పొత్తు లేకుండా 165 సీట్లు గెలిచే సత్తా తెదేపాకు ఉంది
తెదేపా ఏ పొత్తు లేకుండా 165 సీట్లు గెలిచే సత్తా, దమ్ము ఉందని మాజీమంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేటలోని తన ఇంట్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైకాపా మూడేళ్ల పాలన విధ్వంసాలు, అరాచకాలే నీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్టుడే : తెదేపా ఏ పొత్తు లేకుండా 165 సీట్లు గెలిచే సత్తా, దమ్ము ఉందని మాజీమంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేటలోని తన ఇంట్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి చంద్రబాబు అవసరమని ప్రజలు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. జగన్మోహన్రెడ్డి చేతకాని పనులకు, పరిపాలనకు మూడేళ్లకే ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందన్నారు. కూల్చివేతలతో ప్రారంభమైన ఆయన మూడేళ్ల పాలనలో ఎక్కడన్నా కట్టడం నిర్మించారా అని ప్రశ్నించారు. ప్రజావేదిక కూల్చి మూడేళ్లయిన సందర్భంగా దుర్మార్గాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన తెదేపా నేతలను అడ్డుకుని అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ఒప్పంద ప్రకారం అభివృద్ధి చేసి వారి ప్లాట్లు వారికి ఇవ్వకుండా అమ్ముకునే అధికారం సీఎంకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రైతులు దీనిపై కోర్టుకు వెళతారని, సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం రైతులకు జరగాల్సిన న్యాయం పొందేవరకు అమ్ముకునే హక్కు లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్ముతున్న మద్యంలో విష రసాయనాలు ఉన్నాయని ఓ ల్యాబ్ రిపోర్టు ఇచ్చిందని, నాసిరకం మద్యం అమ్మి ఖజానా నింపాలన్న దురాలోచన ఇప్పటికైనా మానుకోవాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా భూసేకరణలో ఎంత అవినీతి జరిగిందో ప్రజలకు తెలసని, ఇప్పటికీ తెదేపా ప్రభుత్వంలో కట్టించిన టిడ్కో ఇళ్లు ప్రజలకు ఇవ్వకపోగా ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాల్లో ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదని ఆయన చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.