జగన్ కుతంత్రం.. ఓడిన మానవత్వం
నా అవ్వాతాతలు ఆనందంగా ఉండాలి. వారికి ఇంటి వద్దే పింఛను అందిస్తున్నాం. వారి చల్లని దీవెనలు అందించాలి. ఇవీ సీఎం జగన్ వృద్ధులను ఉద్దేశిస్తూ ఆయా సభల్లో చెప్పే మాటలు.
ఎండలో మాడిన అవ్వాతాతలు
పొన్నూరులో వృద్ధుడి మృత్యువాత
జగన్ అనుకున్నది.. అధికారులు చేశారు
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే, జిల్లా పరిషత్తు (గుంటూరు), నెహ్రూనగర్, పెదకాకాని, ప్రత్తిపాడు
నా అవ్వాతాతలు ఆనందంగా ఉండాలి. వారికి ఇంటి వద్దే పింఛను అందిస్తున్నాం. వారి చల్లని దీవెనలు అందించాలి.
ఇవీ సీఎం జగన్ వృద్ధులను ఉద్దేశిస్తూ ఆయా సభల్లో చెప్పే మాటలు.
వృద్ధులకు ఇంటి వద్దే సచివాలయ కార్యదర్శుల ద్వారా పింఛను ఇచ్చే అవకాశం ఉన్నా కాదన్నారు. సీఎం జగన్ కోరుకున్నట్లే అధికారులు చేశారు. గత నెలలో పోయిన పండుటాకుల ప్రాణాలు చాలదన్నట్లు వ్యవహరించారు.వాడకంలో లేని బ్యాంకు ఖాతాల్లో పింఛను డబ్బులు జమ చేసి తమాషా చూస్తున్నారు. ఈ విధానంతో వృద్ధులకు ఎదురయ్యే పాట్లపై ముందుగానే అప్రమత్తం చేసినా చెవికెక్కించుకోలేదు. ఫలితంగా పొన్నూరులో ఓ వృద్ధుడు ఎండదెబ్బతో మృతి చెందారు. పలుచోట్ల వృద్ధులు సొమ్మసిల్లి పడిపోయారు. జగన్ మాటల్లో ఒలకబోసే ప్రేమ చేతల్లో మాయమైంది. ఓట్ల కుతంత్రంలో మానవత్వం ఓడిపోయింది.
సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో శుక్రవారం రెండో రోజు కూడా బ్యాంకులు, కియోస్క్ కేంద్రాల వద్ద అవ్వాతాతలు, వితంతువులు నగదు కోసం పడరాని పాట్లు పడ్డారు. బ్యాంకుల్లో రద్దీ పెరగడంతో కూర్చోవడానికి చోటులేక అవస్థలు పడ్డారు. తీవ్రమైన ఉక్కపోత, వేడిసెగలతో కూడిన గాలులతో వారు అల్లాడిపోయారు. తాగునీరు, నీడ వంటి కనీస సదుపాయాలు కల్పించలేదు.
సొమ్ము జమకాక..
సాంకేతిక కారణాలతో కొందరికి నగదు జమ కాకపోవడంతో వారు గ్రామ సచివాలయాలకు, అక్కడి నుంచి బ్యాంకులకు వెళ్లి ఆరా తీశారు. అక్కడ మరోసారి చూసి బ్యాంకు ఖాతా మనుగడలో లేదని, ఆధార్ కార్డు, రెండు ఫొటోలు తీసుకొస్తే ఖాతా అప్డేట్ చేసిన తర్వాత నగదు తీసుకోవచ్చని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఉసూరుమంటూ వెనుదిగిరారు. బ్యాంకుల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో వారు ఖాతా మనుగడలో ఉందా? లేదా? చెప్పడానికి కూడా గంటల సమయం తీసుకున్నారు. జిల్లాలో 4వేల మంది బ్యాంకు ఖాతాలు వినియోగంలో లేకపోవడంతో నగదు జమ కాలేదు. వీరందరికీ 4న నగదు పంపిణీ చేయనున్నారు.
3 గంటల పాటు పడిగాపులు
వృద్ధులు నగదు ఉపసంహరణకు ఫారం నింపడానికి కూడా వరుసలో నిలబడాల్సి వచ్చింది. ఒక్కో లబ్ధిదారు కనీసం 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు ఎదురుచూశారు. కొందరు నీరసించిపోవడంతో వారిని కుర్చీల్లో కూర్చోబెట్టారు. గుంటూరు నగరం అరండల్పేటలోని ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు శాఖల్లో పింఛన్దారులు పదుల సంఖ్యలో వచ్చారు. ముట్లూరు కెనరాబ్యాంకు, వట్టిచెరుకూరు చైతన్యగోదావరి బ్యాంకు శాఖలో రద్దీ కొనసాగింది. మంగళగిరి యూనియన్ బ్యాంకులో వృద్ధుల రద్దీ పెరగడంతో గేటు వేశారు. రద్దీ తగ్గేవరకు కొందరు బయటే వేచి ఉండాలని చెప్పారు. కొన్ని చోట్ల రాజీనామా చేసిన వాలంటీర్లు, వైకాపా నేతలు బ్యాంకులు, ఆయా మార్గాల్లో వృద్ధులు కనిపిస్తే ప్రతిపక్షాల వల్ల ఇబ్బందులు వచ్చాయని వారికి చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంలో ఉన్నది జగన్ కదా? ఆయన సక్రమంగా చేయలేక ఎదుటివారిపై నిందలు వేస్తారా? అని లబ్ధిదారులు వారిని నిలదీశారు.
పింఛను సొమ్ము లేకుండా వెనక్కి వెళ్తున్నా
యూనియన్ బ్యాంకు ఖాతాలో పింఛను వేశారు. నగదు విత్డ్రా స్లిప్పు రాయించుకున్నాను. టోకెన్ ఇచ్చారు. చివరకు ఖాతా పని చేయడం లేదని ఆధార్ కార్డు జిరాక్సు ఇవ్వమంటే ఇచ్చా. డబ్బుల కోసం శనివారం రమ్మన్నారు. ఎండలో రాలేక, బండిమీద కూర్చో లేక ఇబ్బంది పడుతున్నా.
కాసమ్మ, ప్రత్తిపాడు
అద్దె, కరెంట్ బిల్లు ఎలా కట్టాలయ్యా
మోకాళ్లు అరిగిపోవడంతో నా రెండు కాళ్లు పడిపోయాయి. ఎనిమిదేళ్లుగా నడవడం కాదుకదా సరిగా నిల్చోలేను. పింఛను డబ్బులే నాకు ఆధారం. సచివాలయ సిబ్బందికి ఫోన్ చేస్తే నా డబ్బులు బ్యాంకులో పడ్డాయన్నారు. మే 2న నా పెద్ద తమ్ముడు నన్ను తీసుకొని బ్యాంకుకు వచ్చాడు. ఉదయం, సాయంత్రం రెండు సార్లు జనంతో రద్దీగా ఉంది. 3న ఉదయం రమ్మన్నారు. నా పెద్ద తమ్ముడు ఆ రోజు ఉద్యోగానికి సెలవు పెట్టడంతో రూ.800 నష్టపోయాం. ఆటో నడుపుకునే నా చిన్నతమ్ముడు శుక్రవారం బ్యాంకుకు తీసుకొచ్చాడు. రోజంతా ఇక్కడే ఉండడంతో నా వల్ల అతనికి ఆటో అద్దె, బాడుగలు కలిపి రూ.1000 నష్టపోయాడు. మెట్లు ఎక్కలేను. ఆటోలోనే ఉండి నా తమ్ముడి ద్వారా ఫారం తెప్పించి భర్తీ చేసి ఇచ్చా. తీరా చూస్తే నా ఖాతా నాలుగేళ్లుగా వాడడం లేదని వాటి ఖర్చులంటూ రూ.600 మినహాయించి రూ.2400 వస్తాయన్నారు. పింఛను రూ.3వేల కోసం నేను, నా ఇద్దరు తమ్ముళ్లు రెండు రోజులు కష్టపడి తిరిగితే చేతికి రూ.2400 వచ్చింది. ఇంటి అద్దె, కరెంట్ బిల్లు ఎలా కట్టాలో అర్థం కావడం లేదయ్యా.
- మేరీ, గుంటూరు
మూడంకెల నంబరిచ్చి పంపేశారు
పింఛను కోసం సచివాలయానికి వెళ్లా. బ్యాంకులో పడ్డాయని చెప్పారు. నాకు బ్యాంకు ఖాతాలేదని మొత్తుకున్నాను. నా మాట వింటేగా. ఇదిగో నీ ఖాతా నంబర్ చివరి అంకెలంటూ 283 అని నా చేతిలో రాసి ఇచ్చారు. వెళ్లి పలానా బ్యాంకులో చూసుకోమన్నారు. ఎండలో పడి ఇంతదూరం వచ్చా. క్యూలో నిలబడి నానా అవస్థలు పడి బ్యాంకు వాళ్లకు 282 అంకె చూపించి నా పేరు చెబితే వాళ్లు బ్యాంకు పుస్తకం తీసుకురమ్మంటున్నారు. నాకు బ్యాంకు ఖాతానే లేదంటే వాళ్లు పుస్తకం తెస్తేకాని చెప్పలేమని పంపించారు. ఇదెక్కడి గోలండిబాబు. సచివాలయంలో వాళ్లు, బ్యాంకు వాళ్లు నా పింఛను గురించి సరిగా సమాధానం చెప్పడంలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
- పోతురాజు
ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది
నా పేరు కొండారెడ్డి అచ్చెమ్మ. తక్కెళ్లపాడు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. బ్యాంకు పాస్ పుస్తకం పోయింది. పింఛను నగదు నా ఖాతాలో జమ చేసినట్లు అధికారులు చెప్పారు. పుస్తకం కోసం రెండు రోజులుగా తిరుగుతున్నా. ఎవరూ పట్టించుకోలేదు. ఎర్రటి ఎండలో 1.5 కి.మీ దూరంలో ఉన్న బ్యాంకుకు వచ్చా. ప్రభుత్వం తీవ్ర ఇబ్బంది పెడుతోంది. పింఛను నగదుతో మాత్రలు కొనుగోలు చేసుకోవాలి. 3వ తేదీన వచ్చినా చేతికి పింఛను అందలేదు. బ్యాంకు చుట్టూ తిరగలేకపోతున్నాను. బ్యాంకు పాస్ పుస్తకం కోసం ఆధార్ కార్డు నకలు, ఫోటోను అధికారులు అడుగుతున్నారు.
- కొండారెడ్డి అచ్చెమ్మ, తక్కెళ్లపాడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనిపించని పోలింగ్ దస్త్రాలు?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
అక్రమం చూస్తారా... అడ్డుకట్ట వేస్తారా?
[ 18-05-2024]
కొల్లిపర మండల పరిధిలోని వల్లభాపురం, మున్నంగి, కొత్తపాలెం, బొమ్మువానిపాలెం, అన్నవరం తదితర గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను సైతం గుత్తేదారులు లెక్కచేయడం లేదు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తూ టన్నుల కొద్దీ తరలిస్తున్నారు. -
వర్షం పలకరింపు.. పుడమి పులకరింపు
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్ జూన్ నెల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. మూడు నెలలుగా మండుటెండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వర్షం రాకతో ఉపశమనం కలిగింది. -
డైరీ, రిజిస్టర్లు ఏమయ్యాయి?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
వాడరేవులో రాష్ట్ర గవర్నర్
[ 18-05-2024]
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబంతో సహా చీరాల మండలం వాడరేవుకు శుక్రవారం వచ్చారు. స్థానిక ఐటీసీ అతిథి గృహంలో సేదతీరారు. -
తెలుగు పుస్తకంలో జిల్లా అంశాలు
[ 18-05-2024]
ఈ ఏడాది పదోతరగతి పుస్తకాలు పూర్తిగా మారిపోతున్నాయి. తెలుగు, హిందీ, పీఎస్, ఎన్ఎస్ ఒక్కొక్క పుస్తకం కాగా, గణితం రెండు, ఆంగ్లం మూడు, సాంఘిక శాస్త్రం నాలుగు పుస్తకాలు మొత్తం 13 పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. -
దయచేసి వినండి.. ధరలు అధికం
[ 18-05-2024]
గుంటూరు రైల్వే స్టేషన్లో దూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని గుత్తేదారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా మంచినీరు, బిస్కెట్లు, శీతల పానీయాల అమ్మకాల్లో గరిష్ఠ అమ్మకం ధర కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. -
ఉపాధి కల్పన జేడీ ఇంటిపై పెట్రోలు సీసాతో దాడి
[ 18-05-2024]
రాష్ట్ర ఉపాధి కల్పనశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీ)ఇంటిపై శుక్రవారం గుర్తుతెలియని దుండగులు పెట్రోలు సీసాతో దాడిచేసి ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, ఫిర్యాదుదారుల కథనం ప్రకారం.. రాష్ట్ర ఉపాధికల్పనశాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ (జేడీ) డి.చైతన్య గుంటూరు ఆకులవారితోటలో నివాసం ఉంటున్నారు. -
పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల వ్యాపారం
[ 18-05-2024]
వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామానికి చెందిన ఓ వైకాపా నాయకుడు తన మామిడి పండ్ల వ్యాపారానికి స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకున్నారు. వర్షం కురుస్తుండడంతో ప్రధాన కూడలిలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల పెట్టెలను ఉంచి వ్యాపారం చేశారు. -
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలి
[ 18-05-2024]
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలని బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ పేర్కొన్నారు. దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్లో ప్రధానమంత్రి మోదీకి పంపుతున్న ఉత్తరాలను రాసి శుక్రవారం ప్రదర్శించారు. -
అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్జీటీ తీర్పును ఉల్లంఘిస్తూ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసినవారిపై దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రతి జిల్లాలో పోలీసులు, వివిధ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను ఆపే బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. -
పట్టణాల్లోనూ ఓటరు పోటెత్తారు!
[ 18-05-2024]
సాధారణంగా పట్టణాల్లో నివసించేవారికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి గంటలకొద్దీ వేచి ఉండి ఓటేసే సహనం ఉండదు. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చినవారు పట్టణాల్లో స్థిరపడతారు. ఎవరు ఓటేశారు? ఎవరు వేయలేదు? అనేది గ్రహించరని, తమను ఓటేయమని ఎవరూ అడగరని ఓటేయడానికి నిర్లక్ష్యం వహిస్తారు. -
ఈవీఎంల భద్రతపై సమావేశం
[ 18-05-2024]
జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంల భద్రతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి సమావేశంలో పాల్గొన్నారు. -
ఎవరిపై వేటు పడుతుందో..
[ 18-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, మరుసటి రోజు చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు పలువురిపై వేటు వేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో విఫలమైన అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. -
కేసుల్లో ఇరికించి.. చితకబాదారు
[ 18-05-2024]
మాచవరం మండలంలో పోలింగ్ అనంతరం మరుసటి రోజు జరిగిన గొడవల్లో తమను పోలీసులు కేసులు ఇరికించారని, దారుణంగా కొట్టారని తెదేపా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 14న మాచవరం ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా గాయపరిచారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్కు రూ.10 లక్షల బురిడీ
[ 18-05-2024]
మాయ మాటలతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ను బోల్తా కొట్టించిన సైబర్ కేటుగాళ్లు అతని ఖాతా నుంచి రూ.10 లక్షలు స్వాహా చేశారు. పట్టణానికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్కు కొద్ది రోజుల కిందట ఒక ఫోన్ కాల్ వచ్చింది. -
ఎమ్మెల్యే అనుచరులు బెదిరించారు
[ 18-05-2024]
-
సినీ థియేటర్లను బతికించండి
[ 18-05-2024]
నిర్వహణ ఖర్చులు కూడా రాక సినీ థియేటర్లు క్రమంగా మూతపడుతున్నాయని, తెలంగాణలో ఇప్పటికే అ విషయాన్ని అధికారికంగా ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్లోనూ అదే తరహా పరిస్థితులు ఉన్నాయని సినీ దర్శకుడు, మా ఏపీ అధ్యక్షుడు దిలీప్రాజా పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
-
వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో చంపించిన భార్య..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM