పరిశ్రమలపై పగ.. ఔత్సాహికులకు దగా
జిల్లావ్యాప్తంగా బకాయిలు రూ.100 కోట్లు
20 నెలలుగా ‘జగన్నా’టకం
సీఎం జగన్ మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం గడప దాటడం లేదు. పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కడా లేనంత వేగంగా అనుమతులు ఇస్తున్నామని డప్పు కొట్టుకుంటోంది. ఎవరూ ఇవ్వనంతగా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం జగన్కే చెల్లింది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ముఖ్యమంత్రి మాటలు ఒట్టి డొల్లేనని స్పష్టమవుతోంది. వైకాపా ప్రభుత్వ అసమర్థ విధానాలు, అరాచక పాలనకు భయపడి భారీ, మెగా పరిశ్రమలు స్థాపించేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ప్రభుత్వం నుంచి రాయితీలు అందకపోవడంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లు మూతపడుతున్నాయి. జగన్ సర్కార్ మూలంగా అయిదేళ్లుగా పారిశ్రామిక రంగంలో వెనుకపడిందే తప్ప ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయింది.
పలమనేరు నియోజకవర్గానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త రూ.50 లక్షలతో నూలు సంచుల తయారీ పరిశ్రమ నెలకొల్పారు. పెట్టుబడి రాయితీ కింద ఏడాదిన్నర గడిచినా ఆయనకు రూ.15 లక్షలు, విద్యుత్తు, వడ్డీ రాయితీ రూపంలో రూ.4 లక్షలకుపైగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు రాలేదు. విద్యుత్తు ఛార్జీలు పెరిగిపోవడంతో పరిశ్రమ నడపడం ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. బకాయిలు రాకుంటే పరిశ్రమ మూసేయాల్సిందేనని అంటున్నారు.
జిల్లాలోని ఏపీఐఐసీ పార్కులో ఉత్పాదక రంగానికి సంబంధించిన యూనిట్ను రూ.కోటితో ఏర్పాటు చేశారు. రాయితీల రూపంలోనే ఆయనకు రూ.40 లక్షలు రావాలి. వైకాపా అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో పరిశ్రమ స్థాపించగా ఇంకా రాయితీ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఈనాడు, చిత్తూరు: పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వాలు ఔత్సాహికులకు రాయితీలు ఇస్తుంటాయి. అదే సమయంలో మనుగడులో ఉన్న కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తాయి. తద్వారా ఎక్కువమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.జగన్ ప్రభుత్వానికి పెట్టుబడులన్నా, పారిశ్రామికవేత్తలన్నా చిన్నచూపే. ఫలితంగానే అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఆయన ఏమాత్రం దృష్టి పెట్టలేదు.
రీస్టార్ట్ అన్నారు.. విస్మరించారు
కొవిడ్ మహమ్మారి మొదలైనప్పుడు ఎంఎస్ఎంఈలు చాలావరకు మూతపడ్డాయి. పరిస్థితులు కుదుటపడ్డాక కొన్ని సంస్థలు ఉత్పత్తులను పునః ప్రారంభించాయి. అలాంటి వాటికి రీస్టార్ట్ పేరుతో మూడు నెలల స్థిర డిమాండ్ విద్యుత్తు ఛార్జీలు రద్దు చేస్తామని జగన్ ప్రకటించారు. నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. జిల్లావ్యాప్తంగా రూ.4 కోట్లు ప్రభుత్వం బకాయిలు ఉంది.
దళిత, గిరిజనులనూ మోసగించి..
దళితులు, గిరిజనులు శ్రామికులుగా ఉండే రోజులు పోవాలని.. ఇతర వర్గాలకు తీసిపోని రీతిలో పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అభినవ అంబేడ్కర్లా సీఎం జగన్ మాటలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వాల్లో వారికి ప్రకటించిన రాయితీలనే అమలు చేస్తూ పేరును మాత్రం వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం పథకం అని పెట్టారు. సేవా రంగంలో 45 శాతంతో రూ.75 లక్షల వరకు, ఉత్పత్తి రంగంలో రూ.కోటి వరకు గరిష్ఠ రాయితీ అందిస్తామని ప్రకటించారు. ఇవి కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రూ.5 కోట్ల వరకు జగన్ సర్కార్ చెల్లించాల్సి ఉంది.
ఆగస్టు పోయి.. ఫిబ్రవరి వచ్చే
మౌలిక సదుపాయాలకు నోచని గంగాధరనెల్లూరులోని పారిశ్రామికవాడ
వైకాపా అధికారంలోకి వచ్చాక రెండు పారిశ్రామిక పాలసీలను తెచ్చింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించే వారి చేయి పట్టుకుని నడిపిస్తామని ముఖ్యమంత్రి జగన్ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. భూముల కొనుగోలు, పెట్టుబడి వ్యయంలో రాయితీ ఇచ్చి ఒక్కొక్కరు వందలాది మందికి ఉపాధి కల్పించేలా చూస్తానన్నారు. ఈ మేరకు 2020, 2021 సంవత్సరాల్లో మాత్రమే రాయితీలు విడుదల చేశారు. తర్వాత చేతులెత్తేసింది. 2022 ఏడాదికి సంబంధించినవి ఆ సంవత్సరం ఆగస్టులో ఇస్తామని కట్టుకథలు చెప్పారు. అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని.. 2023 ఫిబ్రవరిలో విడుదల చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మాట మార్చారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.100 కోట్లు రావాలి. 20 నెలలు గడిచినా రాయితీల జాడే లేదు.
ఈమె పేరు లత. గంగాధర నెల్లూరులోని పారిశ్రామికవాడలో ఇనుప పైపుల తయారీ పరిశ్రమ స్థాపించారు. రూ.1.80 కోట్లు పెట్టుబడి పెట్టగా ప్రభుత్వం నుంచి రూ.85 లక్షలు రాయితీ రావాలి. దాదాపు రెండేళ్లుగా ఆమె ఎదురుచూస్తున్నారు. అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వానికి వివరాలు పంపామని సమాధానమిస్తున్నారే తప్ప ఎప్పుడు నగదు జమ చేస్తారో సమాధానం ఇవ్వడంలేదని వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోపాలరావు వంక.. గుటకాయ స్వాహా..!
[ 17-05-2024]
కుప్పం- పలమనేరు జాతీయ రహదారి పక్కన భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. మంచి ధరలు పలుకుతుండటంతో.. ప్రభుత్వ స్థలాలపై అక్రమార్కుల కన్ను పడింది. -
ఎవరి కళ్లకు కడతారు గంతలు?
[ 17-05-2024]
ఎక్కడైనా ప్రకృతి వనరులను అక్రమార్కులు దోచేస్తుంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వం రంగంలోకి దిగి తవ్వకాలు, రవాణాను నిలిపేస్తుంది. -
శివయ్యా.. ఇదేం ఘోరమయ్యా
[ 17-05-2024]
శివయ్య సేవలో తరించడానికి వెళ్లిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆడపిల్లలను మృత్యువు రూపంలో చెరువు మింగేసింది. -
సర్వదర్శనానికి 18 గంటలు
[ 17-05-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లో వేచి ఉన్నారు. -
ప్రవేశాల ప్రకటన ఆలస్యమేనా..?
[ 17-05-2024]
పది తర్వాత వ్యవసాయ పాలిటెక్నిక్లో భాగంగా మూడేళ్లు డిప్లమో చదివితే ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఆ కోర్సుల్లో చేరేందుకు అవసరమైన ప్రవేశ ప్రకటన ఈ ఏడాది ఆలస్యం కానుంది. -
క్షేత్రస్థాయికి వెళ్తే.. కార్యాలయానికి తాళమే
[ 17-05-2024]
సచివాలయ వ్యవస్థతో గొప్ప మార్పు తెచ్చామని.. ప్రజల ముగింటకే అధికారులను తెచ్చామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. -
జీతాలు చెల్లించండి.. మహాప్రభో
[ 17-05-2024]
తమకు న్యాయంగా అందాల్సిన జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయా డెయిరీ కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష ఎనిమిది నెలలుగా కొనసాగుతోంది. -
విచారణకు పిలిచి చితకబాదిన ఎస్సై?
[ 17-05-2024]
సోదరుల ఘర్షణ కేసులో విచారణకు పిలిచిన ఎస్సై కులం పేరుతో దూషించి.. లాఠీతో చితకబాదారని రామకుప్పం మండలం వీర్ణమల తండాకు చెందిన వెంకటేశ్నాయక్ ఆరోపించారు. -
సూత్రదారితెన్నూ లేని దర్యాప్తు
[ 17-05-2024]
తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనలో పోలీసులు ఇంకా వైకాపా నేతలకు వంత పాడుతూనే ఉన్నారు. -
బండ వేషం.. జాతర విశేషం
[ 17-05-2024]
గంగజాతరలో బండ వేషధారణలు అలరించాయి. తిరుపతి ప్రజల ఇలవేల్పుగా.. పిలిస్తే పలికే దైవంగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర రెండోరోజు గురువారం సందడిగా సాగింది. -
వేసవి శిబిరాలు లేనట్టే..!
[ 17-05-2024]
వేసవి సెలవులంటే పాఠశాల విద్యార్థులకు, చిన్నారులకు పండగనే చెప్పాలి. స్నేహితులతో కలిసి ఆటలాడుకుంటూ వినోదం.. ఉల్లాసం.. ఉత్సాహాన్ని పొందుతుంటారు. -
అటకెక్కిన భూసార పరీక్షలు
[ 17-05-2024]
భూసార పరీక్షలు అటకెక్కాయి. సాగులో మట్టి నమూనాలు కీలకం కాగా ప్రభుత్వం వీటిని గాలికి వదిలేసింది. ఎక్కడో ఓ చోట తీసి అయ్యిందనిపిస్తున్నారు. -
చెవికెక్కించుకుంటే ఇంతే..!
[ 17-05-2024]
వైకాపా నేతలతో భుజాలు రాసుకుని వారి చెప్పినట్లు వంతపాడిన అధికారులపై సీఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైనట్లు అధికారులు నిర్ధారించారు. -
వీరూ ఆ ఫ్యానుముక్కలే
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. అందుకు బాధ్యులైన జిల్లా పోలీసు బాస్ కృష్ణకాంత్ పటేల్పై బదిలీ వేటు వేసింది. -
ముఖ్యమంత్రి జగన్ను అరెస్టు చేయాలి
[ 17-05-2024]
ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో లెక్కకు మిక్కిలి అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. -
మహిళా వర్సిటీకి మాయని మచ్చ
[ 17-05-2024]
శ్రీపద్మావతి మహిళా వర్సిటీ అవరణలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన మాయని మచ్చగా మారింది. -
ఆరోగ్య కేంద్రాల సేవలు అరకొరే
[ 17-05-2024]
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలూ వైద్య సేవలు గగనంగా మారాయి. కాన్పులు సైతం జరగడం లేదు. పలుచోట్ల వైద్యులు, సిబ్బంది విధులకు డుమ్మా కొట్టి తిరుగుతున్నా.. పట్టించుకునే వారేలేరు. -
ఓటమి భయంతోనే వైకాపా దాడులు
[ 17-05-2024]
వైకాపా ప్రభుత్వం ఓటమి భయంతోనే దాడులకు దిగుతోందని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు. ఇటీవల వైకాపా మూకల దాడిలో గాయపడిన తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని తనపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి గురువారం పరామర్శించారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
[ 17-05-2024]
శ్రీవారిని పలువురు ప్రముఖులు గురువారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని భాజపా నాయకులు... -
తెదేపా ఏజెంట్ల కిడ్నాప్ వ్యవహారంలో పురోగతి
[ 17-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలంలో వైకాపా నాయకులపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. -
ప్రత్యేక తరగతులు ఎక్కడ?
[ 17-05-2024]
పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 24 నుంచి సప్లిమెంటరరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన పరీక్షల్లో 2,006 మంది ఫెయిల్ అయ్యారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జేసీ శ్రీనివాసులు ఆదేశించారు. చిత్తూరు ఎస్వీ సెట్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. -
వేరుసెనగ విత్తన ధర ఖరారు
[ 17-05-2024]
త్వరలో మొదలుకానున్న ఖరీఫ్ సీజన్కు వేరుసెనగ విత్తన కాయల ధరలు ఖరారయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
బీసీజీ టీకా వేయించుకోండి
[ 17-05-2024]
జిల్లాలోని వృద్ధులు, 18 ఏళ్లు నిండిన మధుమేహ, క్షయ వ్యాధిగ్రస్థులు, వారి కుటుంబ సభ్యులందరూ అడల్ట్ బీసీజీ టీకాను వేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని డీఎంహెచ్వో ప్రభావతీదేవి కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఇంటి నుంచి వీడియో వెలుగులోకి.. ‘హిట్మ్యాన్’ అంటూ స్వాతీమాలీవాల్ పోస్టు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
-
వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: దేవినేని ఉమా
-
ప్రపంచంలో ‘3F’ల సంక్షోభం.. కేంద్ర మంత్రి జైశంకర్
-
ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి