logo

శుభకార్యంలో మజ్జిగ తాగిన 40 మందికి అస్వస్థత

శుభకార్యంలో మజ్జిగ తాగిన 40 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గంగవరం మండలం నలసానపల్లెలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ఇంట్లో శుభకార్యానికి బంధువులు, స్నేహితులు వచ్చారు.

Published : 05 May 2024 02:56 IST

గంగవరం, న్యూస్‌టుడే: శుభకార్యంలో మజ్జిగ తాగిన 40 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గంగవరం మండలం నలసానపల్లెలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ఇంట్లో శుభకార్యానికి బంధువులు, స్నేహితులు వచ్చారు. ఎండల ప్రభావంతో ఇబ్బంది పడకుండా.. పలమనేరులోని ఓ దుకాణంలో పెరుగు కొని మజ్జిగ చేసి ఇచ్చారు. కొద్దిసేపటికే వారు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 40 మందిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందించడంతో ప్రమాదం తప్పింది. గడువు తీరిన పెరుగు ఇవ్వడంతోనే ఇలా జరిగిందనే ఆరోపణలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని