ఆరోగ్యశ్రీ సేవలపై సందిగ్ధం
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఏడాది నుంచి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. అత్యవసర కేసులు మినహా మిగిలిన వాటిని వెనక్కి పంపేయడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు.
రాజమహేంద్రవరం వైద్యం, న్యూస్టుడే: ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఏడాది నుంచి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. అత్యవసర కేసులు మినహా మిగిలిన వాటిని వెనక్కి పంపేయడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. బకాయిలు చెల్లించే వరకు సేవలు అందించలేమని, శస్త్రచికిత్సలు చేసే పరిస్థితి లేదని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించడం.. బుధవారం మధ్యాహ్నం నుంచే సేవలు యథావిధిగా అందుతున్నాయని అధికారులు చెబుతుండటంతో గందరగోళం నెలకొంది. జిల్లాలోని 37 నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేసినా సాయంత్రానికి కేసులు తీసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. బుధవారం రాత్రి కొంత సొమ్ము విడుదలవుతుందని పేర్కొంటున్నారు. ఒకటి, రెండు మినహా మిగిలినవన్నీ యథావిధిగా సేవలందిస్తున్నాయని చెబుతున్నారు. అప్పుచేసి ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులు నడుపుతున్నామని, ఏడాది నుంచి బకాయిలు చెల్లించకపోవడంతో కనీసం సిబ్బందికి వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆయా యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గురువారం సేవలు అందించే అంశంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్నంటే నాన్నే
[ 16-06-2024]
నాన్నంటే ఇష్టంగా మోసే బాధ్యత.. వెన్నంటి నడిచే ధైర్యం.. ఊహకందని త్యాగం.. నడత నేర్పే గురువు.. తన జీవితాన్నే మనకోసం ధారబోసే మహోన్నతుడు. -
అమ్మా.. నన్ను క్షమించు
[ 16-06-2024]
‘అమ్మా.. నన్ను క్షమించు. నా స్నేహితుడు శ్రీను.. వాళ్ల మావయ్య మోసం చేశాడు. రూ.35 లక్షలు ఇవ్వాలి. -
మానసిక సంఘర్షణ.. మృత్యుమార్గాన..
[ 16-06-2024]
ఆ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నత చదువులు చదివారు. మహానగరాల్లో ఉద్యోగాలు చేశారు. పదేళ్ల క్రితం తండ్రి చనిపోవడం.. తల్లి అనారోగ్యం బారిన పడటంతో ఇంటికొచ్చేశారు. -
కొమ్మనాపల్లిలో అదుపులోకి రాని అతిసారం
[ 16-06-2024]
కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో ప్రబలిన (అతిసారం) మూడోరోజుకూ పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. గ్రామంలోని మరో 28 మంది శనివారం కూడా అస్వస్థత బారిన పడ్డారు. -
వెంకన్న వేడుక చూద్దాం రండి
[ 16-06-2024]
పవిత్ర వైనతేయ నదీ తీరంలో కొలువైన అప్పనపల్లి బాలబాలాజీస్వామివారి ఆలయం ఉత్సవ శోభను సంతరించుకుంది. -
అన్నదాత ఆత్మ సంకల్పానికి దెబ్బ
[ 16-06-2024]
పుడమి తల్లిని నమ్ముకుని ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అడుగడుగునా సమస్యలే. విత్తు వేసింది మొదలు.. దిగుబడి వచ్చే వరకు, ఆ తర్వాత కూడా అనేక సవాళ్లు. -
అక్కడ కూలినా.. ఇక్కడ వేళ్లూనేలా..
[ 16-06-2024]
దశాబ్దాల క్రితం నాటి ఓ రావిచెట్టు కాకినాడ బాలాత్రిపుర సుందరి దేవాలయం రహదారిలో గురువారం కూలిపోయిన విషయం తెలిసిందే. -
పూలబాట పరిచిన పాదాలకు పుష్పాభిషేకం
[ 16-06-2024]
కాకినాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శనివారం ఫాదర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ తండ్రులపై చిన్నారులు పూలు చల్లి ఆశీర్వచనం తీసుకున్నారు.