logo

ఓటమిని జగన్‌ ముందే ఒప్పుకొన్నారు

అంతర్జాతీయ స్థాయిలో అవినీతిలో పురస్కారాలు ఇవ్వదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన మంత్రివర్గానికి ఇవ్వాలని సినీనటుడు, జనసేన నాయకుడు పృథ్వీరాజ్‌ ఎద్దేవా చేశారు.

Published : 07 May 2024 07:36 IST

సినీ నటుడు పృథ్వీరాజ్‌

తిరుపతి (బైరాగిపట్టెడ): అంతర్జాతీయ స్థాయిలో అవినీతిలో పురస్కారాలు ఇవ్వదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన మంత్రివర్గానికి ఇవ్వాలని సినీనటుడు, జనసేన నాయకుడు పృథ్వీరాజ్‌ ఎద్దేవా చేశారు. తిరుపతిలో ఎన్డీయే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తరఫున సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్‌లాంటి దోపిడీదారుడు ప్రపంచంలో లేరన్నారు. ఆలీబాబా 40 దొంగల ముఠా తరహాలో రాష్ట్రాన్ని దోచేశారని మండిపడ్డారు. తాము చేసిన అవినీతి, ఘనకార్యాలే తమను ఓడిస్తాయన్న విషయం జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థులందరికీ ముందే తెలిసిపోయిందన్నారు. సొంత చెల్లెలే ఆయన అవినీతి, అరాచకాలను ఊరూరా చాటింపువేసి మరీ చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం, అంబటి రాంబాబులకు సొంత ఇంట్లోనే వ్యతిరేకత ఉందన్నారు. పిఠాపురం నుంచి పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుస్తారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని