logo

జగన్‌ను గద్దె దించడానికి నిరుద్యోగులు సిద్ధం

రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను మోసగించిన సీఎం జగన్‌ను గద్దె దించడానికి 40 లక్షల మంది నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని నిరుద్యోగ జేఏసీ నాయకులు అన్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు 1800 కిలోమీటర్లు మేర చేపట్టిన నిరుద్యోగ చైనత్యయాత్ర శుక్రవారం మంగళగిరి చేరింది.

Published : 04 May 2024 04:38 IST

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్రతిజË్ఞ చేస్తున్న నిరుద్యోగులు

మంగళగిరి, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను మోసగించిన సీఎం జగన్‌ను గద్దె దించడానికి 40 లక్షల మంది నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని నిరుద్యోగ జేఏసీ నాయకులు అన్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు 1800 కిలోమీటర్లు మేర చేపట్టిన నిరుద్యోగ చైనత్యయాత్ర శుక్రవారం మంగళగిరి చేరింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రానున్న ఎన్నికల్లో తెదేపా విజయం సాధిస్తుందని,  డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం చేస్తారన్నారు. ఆయన్ను గెలిపిస్తామని అంబేడ్కర్‌ సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని