బడిబయటి పిల్లల వివరాలపై నివేదికకు ఆదేశం
జిల్లాలో పాఠశాలలకు హాజరుకాని విద్యార్థులు(డ్రాపౌట్స్) వివరాలు సేకరించి సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. మంగళవారం విద్యాశాఖ, ఇంజినీరింగ్, మండలస్థాయి అధికారులతో
వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం), న్యూస్టుడే: జిల్లాలో పాఠశాలలకు హాజరుకాని విద్యార్థులు(డ్రాపౌట్స్) వివరాలు సేకరించి సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. మంగళవారం విద్యాశాఖ, ఇంజినీరింగ్, మండలస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 6,488 మంది డ్రాపౌట్స్ పిల్లలు ఉన్నారని, వీరిని పాఠశాలకు రప్పించే విషయంలో ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయాల్లోని సంక్షేమ సహాయకులు బడిబయట పిల్లల ఇళ్లకు వెళ్లి వారిని పాఠశాలలకు రప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
* ‘నాడు-నేడు’ పనులపై సమీక్ష: జిల్లాలోని ఆయా పాఠశాలల్లో జరుగుతున్న ‘నాడు-నేడు’ పనులపై కలెక్టర్ సమీక్షించారు. పూర్తయిన పనుల వివరాలు ఫొటోలతో సహా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. ఈ విషయంలో ఇంజినీరింగ్ సహాయకులు వ్యక్తిగత చొరవ చూపాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, సర్వశిక్షాభియాన్ ఇంజినీరింగ్ అధికారులు, ఆయా మండల పరిధిలోని అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతలు సక్రమంగా నిర్వహించడంలేదనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు ప్రగతి అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు.