logo

తెదేపా కూటమిని గెలిపించాలి

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెదేపా కూటమిని గెలిపించాలని సీనియర్ నాయకుడు పెండ్యాల అచ్చిబాబు కోరారు.

Published : 17 Apr 2024 20:31 IST

తాళ్లపూడి: భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెదేపా కూటమిని గెలిపించాలని సీనియర్ నాయకుడు పెండ్యాల అచ్చిబాబు కోరారు. మండల కేంద్రమైన తాళ్లపూడిలో తెదేపా మండల అధ్యక్షుడు పరమేశ్వరరావు, చాగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు విక్రమాదిత్య ఆధ్వర్యంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్టాడారు..వైకాపా ప్రభుత్వంలో ఉపాధి లేక వలసలు వెళ్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ముప్పిడి వెంకటేశ్వరరావు, పురందేశ్వరిలను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ద్విసభ్యకమిటీ సభ్యులు సుబ్బారాయ చౌదరి, రామకృష్ణ, ఉమ్మడి పార్టీల నాయకులు మారిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని