logo

పవన్‌ పిఠాపురంలో ఇల్లు నిర్మించుకుంటారు: నాగబాబు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు పిఠాపురమే శాశ్వత నివాస స్థలం అవుతుందని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు తెలిపారు.

Published : 16 Apr 2024 03:49 IST

పిఠాపురం, న్యూస్‌టుడే: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు పిఠాపురమే శాశ్వత నివాస స్థలం అవుతుందని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు తెలిపారు. పిఠాపురం మండలంలోని కుమారపురం హోటల్‌ గోకులం గ్రాండ్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. శాసనసభ సమావేశాలు, కేంద్ర పర్యటనలు, పార్టీ కార్యకలాపాల పర్యటనలు మినహా.. మిగిలిన రోజుల్లో నియోజకవర్గంలోనే ఉంటారన్నారు. స్థానిక సమస్యలపై ఇప్పటికే దృష్టి సారించారని.. వినతులు స్వీకరించి, పరిష్కారానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తారన్నారు. ఈ పవిత్ర స్థలం నుంచి పవన్‌ పోటీకి దిగడం అదృష్టమన్నారు. 15 ఏళ్లుగా పవన్‌ రాజకీయాల్లో ఉన్నారన్న నాగబాబు.. ఒక్కసారి అసెంబ్లీకి పంపితే చట్టసభల్లో తన గళం వినిపిస్తారన్నారు. 30 వేల మంది మహిళలు అదృశ్యమైతే కనీసం సమీక్షించే సమయం కూడా సీఎం జగన్‌కు లేదని విమర్శించారు. రైతు ఆత్మహత్యలపై అబద్ధాలు చెబుతున్నారన్నారు. జనసేన ఎవరికీ నష్టం చేయదని, ప్రజలకు నష్టం జరిగితే ఎవరినీ వదిలిపెట్టదన్నారు. వేములపాటి అజయ్‌కుమార్‌, మర్రెడ్డి శ్రీనివాస్‌, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని