జగన్.. మాపై ఎందుకీ కక్ష?
భట్టిప్రోలు మండలం తాతావారిపాలెం గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు స్థానిక యూనియన్ బ్యాంకుకి ఆటోలో వచ్చారు. ఆమె ఖాతాలో కొంతకాలంగా లావాదేవీలు జరగకపోవడంతో నగదు తీసుకోవడం.
పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ తీరుపై పండుటాకుల ఆగ్రహం
రెండో రోజూ బ్యాంకులు, సచివాలయాల చుట్టూ ప్రదక్షిణ
మండుటెండలో తిరుగుతూ సొమ్మసిల్లిన వృద్ధులు
భట్టిప్రోలు మండలం తాతావారిపాలెం గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు స్థానిక యూనియన్ బ్యాంకుకి ఆటోలో వచ్చారు. ఆమె ఖాతాలో కొంతకాలంగా లావాదేవీలు జరగకపోవడంతో నగదు తీసుకోవడం. సాధ్యం కాదని బ్యాంకు అధికారులు చెప్పారు. బయట కూర్చోవటంతో కళ్లు తిరిగి పడుకుంది. 12 గంటల సమయంలో కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను ఆటోలో తీసుకెళ్లారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటికే పింఛను అందించే వెసులుబాటును కాదని, అవ్వాతాతలను బ్యాంకుల వద్దకు రప్పించి ప్రభుత్వం ఇక్కట్ల పాల్జేసింది. బ్యాంకులు, సచివాలయాల చుట్టూ మండుటెండలో తిరుగుతూ వృద్ధులు అష్టకష్టాలు పడ్డారు. ఎండకు తాళలేక సొమ్మసిల్లిపడిపోయారు. బ్యాంకుల్లో రద్దీ పెరగడంతో గేట్లు వేసి కొందరినే బయటే ఉంచడంతో వారుపడిన పాట్లు వర్ణనాతీతం. జగన్ రాజకీయ కుట్రకు తాము బలయ్యామని వృద్ధులు, వితంతువులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో రద్దీ పెరగడం, కూర్చొడానికి చోటు, తాగడానికి నీరు అందుబాటులో లేకపోవడం, తీవ్రమైన ఉక్కపోత, వేడిసెగలతో కూడిన గాలులతో వృద్ధులు అల్లాడిపోయారు.
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే-
రేపల్లె అర్బన్, భట్టిప్రోలు, అద్దంకి, బాపట్ల
జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జనాలు భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేసి వారందరినీ ఎండలో తిప్పారు. పండుటాకులు పింఛన్ సొమ్ము కోసం ఇంటి గడప దాటి బ్యాంకులు, గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించి పింఛన్ల సొమ్మును జిల్లాలోని లబ్ధిదారుల్లో 75 శాతం మందికి వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకెళ్లడానికి అవ్వాతాతలు బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి. గురువారం జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు, కియోస్క్ కేంద్రాల వద్ద అవ్వాతాతలు, వితంతువులు బ్యాంకులకెెళ్లి నగదు కోసం పడరాని పాట్లు పడ్డారు. శుక్రవారం కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. వందలాది మంది బ్యాంకులకు వెళ్లటంతో సిబ్బంది పింఛన్ల సొమ్ము అందించేందుకు చాలా సమయం తీసుకున్నారు. సాంకేతిక కారణాలతో కొందరికి నగదు జమ కాకపోవడంతో వారు గ్రామ సచివాలయాలకు వెళ్లి ఆరా తీశారు. పింఛను సొమ్ము బ్యాంకులోనే జమ చేశామని సచివాలయ సిబ్బంది చెబితే మళ్లీ బ్యాంకులకు వెళ్లారు. అక్కడ మరోసారి చూసి బ్యాంకు ఖాతా మనుగడలో లేదని, ఆధార్కార్డు, రెండు ఫొటోలు తీసుకొస్తే ఖాతా అప్టేట్ చేసిన తర్వాత నగదు తీసుకోవచ్చని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఉసూరుమంటూ వృద్ధులు వెనుదిగిరారు.
కొనసాగిన తప్పుడు ప్రచారం..
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛను నగదు చెల్లించడానికి చంద్రబాబునాయుడు ఆటంకాలు కలిగిస్తున్నారని, కోర్టులో కేసులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడనీ గురువారం నుంచి ఫోన్లకు వాయిస్ రికార్డు వస్తున్నాయి. శుక్రవారం కూడా ఇవి కొనసాగాయి. కొన్నిచోట్ల రాజీనామా చేసిన వాలంటీర్లు, కొందరు వైకాపా నేతలు బ్యాంకులు, ఆయా మార్గాల్లో వృద్ధులు కనిపిస్తే తెలుగుదేశం పార్టీ కుట్ర వల్ల ఇబ్బందులు వచ్చాయని వారికి చెప్పే ప్రయత్నం చేశారు. లబ్ధిదారులు కొందరు ప్రభుత్వంలో ఉన్నది జగన్ కదా? ఆయన సక్రమంగా చేయలేక ఎదుటివారిపై నిందలు వేస్తారా? అని నిలదీశారు.
ఎస్బీఐ కాదు.. బీవోబీకి వెళ్లండి
రేపల్లె మండలం వడ్డివారిపాలెం పంచాయతీ వాకావారిపాలేనికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు వాకా కోటేశ్వరమ్మ వృద్ధాప్య పింఛను తీసుకునేందుకు శుక్రవారం రేపల్లె చేరుకున్నారు. స్థానిక ఎస్బీఐ మెయిన్ బ్రాంచిలో నగదు తీసుకొనేందుకు వెళితే, బ్యాంకు ఆఫ్ బరోడా బ్యాంకు ఖాతాలో నగదు జమ అయిందని సిబ్బంది చెప్పారు. మెట్లు దిగి నడవలేక అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. వాకావారిపాలెం నుంచి 15 కి.మీ దూరం ఆటోలో రేపల్లె వచ్చి అక్కడ నుంచి బ్యాంకుకు ఎండలో నడిచి రావడంతో వడదెబ్బకు గురై నీరసించి పోయానని వాపోయింది.
ఎండలో తిప్పడం సీఎం జగన్కు భావ్యమేనా?
పింఛను కోసం చీరాల నుంచి బస్సులో బాపట్ల వచ్చి సచివాలయానికి వెళ్లాను. నగదు బ్యాంకు ఖాతాలో జమ చేశామన్నారు. బ్యాంకుకు వెళ్లి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచి ఉండి పాసుపుస్తకం చూపిస్తే నీ ఖాతా పని చేయడం లేదని చెప్పి ఓ కాగితం తీసుకుని మళ్లీ వచ్చే బుధవారం రావాలని సూచించారు. 80 ఏళ్ల వృద్ధురాలిని ఇలా ఎండలో తిప్పటం సీఎం జగన్కు భావ్యమేనా? బ్యాంకుల్లో పింఛను సొమ్ము ఎవరు వేయమన్నారు. మండుటెండలో తిప్పి మా ప్రాణాలు తీసేస్తారా.. ప్రభుత్వమే కనీసం దయ లేకుండా ఇలా ఇబ్బంది పెడితే మాలాంటి వృద్ధులు ఎవరికి చెప్పుకోవాలి.
వీరమ్మ, వృద్ధురాలు
అలసి.. సొలసి..సొమ్మసిల్లి..
అద్దంకి ఎన్టీఆర్నగర్లో నివాసం ఉంటున్న పినపాల వెంకటరత్నం తన పింఛను గురించి పదో సచివాలయం వద్దకు వెళ్లి విచారించగా బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఖాతా ఉన్నట్లు సూచించారు. దీంతో ఆమె బ్యాంకుకు వెళితే ఖాతా యాక్టివ్గా లేదని, వెంటనే రూ.100 చెల్లించి, తగు ఫారాలు నింపుకోవాలని సూచించారు. అప్పటికే మధ్యాహ్నం 12 గంటలు కావడంతో నీరసించి ఆమె పురపాలక కార్యాలయం మెట్ల వద్దకు వచ్చి సొమ్మసిల్లింది. ఆ మార్గంలో వెళ్తున్న తెలుగు యువత నేత కోనేటి అనిల్ గమనించి ఆమెను బ్యాంకు వద్దకు తీసుకెళ్లి తగు పత్రాలను అందించారు. శనివారం నాటికి బ్యాంకు ఖాతా మనుగడలోకి వస్తుందని, అనంతరం నగదు డ్రా చేసుకోవచ్చని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనిపించని పోలింగ్ దస్త్రాలు?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
అక్రమం చూస్తారా... అడ్డుకట్ట వేస్తారా?
[ 18-05-2024]
కొల్లిపర మండల పరిధిలోని వల్లభాపురం, మున్నంగి, కొత్తపాలెం, బొమ్మువానిపాలెం, అన్నవరం తదితర గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను సైతం గుత్తేదారులు లెక్కచేయడం లేదు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తూ టన్నుల కొద్దీ తరలిస్తున్నారు. -
వర్షం పలకరింపు.. పుడమి పులకరింపు
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్ జూన్ నెల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. మూడు నెలలుగా మండుటెండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వర్షం రాకతో ఉపశమనం కలిగింది. -
డైరీ, రిజిస్టర్లు ఏమయ్యాయి?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
వాడరేవులో రాష్ట్ర గవర్నర్
[ 18-05-2024]
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబంతో సహా చీరాల మండలం వాడరేవుకు శుక్రవారం వచ్చారు. స్థానిక ఐటీసీ అతిథి గృహంలో సేదతీరారు. -
తెలుగు పుస్తకంలో జిల్లా అంశాలు
[ 18-05-2024]
ఈ ఏడాది పదోతరగతి పుస్తకాలు పూర్తిగా మారిపోతున్నాయి. తెలుగు, హిందీ, పీఎస్, ఎన్ఎస్ ఒక్కొక్క పుస్తకం కాగా, గణితం రెండు, ఆంగ్లం మూడు, సాంఘిక శాస్త్రం నాలుగు పుస్తకాలు మొత్తం 13 పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. -
దయచేసి వినండి.. ధరలు అధికం
[ 18-05-2024]
గుంటూరు రైల్వే స్టేషన్లో దూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని గుత్తేదారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా మంచినీరు, బిస్కెట్లు, శీతల పానీయాల అమ్మకాల్లో గరిష్ఠ అమ్మకం ధర కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. -
ఉపాధి కల్పన జేడీ ఇంటిపై పెట్రోలు సీసాతో దాడి
[ 18-05-2024]
రాష్ట్ర ఉపాధి కల్పనశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీ)ఇంటిపై శుక్రవారం గుర్తుతెలియని దుండగులు పెట్రోలు సీసాతో దాడిచేసి ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, ఫిర్యాదుదారుల కథనం ప్రకారం.. రాష్ట్ర ఉపాధికల్పనశాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ (జేడీ) డి.చైతన్య గుంటూరు ఆకులవారితోటలో నివాసం ఉంటున్నారు. -
పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల వ్యాపారం
[ 18-05-2024]
వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామానికి చెందిన ఓ వైకాపా నాయకుడు తన మామిడి పండ్ల వ్యాపారానికి స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకున్నారు. వర్షం కురుస్తుండడంతో ప్రధాన కూడలిలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల పెట్టెలను ఉంచి వ్యాపారం చేశారు. -
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలి
[ 18-05-2024]
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలని బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ పేర్కొన్నారు. దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్లో ప్రధానమంత్రి మోదీకి పంపుతున్న ఉత్తరాలను రాసి శుక్రవారం ప్రదర్శించారు. -
అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్జీటీ తీర్పును ఉల్లంఘిస్తూ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసినవారిపై దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రతి జిల్లాలో పోలీసులు, వివిధ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను ఆపే బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. -
పట్టణాల్లోనూ ఓటరు పోటెత్తారు!
[ 18-05-2024]
సాధారణంగా పట్టణాల్లో నివసించేవారికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి గంటలకొద్దీ వేచి ఉండి ఓటేసే సహనం ఉండదు. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చినవారు పట్టణాల్లో స్థిరపడతారు. ఎవరు ఓటేశారు? ఎవరు వేయలేదు? అనేది గ్రహించరని, తమను ఓటేయమని ఎవరూ అడగరని ఓటేయడానికి నిర్లక్ష్యం వహిస్తారు. -
ఈవీఎంల భద్రతపై సమావేశం
[ 18-05-2024]
జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంల భద్రతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి సమావేశంలో పాల్గొన్నారు. -
ఎవరిపై వేటు పడుతుందో..
[ 18-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, మరుసటి రోజు చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు పలువురిపై వేటు వేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో విఫలమైన అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. -
కేసుల్లో ఇరికించి.. చితకబాదారు
[ 18-05-2024]
మాచవరం మండలంలో పోలింగ్ అనంతరం మరుసటి రోజు జరిగిన గొడవల్లో తమను పోలీసులు కేసులు ఇరికించారని, దారుణంగా కొట్టారని తెదేపా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 14న మాచవరం ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా గాయపరిచారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్కు రూ.10 లక్షల బురిడీ
[ 18-05-2024]
మాయ మాటలతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ను బోల్తా కొట్టించిన సైబర్ కేటుగాళ్లు అతని ఖాతా నుంచి రూ.10 లక్షలు స్వాహా చేశారు. పట్టణానికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్కు కొద్ది రోజుల కిందట ఒక ఫోన్ కాల్ వచ్చింది. -
ఎమ్మెల్యే అనుచరులు బెదిరించారు
[ 18-05-2024]
-
సినీ థియేటర్లను బతికించండి
[ 18-05-2024]
నిర్వహణ ఖర్చులు కూడా రాక సినీ థియేటర్లు క్రమంగా మూతపడుతున్నాయని, తెలంగాణలో ఇప్పటికే అ విషయాన్ని అధికారికంగా ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్లోనూ అదే తరహా పరిస్థితులు ఉన్నాయని సినీ దర్శకుడు, మా ఏపీ అధ్యక్షుడు దిలీప్రాజా పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
తిరుపతి చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం
-
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్