న్యాయమూర్తి ఔదార్యం.. అనాథకు ఆశ్రయం
పిఠాపురానికి చెందిన గురుప్రసాద్(75) మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం మండలం దత్తగిరి ఆశ్రమానికి వచ్చారు. అనారోగ్యంతో కదల్లేకుండా ఉన్న ఆయన్ను గుర్తించిన స్థానిక సర్పంచి, ఆశ్రమ నిర్వాహకులు 108లో ఆసుపత్రికి
గురుప్రసాద్ను తరలిస్తున్న ఆసుపత్రి సిబ్బంది
సంగారెడ్డి (జహీరాబాద్ అర్బన్): పిఠాపురానికి చెందిన గురుప్రసాద్(75) మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం మండలం దత్తగిరి ఆశ్రమానికి వచ్చారు. అనారోగ్యంతో కదల్లేకుండా ఉన్న ఆయన్ను గుర్తించిన స్థానిక సర్పంచి, ఆశ్రమ నిర్వాహకులు 108లో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి బాధితుడితో మాట్లాడారు. స్థానిక ఎస్ఐ శ్రీకాంత్, ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి డాక్టర్ శేషురావు సహకారంతో దుండిగల్లోని అనాథాశ్రమానికి తరలించే ఏర్పాట్లు చేయించారు. గురుప్రసాద్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్లో ఉంటూ రికార్డింగ్ స్టుడియో నిర్వహించినట్లు తెలిసింది. అతని కూతురు చరవాణికి ఫోన్ చేయగా సమాధానం రాలేదు. తండ్రిని భారంగా భావించిన కన్నబిడ్డలే బర్దీపూర్ ఆశ్రమం వద్ద వదిలేసి వెళ్లిఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు.