logo

జోరుగా నామినేషన్లు

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. గుంటూరు పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Published : 23 Apr 2024 06:08 IST

అసెంబ్లీకి 31, పార్లమెంట్‌కు 6 

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. గుంటూరు పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సోమవారం మంచి ముహూర్తమని భావించిన చాలా మంది నామినేషన్ల దాఖలుకు వరుస కట్టారు. గుంటూరు పార్లమెంట్‌ స్థానానికి ఆరుగురు వేయగా, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 31 మంది నామినేషన్లు వేశారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు