నేత్రాలకే వైద్యం
ఆర్టీసీ ఉద్యోగులకు మొండిచేయి
వైద్య సేవలకు ‘బ్రేక్’ వేసిన వైకాపా సర్కార్
- చిత్తూరుకు డిపోకు చెందిన ఓ డ్రైవర్ ఐదేళ్ల కిత్రం బెంగళూరుకు విధుల నిమిత్తం వెళ్లాడు. అక్కడకు వెళ్లాక అతడికి గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో విచారణ కోసం వచ్చిన అనంతపురం రీజనల్ మేనేజరు ఎంత ఖర్చయినా పర్వాలేదు మెరుగైన వైద్యం అందించాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. దీంతో సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడికి వైద్యం కోసం రూ.7 లక్షలు ఖర్చు చేశారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బతికి బయటపడటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
- గుడిపాలకు చెందిన ఓ మెకానిక్ చిత్తూరు గ్యారేజ్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 15 రోజుల కిత్రం అతడు విధులకు వస్తుండగా ప్రమాదం జరిగింది. అతడిని వేలూరు సీఎంసీకి తరలించగా రూ.10 లక్షలు అవుతుందని చెప్పారు. దాన్ని భరించే స్థోమత లేకపోవడంతో తిరుపతి స్విమ్స్కు తెచ్చారు. అక్కడ రూ.5 లక్షలు అవుతుందని చెప్పారు. పుదుచ్చేరిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈహెచ్ఎస్ కార్డు ఉన్నా అతడికి ఆ ప్రయోజనం ఒనగూరలేదు.
- జగన్ అనే నేను మాట ఇస్తే తప్పను.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని మాట ఇచ్చాను. ఆపై ప్రభుత్వంలో విలీనం చేసి మాట నిలబెట్టుకున్నానని గొప్పలు చెప్పాడు. ఉద్యోగులు సైతం సీఎం మాయమాటలు నమ్మారు. తీరా విలీనం చేశాక వారికి అప్పటివరకు అందుతున్న వైద్య సేవల పరిస్థితి తారుమారైంది. తమ పరిస్థితి కార్పొరేషన్లో ఉన్నప్పుడే బాగుడేందని, ప్రభుత్వంలో విలీనం చేశాక తమ ఆరోగ్యంపై భరోసా కల్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
న్యూస్టుడే, పుత్తూరు, చిత్తూరు(కొంగారెడ్డిపల్లె): జిల్లాలో ఆర్టీసీలో సుమారు 5వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఏదైనా ఆరోగ్యం బాగోలేక పోతే చిత్తూరులోని డిస్పెన్సరీలో పరీక్షలు నిర్వహించుకుంటుంటారు. అక్కడ రక్తపోటు, మధుమేహం, జ్వరం, తలనొప్పి వంటి వాటికి చికిత్స అందిస్తారు. అత్యవసర చికిత్స పొందాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్లోని తార్నాక ఆస్పత్రికి వెళ్లి వైద్యసేవలు పొందేవారు. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడలో ఆస్పత్రి ఏర్పాటు చేశారు. అయితే తార్నాకలో అందిస్తున్నట్లు ఇక్కడ సేవలు అందడం లేదు. ఈ నేపథ్యంలో 2020లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులు, సిబ్బందికి ఈహెచ్ఎస్ కార్డులు అందజేశారు. వీటి ద్వారా సేవలకు ప్రతి నెలా రూ.225 ఉద్యోగుల వేతనాల నుంచి మినహాయించుకుంటున్నారు. అయితే ఆ మేరకు సేవలు అందించడం లేదు. ఈహెచ్ఎస్కు సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఆస్పత్రులలో మాత్రమే సేవలు పొందాలి. లేదంటే ఉద్యోగే.. ఆ మొత్తాన్ని భరించాలి. ఈ నేపథ్యంలో అత్యవసర వైద్య సేవలు పొందాలంటే ఉద్యోగులు, సిబ్బంది చేతి చమురు వదులుతోంది. ఈహెచ్ఎస్కు సంబంధించి ప్రభుత్వం సక్రమంగా బిల్లులు చెల్లించక పోవడంతో ప్రభుత్వం ఎంపిక చేసిన ఆస్పత్రులలో సైతం కంటి, పంటికి మాత్రమే వైద్యం అందిస్తుండటం గమనార్హం.
మెరుగపడాల్సిన సేవల్లో కోత..
ప్రభుత్వంలో విలీనం కాక ముందు ఉద్యోగులు, సిబ్బంది కుటుంబసభ్యుల్లో ఎవరికి అనారోగ్య సమస్యలు ఉన్నా ఎలాంటి నిబంధనలు లేకుండా చికిత్స పొందే వెసులుబాటు ఉండేది. విలీనమయ్యాక ఉద్యోగులు, సిబ్బంది కుటుంబసభ్యులకు సంబంధించి మరింత మెరుగైన సేవలు అందించాల్సి ఉన్నా అందులో కోత విధించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఈహెచ్ఎస్ కింద పరీక్షలకు సైతం ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు తీసుకునేవారు కాదు. ఇప్పుడు పూర్తిగా పరీక్షలకు నగదు చెల్లించాల్సి వస్తోంది.
ఈహెచ్ఎస్తో నష్టపోతున్నాం..
కార్పొరేషన్లో ఉన్నప్పుడు అత్యవసర వైద్యం కోసం ఎంత ఖర్చయినా సేవలు అందించేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. ఈహెచ్ఎస్ వల్ల బాగా నష్టపోతున్నాం. ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతోనే ఈ పరిస్థితి. సకాలంలో బిల్లులు చెల్లిస్తే ఫర్వాలేదు. బిల్లులు ఆలస్యం అవుతుండటంతో అక్కడకు వెళ్లిన వెంటనే ఈ వైద్య సేవలు పొందాలంటే ఈహెచ్ఎస్ వర్తించదని చెప్పేస్తున్నారు. చేసేది లేక నగదు కట్టి సేవలు పొందుతున్నా.
శివ, ఆర్టీసీ ఉద్యోగి
ప్రభుత్వం మాటల గారడీతో..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అన్ని సౌకర్యాలు వర్తింపజేస్తాం. ఆర్టీసీ కుటుంబాలు బాగుపడతాయని నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. దీంతో అందరం సంబర పడ్డాం. తీరా ప్రస్తుతం అందుతున్న సేవలు చూస్తే ప్రభుత్వం గారడీ చేసిందని అర్థమైంది. ఉద్యోగులు, సిబ్బంది కుటుంబసభ్యుల ఆరోగ్యానికి సంబంధించి చర్యలు తీసుకునేలా జీవోలు ఇవ్వాలి.
దానవేంద్ర, ఆర్టీసీ ఉద్యోగి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోపాలరావు వంక.. గుటకాయ స్వాహా..!
[ 17-05-2024]
కుప్పం- పలమనేరు జాతీయ రహదారి పక్కన భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. మంచి ధరలు పలుకుతుండటంతో.. ప్రభుత్వ స్థలాలపై అక్రమార్కుల కన్ను పడింది. -
ఎవరి కళ్లకు కడతారు గంతలు?
[ 17-05-2024]
ఎక్కడైనా ప్రకృతి వనరులను అక్రమార్కులు దోచేస్తుంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వం రంగంలోకి దిగి తవ్వకాలు, రవాణాను నిలిపేస్తుంది. -
శివయ్యా.. ఇదేం ఘోరమయ్యా
[ 17-05-2024]
శివయ్య సేవలో తరించడానికి వెళ్లిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆడపిల్లలను మృత్యువు రూపంలో చెరువు మింగేసింది. -
సర్వదర్శనానికి 18 గంటలు
[ 17-05-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లో వేచి ఉన్నారు. -
ప్రవేశాల ప్రకటన ఆలస్యమేనా..?
[ 17-05-2024]
పది తర్వాత వ్యవసాయ పాలిటెక్నిక్లో భాగంగా మూడేళ్లు డిప్లమో చదివితే ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఆ కోర్సుల్లో చేరేందుకు అవసరమైన ప్రవేశ ప్రకటన ఈ ఏడాది ఆలస్యం కానుంది. -
క్షేత్రస్థాయికి వెళ్తే.. కార్యాలయానికి తాళమే
[ 17-05-2024]
సచివాలయ వ్యవస్థతో గొప్ప మార్పు తెచ్చామని.. ప్రజల ముగింటకే అధికారులను తెచ్చామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. -
జీతాలు చెల్లించండి.. మహాప్రభో
[ 17-05-2024]
తమకు న్యాయంగా అందాల్సిన జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయా డెయిరీ కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష ఎనిమిది నెలలుగా కొనసాగుతోంది. -
విచారణకు పిలిచి చితకబాదిన ఎస్సై?
[ 17-05-2024]
సోదరుల ఘర్షణ కేసులో విచారణకు పిలిచిన ఎస్సై కులం పేరుతో దూషించి.. లాఠీతో చితకబాదారని రామకుప్పం మండలం వీర్ణమల తండాకు చెందిన వెంకటేశ్నాయక్ ఆరోపించారు. -
సూత్రదారితెన్నూ లేని దర్యాప్తు
[ 17-05-2024]
తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనలో పోలీసులు ఇంకా వైకాపా నేతలకు వంత పాడుతూనే ఉన్నారు. -
బండ వేషం.. జాతర విశేషం
[ 17-05-2024]
గంగజాతరలో బండ వేషధారణలు అలరించాయి. తిరుపతి ప్రజల ఇలవేల్పుగా.. పిలిస్తే పలికే దైవంగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర రెండోరోజు గురువారం సందడిగా సాగింది. -
వేసవి శిబిరాలు లేనట్టే..!
[ 17-05-2024]
వేసవి సెలవులంటే పాఠశాల విద్యార్థులకు, చిన్నారులకు పండగనే చెప్పాలి. స్నేహితులతో కలిసి ఆటలాడుకుంటూ వినోదం.. ఉల్లాసం.. ఉత్సాహాన్ని పొందుతుంటారు. -
అటకెక్కిన భూసార పరీక్షలు
[ 17-05-2024]
భూసార పరీక్షలు అటకెక్కాయి. సాగులో మట్టి నమూనాలు కీలకం కాగా ప్రభుత్వం వీటిని గాలికి వదిలేసింది. ఎక్కడో ఓ చోట తీసి అయ్యిందనిపిస్తున్నారు. -
చెవికెక్కించుకుంటే ఇంతే..!
[ 17-05-2024]
వైకాపా నేతలతో భుజాలు రాసుకుని వారి చెప్పినట్లు వంతపాడిన అధికారులపై సీఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైనట్లు అధికారులు నిర్ధారించారు. -
వీరూ ఆ ఫ్యానుముక్కలే
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. అందుకు బాధ్యులైన జిల్లా పోలీసు బాస్ కృష్ణకాంత్ పటేల్పై బదిలీ వేటు వేసింది. -
ముఖ్యమంత్రి జగన్ను అరెస్టు చేయాలి
[ 17-05-2024]
ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో లెక్కకు మిక్కిలి అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. -
మహిళా వర్సిటీకి మాయని మచ్చ
[ 17-05-2024]
శ్రీపద్మావతి మహిళా వర్సిటీ అవరణలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన మాయని మచ్చగా మారింది. -
ఆరోగ్య కేంద్రాల సేవలు అరకొరే
[ 17-05-2024]
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలూ వైద్య సేవలు గగనంగా మారాయి. కాన్పులు సైతం జరగడం లేదు. పలుచోట్ల వైద్యులు, సిబ్బంది విధులకు డుమ్మా కొట్టి తిరుగుతున్నా.. పట్టించుకునే వారేలేరు. -
ఓటమి భయంతోనే వైకాపా దాడులు
[ 17-05-2024]
వైకాపా ప్రభుత్వం ఓటమి భయంతోనే దాడులకు దిగుతోందని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు. ఇటీవల వైకాపా మూకల దాడిలో గాయపడిన తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని తనపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి గురువారం పరామర్శించారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
[ 17-05-2024]
శ్రీవారిని పలువురు ప్రముఖులు గురువారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని భాజపా నాయకులు... -
తెదేపా ఏజెంట్ల కిడ్నాప్ వ్యవహారంలో పురోగతి
[ 17-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలంలో వైకాపా నాయకులపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. -
ప్రత్యేక తరగతులు ఎక్కడ?
[ 17-05-2024]
పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 24 నుంచి సప్లిమెంటరరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన పరీక్షల్లో 2,006 మంది ఫెయిల్ అయ్యారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జేసీ శ్రీనివాసులు ఆదేశించారు. చిత్తూరు ఎస్వీ సెట్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. -
వేరుసెనగ విత్తన ధర ఖరారు
[ 17-05-2024]
త్వరలో మొదలుకానున్న ఖరీఫ్ సీజన్కు వేరుసెనగ విత్తన కాయల ధరలు ఖరారయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
బీసీజీ టీకా వేయించుకోండి
[ 17-05-2024]
జిల్లాలోని వృద్ధులు, 18 ఏళ్లు నిండిన మధుమేహ, క్షయ వ్యాధిగ్రస్థులు, వారి కుటుంబ సభ్యులందరూ అడల్ట్ బీసీజీ టీకాను వేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని డీఎంహెచ్వో ప్రభావతీదేవి కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
-
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?
-
స్టాక్ మార్కెట్లలో కొనసాగిన లాభాలు
-
అజ్ఞాతంలోకి మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు
-
వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్
-
స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమా హిట్టవుతుందని చెప్పలేం: సెహ్వాగ్