జగన్.. భూ భస్మాసుర అస్ర్తం
భూమికి అన్నదాతకు ఉన్న సంబంధం విడదీయరానిది.. అన్నం పెట్టి.. ఆకలి తీర్చే భూ దేవతను కొలిచే వారి శ్వాస ఆడాలంటే నేలపై అరక తిరగాడాలి.. ఆ భూమి దూరమైతే జీవితం లేనట్లేనని భావిస్తారు..
టైటిలింగ్ చట్టంతో కొత్త ఇబ్బందులు
వైకాపా ప్రభుత్వ నిర్వాకం
ప్రజల ఆస్తులకు రక్షణ కరవు
భూమికి అన్నదాతకు ఉన్న సంబంధం విడదీయరానిది.. అన్నం పెట్టి.. ఆకలి తీర్చే భూ దేవతను కొలిచే వారి శ్వాస ఆడాలంటే నేలపై అరక తిరగాడాలి.. ఆ భూమి దూరమైతే జీవితం లేనట్లేనని భావిస్తారు.. రైతును ఉద్ధరించడంలో తానే గొప్పోడినని చెప్పుకొనే సీఎం జగన్మోహన్రెడ్డి వారి భూములను నొక్కేసే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని(భూ యాజమాన్య హక్కు చట్టం) తీసుకొచ్చారు.. అతడి అడుగులకు మడుగులొత్తే కొందరు తొత్తుల్లాంటి అధికారులతో చాపకింద నీరులా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు.. వారు భూమికి హక్కుదారులుగా ఏ పేరు రికార్డుల్లో రాస్తే వారికే చెందుతుంది.. భూ సమస్య తలెత్తితే సివిల్ కోర్టుల్లో సవాలు చేసి న్యాయం పొందే అవకాశం ఇప్పటి వరకు ఉంది. జగన్మోహన్రెడ్డి రూపొందించిన పిడుగు లాంటి చట్టంతో సివిల్ కోర్టుల్లో ఈ భూ వివాదాలు పరిష్కరించుకునే వీల్లేదు.. ఇలా ప్రజలపై జగన్ తన తుది అస్త్రాన్ని ప్రయోగించాడని భిన్నవర్గాలు పేర్కొంటున్నాయి.
ఈనాడు, చిత్తూరు; న్యూస్టుడే, చిత్తూరు(మిట్టూరు), కుప్పం
హైకోర్టు వరకు రైతులు వెళ్లగలరా?
చిత్తూరు జిల్లాలో 90శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. అరెకరం నుంచి రెండెకరాల వరకు పొలం ఉన్నవారే. భూమిని నమ్ముకుని జీవించే వీరు పంటలో నష్టం వచ్చినప్పటికీ పొలాన్ని బీడుగా చూసి ఉండలేక భూ మాతను నమ్ముకుని అప్పోసొప్పో చేసి పంటలు వేసి తద్వారా అందిన సొమ్ముతో జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారు తమ భూములు రక్షించుకునేందుకు హైకోర్టు వరకు వెళ్లే పరిస్థితి ఉందా..? పోరాడే జవసత్వాలు బక్క రైతులకు ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి. ఈ చట్టం అమలైతే సొంత భూమిని వదులుకుని కూలి బతుకులు బతకడానికి రైతన్నలు సిద్ధం కావాల్సిందే మరి. కొత్త చట్టం అమలైతే అందరూ నష్టపోతారని, సొంత భూములను రైతు వదులుకోవాల్సిందేనని మేధావులు, వ్యవసాయ రంగ నిపుణులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నష్టమే.. ప్రయోజనం లేదు..
భూ యాజమాన్య హక్కు చట్టం వల్ల రైతులు, భూ యజమానులకు నష్టం తప్ప ప్రయోజనం లేదు. చాలామంది రైతులకు వారసత్వంగా వచ్చిన భూములు ఉన్నాయి. ప్రభుత్వం నోటిఫై చేశాక ప్రజల వద్ద ఉన్న దస్తావేజులు, ఇతర వివరాలు టీఆర్వోకి చూపాలి. టీఆర్వో సంతృప్తి మేరకు టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదు చేస్తారు. అప్పుడే యాజమాన్య హక్కులు వస్తాయి. ఒకవేళ టీఆర్వో ఇతర వ్యక్తుల పేరు నమోదు చేస్తే అసలైన యజమాని.. సదరు భూమి తనదేనని రుజువు చేసుకోవాలంటే హైకోర్టుకు వెళ్లాల్సిందే. స్థానిక సివిల్ కోర్టుకు వెళ్లడానికి వీల్లేదు. సామాన్యులు, చిన్న, సన్నకారు రైతులు నష్టపోతారు.
ప్రభాకర్నాయుడు, విశ్రాంత తహసీల్దారు, చిత్తూరు
అధికారికంగా కాజేసే యత్నం
శాంతిపురం మండలం సాతు రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని అనాధీనం పేరుతో అధికార పార్టీ నేతలు కాజేసేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ముందుగా ఈ భూములను అధికారికంగా స్వాధీనం చేసుకోవాలని ఆరు నెలల కిందట కొందరు వైకాపా నేతలు చక్రం తిప్పారు. పట్టాదారులు స్థానికేతరులని కారణం చూపి.. రెవెన్యూ అధికారులతో పట్టాలు రద్దు చేసి అనాధీనంగా నమోదు చేయించారు. డీకేటీ పట్టాలు తీసుకోవడానికి నాయకులు ప్రయత్నించగా.. స్థానికులు తీవ్ర అభ్యంతరాన్ని తెలిపారు.
వలస వెళ్లి చూసుకోలేదా ఇక అంతే..
జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని ప్రజలు ఉద్యోగం, ఉపాధి కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాలకు వలస వెళ్తున్నారు. దీంతో ఊళ్లలోని భూములు బీడుగా మారాయి. అరకొర భూమి రికార్డులు మా పేరిటే ఉన్నాయి కదా? అని నిరక్షరాస్యులు, పేదలు వాటి గురించి ఆరా తీసే అవకాశం లేదు. భూ యాజమాన్య హక్కు చట్టం ద్వారా ఇవి అధికార బలమున్న వ్యక్తులు చేజిక్కించుకోవడం మంచినీళ్లు తాగినంత సులువు. వలస వెళ్లిన రైతుల స్థలం తనదని రెవెన్యూ అధికారులకు అర్జీ ఇస్తే దాన్ని డిస్ప్యూట్ రిజిస్టర్లో చేరుస్తారు. తర్వాత వివాదం ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్ (ఎల్టీఏవో) చెంతకు చేరుతుంది. సదరు అధికారిని ప్రభుత్వమే నియమిస్తున్నందున ఆయన/ ఆమె అధికార పార్టీ నేతకు అనుకూలంగా వ్యవహరించడం ఖాయం. రెండేళ్లపాటు దీనిపై ఎవరూ అప్పీలు చేయకుంటే పేదల భూమి పెత్తందారుల పరమవుతుంది.
కుప్పం మండలం పొన్నాంగూరు రెవెన్యూ సర్వే నంబరు 104/3లో గ్రామానికి చెందిన అంధుడు కన్మణికి చెందిన 34 సెంట్ల భూమిని వైకాపా మండల నాయకుడు కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొంతకాలానికి మరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు న్యాయం చేయాలంటూ ఆర్డీవో శ్రీనివాసులుకు మొర పెట్టుకున్నారు. ఇదే పరిస్థితి ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలోకి వచ్చి బాధితుడికి రెండేళ్లపాటు నిజం తెలియకుంటే వైకాపా నేత కుమారుడికే భూమి దక్కుతుంది. అంధుడైన కన్మణి న్యాయం కోసం అమరావతిలోని హైకోర్టుకు వెళ్లాల్సిందే.
చిత్తూరు నగరంలోని 5.02 ఎకరాల భూమిని 1981లో మీనాక్షమ్మ, మరో ముగ్గురు వ్యక్తులు వెంకటాచలపతికి విక్రయించారు. తనకు తెలియకుండా కొందరు కరుణాకరరెడ్డి అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ చేశారని వెంకటాచలపతి కుమారుడు దినేష్ 2022లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం వివాదంపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారం బయటకు రావడంతో నగరంలోని భూ యజమానులు తమ ఆస్తి భద్రమేనా? అని పరిశీలించుకోవాల్సి వచ్చింది.
భూమిపై హక్కులు కోల్పోతారు..
భూ యాజమాన్య చట్టంతో భూములపై రైతులు, భూ యజమానులు తమ హక్కులు కోల్పోతారు. భూములను ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు. ప్రజలతో పాటు రైతులకు నష్టం జరుగుతుంది. భూములపై రాజకీయ జోక్యం పెరిగి రక్షణ ఉండదు. సత్వరమే ఈ చట్టాన్ని రద్దు చేయాలి.
విజయచంద్రనాయుడు, విశ్రాంత ఏవో, చిత్తూరు
రైతులకు ఇబ్బందులే..
కొత్త చట్టం ద్వారా రైతులకు ఇబ్బందులే. భూ యాజమాన్య హక్కు చట్టం అమలు చేయాలంటే భూ సర్వే పక్కాగా జరగాలి. ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే లోపభూయిష్టంగా ఉంది. సమగ్రంగా చేపట్టలేదు. రైతులు భూమిపై హక్కులు కోల్పోతారు. న్యాయం కోసం సివిల్ కోర్టులకు వెళ్లే పరిస్థితి ఉండదు. హైకోర్టుకు వెళ్లాలి. పేద రైతులకు ఇది సాధ్యమేనా.? అన్ని విధాలా రైతులు, ప్రజలకు ఈ చట్టం ఎంతో ప్రమాదకరం.
రమేష్, విశ్రాంత తహసీల్దారు, వడ్డేపల్లి, పూతలపట్టు మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
[ 18-05-2024]
తిరుమలలో భక్తుల రద్దీ మూడో రోజూ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. -
దిగుబడులు పెరిగి.. ధరలు పతనమై
[ 18-05-2024]
వాతావరణం అనుకూలించడంతో ఈ సంవత్సరం టమాటా దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితే దక్షిణాది రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఫలితంగా టమాటా దిగుబడులు మార్కెట్లకు తరలివస్తున్నాయి. -
వైద్యులు ఉండరు.. సేవలు అందవు
[ 18-05-2024]
జిల్లాలోని 50 పీహెచ్సీల తోపాటు నాలుగు సీహెచ్సీల్లో 24 గంటల వైద్య సేవలను అందించాల్సి ఉండగా.. చాలాచోట్ల పగటి వేళల్లో మాత్రమే వైద్యులు అందుబాటులో ఉంటారని.. రాత్రుల్లో వారి సేవలు నామమాత్రమే అని ఆరోపణలు చోటు చేసుకొంటున్నాయి. -
మనోళ్లే ఇచ్చేయండి..!
[ 18-05-2024]
పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.. ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందు ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ పనుల్లో కొన్నింటికి బిల్లులు మంజూరయ్యాయి.. -
నేడు సైన్స్ సెంటర్ ప్రవేశం ఉచితం
[ 18-05-2024]
అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలోకి సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాస నెహ్రూ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. -
భూసారం.. లక్ష్యం నిస్సారం
[ 18-05-2024]
భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని తెలుసుకుని.. తదనుగుణంగా చర్యలు చేపడితే అన్నదాతలు అధిక దిగుబడులు సాధించి అప్పుల ఊబి నుంచి బయట పడతారన్నది ఉద్దేశం.. అందుకు భూసార పరీక్షలు తప్పనిసరి.. -
తెదేపాకు 125-150 సీట్లు
[ 18-05-2024]
రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో తెదేపాకు 125 నుంచి 150 సీట్లు వస్తాయని తెదేపా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారిని అభిషేక సేవలో ఆయన దర్శించుకున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
[ 18-05-2024]
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాది శ్రీదేవి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
శ్రీపద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం
[ 18-05-2024]
తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన మండపంలో శుక్రవారం శ్రీపద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తమిళనాడు యువకుల మృతి
[ 18-05-2024]
తిరుపతి-చెన్నై జాతీయ రహదారిలోని నగరి మండలం తడుకుపేట వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఇలంకన్నన్(26), కన్నన్(28) మృతిచెందారు. -
శోకసంద్రంలో ఎస్బీఆర్పురం
[ 18-05-2024]
వడమాలపేట మండలం ఎస్బీఆర్పురం చెరువులో నీటి మునిగి మృతి చెందిన ముగ్గురు ఆడబిడ్డల మృతదేహాలకు పలువురు శుక్రవారం నివాళులర్పించారు. ముగ్గురు కుమార్తెలు విగతజీవులుగా పడిఉండటాన్ని చూసి ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు వర్ణనాతీతం. -
అడ్డగోలు తవ్వకం.. లేదంటూ నాటకం
[ 18-05-2024]
శ్రీకాళహస్తి మండలం సుబ్బనాయుడు కండ్రిగ, పుల్లారెడ్డి కండ్రిగ, రామలింగాపురం, చుక్కలనిడిగల్లు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. -
స్ట్రాంగ్రూంల వద్ద మూడంచెల భద్రత
[ 18-05-2024]
మహిళా వర్సిటీలోని ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద మూడంచెల కట్టుదిట్టమైన భద్రత, అనుక్షణం సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ ఉన్నట్లు కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. -
భక్తి‘తోటి’ వేషాలు
[ 18-05-2024]
తాతయ్యగుంట గంగమ్మ జాతరలో మూడో రోజు శుక్రవారం భక్తులు తోటి వేషాలతో సందడి చేశారు. గర్భాలయంలోని గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ నిర్వహించారు. -
రక్తపోటు నియంత్రణతో వ్యాధులు దూరం
[ 18-05-2024]
ప్రతి ఒక్కరూ విధిగా బీపీ తనిఖీ చేసుకుంటూ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలని డీఎంహెచ్వో యు.శ్రీహరి, రుయా సూపరింటెండెంట్ రవిప్రభు పేర్కొన్నారు. -
విపంచి ధరించి.. విహరించి
[ 18-05-2024]
శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం ఉదయం చిన్నశేష వాహనంపై, రాత్రి హంస వాహనంపై గోవిందరాజస్వామి భక్తులకు అభయమిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు