‘సంక్షేమం పేరుతో జగన్ నమ్మక ద్రోహం’
రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమం పేరుతో ముస్లిం, మైనార్టీలకు నమ్మక ద్రోహం చేశారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ పేర్కొన్నారు.
మాట్లాడుతున్న ఫారూక్ షిబ్లీ
పొన్నూరు, న్యూస్టుడే: రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమం పేరుతో ముస్లిం, మైనార్టీలకు నమ్మక ద్రోహం చేశారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ పేర్కొన్నారు. స్థానిక అబ్దుల్కలామ్ రోడ్డులో శుక్రవారం రాత్రి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ముస్లింలు అభిమానంతో కాదని, అవగాహనతో ముందుకు సాగాలని సూచించారు. వైకాపా పాలనలో ముస్లిం, మైనార్టీలపై దాడులు, అవమానాలు అనేకం జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీ సంక్షేమ నిధులను నవరత్నాలకు కేటాయించి ముస్లింలకు తీవ్ర అన్యాయం చేశారని వాపోయారు. ఐదు సంవత్సరాల తెదేపా పాలనలో మసీదుల మరమ్మతులకు రూ.35.94 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. ముస్లిం,మైనార్టీలు ఆలోచించి నిర్ణయం తీసుకునే సమయం ఇదేనని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
-
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
-
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
-
పని ఒత్తిడి, విజిలెన్స్ విచారణ..ఎస్టీపీపీ అధికారి బలవన్మరణం