సారొస్తేనే... గుర్తొస్తాయ్..!
నగరంలో సీఎం పర్యటించనున్న ప్రాంతాల్లోని పలు రోడ్ల ముస్తాబు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. 2న ముఖ్యమంత్రి రైతులకు వాహనమిత్ర పథకం కింద ట్రాక్టర్లు పంపిణీ చేయనున్న విషయం తెలిసిందే.
యుద్ధప్రాతిపదికన కొత్త రోడ్డు
యంత్రాంగం హడావుడితో చిక్కులు
బీటీ రోడ్డు వేస్తున్న సిబ్బంది
నెహ్రూనగర్, న్యూస్టుడే: నగరంలో సీఎం పర్యటించనున్న ప్రాంతాల్లోని పలు రోడ్ల ముస్తాబు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. 2న ముఖ్యమంత్రి రైతులకు వాహనమిత్ర పథకం కింద ట్రాక్టర్లు పంపిణీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చుట్టుగుంట వద్ద ఆయన జెండా ఊపి ట్రాక్టర్ల పంపిణీ చేయనున్నారు. ఆ కూడలికి చుట్టుపక్కలా గురువారం బీటీ రోడ్డు నిర్మించారు. రోడ్డుకిరువైపులా దుమ్ము, ధూళి, మట్టికుప్పలు తొలగించారు. గుంటూరు కన్వెన్షన్ హాల్ కూడలి నుంచి పీకలవాగు మీదుగా చుట్టుగుంట వరకు భారీ యంత్రాలు, నిర్మాణ సామగ్రితో గంటల్లోనే రోడ్డు నిర్మించడం విశేషం. ఉదయం ఈ మార్గంలో వెళ్లిన వారు, సాయంత్రానికి కొత్తగా నిగనిగలాడుతూ రోడ్డు కనిపించడంతో నివ్వెరపోయారు. దశాబ్దాలుగా ఆ ప్రాంతాల్లోని పలు రోడ్లు గుంతలమయమై అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నా పట్టించుకోని అధికారులు, సీఎం పర్యటనతో ఒక్కసారిగా నిర్మాణానికి పూనుకోడం చూసి నగరవాసులు ‘సారొస్తున్నారు.. రహదారులు బాగు చేస్తున్నారంటూ’ చెవులు కొరుక్కున్నారు. రెండు గంటల సీఎం పర్యటన కోసం కొత్తగా రోడ్డు వేయడం హర్షణీయమే అయినా, నగరంలోని ఇతర ప్రాంతాల్లో అధ్వానంగా మారిన రహదారులపై శీతకన్ను ఎందుకు వేస్తున్నారని పెదవి విరిచారు. అధికారులు అన్ని ప్రాంతాల్లో ఇదే తరహాలో రోడ్లను బాగు చేస్తే బాగుంటుదని అభిప్రాయపడుతున్నారు.
ట్రాఫిక్లో చిక్కుకున్న 108 అంబులెన్స్
రాడ్లు పాతి.. దారి మూసి..
గుంటూరు చుట్టుగుంట కూడలిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా వైఎస్సార్ యంత్ర సేవా పథకం కార్యక్రమానికి హడావుడిగా రహదారి పనులు మొదలుపెట్టారు. జాతీయ రహదారి నుంచి వాహనాలు నగరంలోకి ప్రవేశించే ప్రధాన మార్గం కావడంతో వాహనాల రద్దీ కారణంగా గంటల తరబడి ట్రాఫిక్ జాంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 108 అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకున్నా పట్టించుకునేవారు లేక రద్దీ తగ్గేవరకు ఆగాల్సి వచ్చింది. వారం రోజుల క్రితమే సీఎం కార్యక్రమ వివరాలు తెలిసిన అధికారులు చేస్తున్న హడావుడి పనులతో ఇబ్బందులు తప్పడం లేదని వాహనదారులు వాపోయారు. షాపులు, ఇళ్లకు దారి లేకుండా బారికేడ్లతో దిగ్బంధం చేసేలా రాడ్లు పాతారు. రహదారుల వెంట ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు నిలబెట్టారు.
షాపులు, ఇళ్లకు దారి లేకుండా బారికేడ్లు
శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం పంపిణీ చేసే యంత్ర పరికరాల కార్యక్రమానికి ముందుగానే పిలవడంతో గురువారం రాత్రంతా ట్రాక్టర్లపైనే నిద్రిస్తున్న రైతులు
ఈనాడు గుంటూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.