ఆన్లైన్లోనే హాజరు
విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రెండూ ఒకేదానిలో నమోదు చేసుకునేలా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ యాప్ను రూపొందించింది. ఈనెల 16 నుంచి కచ్చితంగా ఆ యాప్లో మాత్రమే హాజరు నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ అన్ని జిల్లాల విద్యాశాఖ
ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ యాప్
16 నుంచి అమలుకు ఆదేశం
ఈనాడు, అమరావతి: విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రెండూ ఒకేదానిలో నమోదు చేసుకునేలా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ యాప్ను రూపొందించింది. ఈనెల 16 నుంచి కచ్చితంగా ఆ యాప్లో మాత్రమే హాజరు నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. తొలుత స్కూల్ కాంప్లెక్సుల ప్రధానోపాధ్యాయులు ఆ యాప్లో తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. వారి ఐడీ ఆధారంగా ఆ కాంప్లెక్సు పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఆ యాప్ను తమ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునేలా దానికి రూపకల్పన చేశారు. దీంతో సోమవారం ఉదయం కాంప్లెక్సు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జెండా వందనం కార్యక్రమం ముగియగానే తమ పేర్లతో అటెండెన్స్ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్ప మంగళవారం నుంచి అందరూ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆన్లైన్లో హాజరు నమోదు సాధ్యం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని గుంటూరు జిల్లా విద్యా శాఖ అధికారి పి.శైలజ జిల్లాలోని అన్ని కాంప్లెక్సుల హెచ్ఎంలు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సోమవారం యాప్ డౌన్లోడ్ చేసుకుని మిగిలిన ఉపాధ్యాయులు దాన్ని ఇన్స్టాల్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యాప్ ఇన్స్టాలేషన్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి సీఆర్పీలను అందుబాటులో ఉండాలని, వారి సేవలను వినియోగించుకోవాలని విద్యా శాఖ వర్గాలు సూచించాయి.
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో 3600 పాఠశాలలు, 4 లక్షల మంది చిన్నారులు ఉన్నారు. 13వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరి వివరాలు మొత్తం యాప్లో ఎక్కించడానికి ఉపాధ్యాయులు అంతా సమన్వయంతో పనిచేయాలని, ఇది ఏ ఒక్కరో చేస్తే అయ్యేది కాదని, అందరూ భాగస్వాములు కావాలని ఉన్నతాధికారులు సూచించారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు మాత్రమే హాజరు నమోదు చేసుకోవాలి. దీంతో అటెండెన్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని 16 నుంచి కచ్చితంగా విద్యార్థులకు ఆన్లైన్లోనే హాజరు వేయాలని సంబంధిత ప్రైవేటు యాజమాన్యాలకు స్పష్టం చేశారు. అమ్మ ఒడికి 75 శాతం హాజరును యాప్ అటెండెన్స్ను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు యాజమాన్యాలు అప్రమత్తంగా వ్యవహరించాలని విద్యా శాఖ అధికారులు కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.