పవన్ రోడ్షో.. 6 గంటలు.. 40 కి.మీ.
భగభగమండే ఎండలో పూల జల్లులు కురిశాయి.. బాణసంచా కాల్పులతో పట్టపగలే ధగధగ మెరుపులు మెరిశాయి..
పోటెత్తిన జనం
ఈనాడు, కాకినాడ- న్యూస్టుడే, పిఠాపురం: భగభగమండే ఎండలో పూల జల్లులు కురిశాయి.. బాణసంచా కాల్పులతో పట్టపగలే ధగధగ మెరుపులు మెరిశాయి.. పిల్లలు, యువత, పెద్దలు, మహిళలు అంతా రోడ్లపైకి రావడంతో అభిమానం పోటెత్తి.. దారులు జన జాతరను తలపించాయి.. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రోడ్షో నిర్వహించారు. మీ బిడ్డను, ఇంట్లో ఒకణ్ని..మీ అన్నను ఆశీర్వదించండి.. అత్యధిక మెజార్టీతో కూటమి అభ్యర్థులను గెలిపించండని కోరుతూ ముందుకు సాగారు.
చెందుర్తి వద్ద జాతీయ రహదారిపై పవన్కల్యాణ్కు స్వాగతం పలుకుతున్న ప్రజలు, అభిమానులు
అదే ఉత్సాహం..
గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని పవన్కల్యాణ్ నివాసం నుంచి ప్రారంభమైన రోడ్షో కత్తిపూడి మీదుగా చెందుర్తి, తాటిపర్తి- కొడవలి కూడలి.. ప్రత్తిపాడు మండలం ధర్మవరం మీదుగా పిఠాపురం మండలంలోని పి.దొంతమూరు, వెల్దుర్తి, పి.తిమ్మాపురం, బి.కొత్తూరు, జగపతిరాజపురం, గోకివాడ, జమ్ములపల్లి, నరసింగపురం, లక్ష్మీనర్సాపురం, విరవాడ, విరవ, మల్లాం, జల్లూరు, ఎఫ్కే పాలెం, కందరాడ, కుమారపురం, జగ్గయ్యచెరువు వరకు సాగింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.20 వరకు ఆరు గంటలపాటు 40 కి.మీ పైగా ర్యాలీ సాగింది. మహిళలు హారతులిస్తూ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
వెల్దుర్తి, దొంతమూరు కూడలిలో మాట్లాడుతున్న పవన్కల్యాణ్
మీ సమస్యకు పరిష్కారమవుతా..
‘జనసేన, తెదేపా, భాజపా విజయం కోసం.. ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం అంతా తిరగాల్సిన పరిస్థితి.. అందుకే నియోజకవర్గంలో తిరగడానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నా’నని పవన్ తెలిపారు. గెలిచాక నేను ఎక్కడికో వెళ్లిపోను. మీ మధ్యనే ఉంటా.. మీ సమస్యలకు పరిష్కారమవుతానని తెలిపారు. పోలవరం పూర్తయ్యేవరకు ఆగకుండా.. స్థానికంగా ఉన్న చిన్న సాగునీటి వనరులను పునరుద్ధరించి రైతుల కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఏలేరు ఆధునికీకరణపై దృష్టిసారిస్తామన్నారు.
కొడవలి కొండపై తవ్వకాలు అడ్డుకుంటామని, అధ్వాన రహదారుల రూపు మారుస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మ ఆరోగ్యం బాలేదు..!
[ 20-05-2024]
జిల్లాలో రక్తహీనత కేసులు కొన్నాళ్లుగా అధికంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా గర్భిణుల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటోంది. పౌష్టికాహార లోపం, అనారోగ్య సమస్యల కారణంగా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. -
అంతులేని ఆక్రమణలు
[ 20-05-2024]
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్న ప్రబుద్ధుల కళ్లు ఇప్పుడు కాలువల గర్భాలపై పడింది. కాలువల్లోనే రెండంతస్తుల శాశ్వత భవనాలను సైతం నిర్మించేస్తున్నారు. ఇప్పటివరకు కాలువ గట్లను ఆక్రమించి దుకాణాలు నిర్మించుకోవడం వంటి చర్యలకు పాల్పడేవారు. -
పరిణయం.. పరమానందం
[ 20-05-2024]
పురుషోత్తముడు... మీసాలరాయుడు.. త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన అన్నవరం సత్యదేవుడు... పెళ్లికుమారుడిగా సౌభాగ్యదాయిని... సంతోషకారిణి.. అనంతలక్ష్మీ అమ్మవారు పెళ్లికుమార్తెగా.. ఆశీనులైన వేళ.. ఆ కల్యాణ వేడుక కనులారా వీక్షించిన భక్తజనం పులకించిపోయారు. -
కూటమి జట్టులో జోష్
[ 20-05-2024]
సార్వత్రిక సమరంలో ఓటు చైతన్యం కూటమి అభ్యర్థుల్లో కొత్త జోష్ నింపింది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదవ్వడంతో తమకు కలిసివస్తుందనే ధీమా అందరిలో వ్యక్తమవుతోంది. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఫల్యాలకు ప్రజలు విసిగిపోయారని.. -
ఈసారీ నాణ్యతకు పరీక్షే!
[ 20-05-2024]
జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో సమీకృత వ్యవసాయ ప్రయోగశాలలు (ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్) నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రతి వ్యవసాయ సీజన్లోనూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలకు ఇబ్బందులు తప్పడం లేదు. -
వంతెనల సమీపంలో తవ్వకాలే లేవట!
[ 20-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయట.. వంతెనలకు 500 మీటర్ల దూరంలో తవ్వకాలే లేవట.. ఇవీ జిల్లా యంత్రాగమంతా ఆదివారం రేవుల్లో పర్యటించి తేల్చిన విషయం. -
నిరీక్షించి.. నీరసించి..
[ 20-05-2024]
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో వైద్యసేవలు అందాలంటే రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ఓపీ చీటీ రాయించుకోవడం మొదలు.. వైద్యుడికి చూపించుకోవడం, వైద్య పరీక్షలు, అవసరమైన స్కానింగులు, -
పిఠాపురం, కాకినాడ నగర నియోజకవర్గాలపై నిఘా..?
[ 20-05-2024]
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. -
పొగాకు పంటకు పండగ
[ 20-05-2024]
ఎన్నో ఆటుపోట్లు మధ్య పండించిన వర్జీనియా పొగాకు పంట అమ్మకాలు జోరందుకున్నాయి. రోజురోజుకూ ధర పెరగడంతో పొగాకు రైతులు వేలం కేంద్రానికి బేళ్లను తరలిస్తున్నారు. -
థాయిలాండ్లో కోనసీమ కుర్రోడి జోష్
[ 20-05-2024]
థాయ్లాండ్లో ఆదివారం ఉదయం జరిగిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో భారత డబుల్స్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడీ విజయం సాధించింది. -
శాశ్వత పరిష్కారం ఎన్నటికో?
[ 20-05-2024]
బ్యాంక్ కెనాల్ ఎగదన్నడం, భారీ వర్షాల వల్ల ప్రతి సార్వా(ఖరీఫ్) సమయంలో లొల్ల, వాడపల్లి ఆయకట్టు పంట పొలాలు ఏటా ముంపుబారిన పడుతున్నాయి. ఏళ్లతరబడి అదే పరిస్థితి ఉంటున్నా పట్టించుకునే నాధుడు లేడు. -
బస్సు దగ్ధం
[ 20-05-2024]
నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టు ఎలా వచ్చిందంటే?
-
ఎన్నికల్లో హింస.. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాలు
-
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
-
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన