‘పేదకు నరకం’.. లేదే కనికరం..
రాజేష్, మనవడు మాది వినుకొండ మండలంలోని కొచ్చెర్ల గ్రామం. మా తాత చిన్నయేసు ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం గుంటూరు పెద్దాసుపత్రికి తీసుకొచ్చాం.
సీటీ స్కాన్కు ఫీట్లు తప్పవా
స్ట్రెచర్పై 400 మీటర్లు తోసుకెళ్లాల్సిందేనా..
ఎండలో తీసుకొస్తున్నాం: రాజేష్, మనవడు మాది వినుకొండ మండలంలోని కొచ్చెర్ల గ్రామం. మా తాత చిన్నయేసు ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం గుంటూరు పెద్దాసుపత్రికి తీసుకొచ్చాం. ఆయనకు సీటీ స్కాన్ కోసం వార్డు నుంచిదూరంగా ఉన్న నాట్కోలోని సీటీ స్కానింగ్ కేంద్రానికి స్ట్రెచర్పై ఎండలో తరలించాల్సి వచ్చింది. ఎండకు తాళలేక ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడే స్కానింగ్ యంత్రం ఏర్పాటు చేస్తే ఇబ్బంది ఉండేది కాదు. ఇంత దూరం ఎండలో తరలించడం కష్టంగా ఉంది. రోగులు కూడా నలిగిపోతున్నారు.
జగన్ జమానాలో...
‘జగన్ ప్రభుత్వం వచ్చాక పేదల ఆరోగ్యం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆసుపత్రుల్లో వైద్య సేవలన్నీ మెరుగుపర్చాం. సర్వజనాసుపత్రిలో వైద్య సేవలకు కావాల్సివన్నీ కల్పించాం. అవసరమైన పరికరాలన్నీ సమకూర్చాం. సిబ్బందిని నియమిస్తున్నాం. ఇంకా కావాలంటే మరింత మందిని ఏర్పాటు చేస్తాం’.. ఇదీ వైద్యారోగ్య శాఖ మంత్రి రజిని ప్రసంగాల్లో ఊదరగొట్టే మాటలు. ఇప్పుడు ఈమె సర్వజనాసుపత్రి ఉన్న గుంటూరులోనే ఎక్కువగా ఉంటున్నారు. ఈసారి ఇక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
వాస్తవం ఇదీ...
ప్రమాదాల్లో గాయపడిన వారికి, అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారికి గుంటూరు సర్వజనాసుపత్రిలో సీటీ స్కాన్ చేయించాలంటే ఫీట్లు చేయక తప్పడంలేదు. ట్రామాకేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ పరికరం మరమ్మతులకు గురైంది. అది ఎప్పుడు బాగు చేయిస్తారో సమాధానం చెప్పేవారే కరవయ్యారు. దీంతో స్కాన్ కోసం రోగులందరినీ నాట్కో క్యాన్సర్ కేంద్రం వద్ద చేయించుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అత్యవసర విభాగం నుంచి సుదూరంగా ఉన్న నాట్కో క్యాన్సర్ కేంద్రం వద్దకు రోగులను సహాయకులే తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని స్ట్రెచర్పై పడుకోబెట్టి ఎండ తీవ్రత ఉన్నా గతుకుల రహదారిపై అటూఇటూ తిప్పుతున్నారు.
8 నెలల్లో 23,381 మందికి పాట్లు
సర్వజనాసుపత్రికి అత్యవసర విభాగానికి నిత్యం వేలల్లో వస్తుంటారు. స్కానింగ్ అవసరమయ్యే వారు నిత్యం 80 నుంచి 150 మంది వరకు ఉంటారు. ట్రామ్కేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ పరికరం మరమ్మతులకు గురవడంతో వీరంతా సీటీ సిమ్యులేటర్ యంత్రం వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఇది నాట్కో క్యాన్సర్ కేంద్రంలో ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి సుమారు 400 మీటర్లు దూరం ఉంటుంది. ప్రతి రోగిని అక్కడి నుంచి స్ట్రెచర్పై అంత దూరం ఎండలో తరలించాల్సి రావడమే ఇక్కడ పెద్ద సమస్య. ప్రతి నెలా స్కానింగ్ చేయించుకుంటున్న రోగులు సుమారు 3 వేల మంది ఉంటున్నారు. గత 8 నెలల్లో 23,381 మంది రోగులు స్కానింగ్కు తిరిగారు.
కొత్త పరికరం వచ్చేదెప్పుడో?
నాలుగేళ్ల నుంచి పైసా కూడా ఇవ్వని ప్రభుత్వం రెండు నెలల కిందట సీటీస్కాన్ యంత్రాన్ని కొనుగోలు చేసేందుకు అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం ఆ పరికరం బిగించేందుకు అవసరమైన సివిల్ పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తవగానే మరో నెల రోజుల్లో కొత్త పరికరం వస్తుందని అధికారులు తెలుపుతున్నారు. పాత పరికరం మరమ్మతులకు నిధులు విడుదల చేసినందున, ఇది కూడా త్వరలోనే రోగులకు అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.
సీటీ సిమ్యూలేటర్తో స్కానింగ్
క్యాన్సర్ గడ్డ పరిమాణం ఎంత? ఏ మేరకు రేడియోథెరపీ ఇవ్వాలి తదితర పరీక్షలు చేసేందుకు సీటీ సిమ్యూలేటర్ యంత్రాన్ని వినియోగిస్తారు. ఈ పరికరం సాయంతోనే ప్రస్తుతం క్షతగాత్రులకు, ఇతర అత్యవసర వైద్యసేవలు అవసరమైన వారికి స్కాన్లు తీస్తున్నారు. దీని ఆధారంగా వ్యాధిని కచ్చితంగా నిర్ధారించలేమని వైద్యులు తెలుపుతున్నారు. ఈ పరికరాన్ని ఒకేరోజు ఎక్కువ మందికి వినియోగిస్తే అది కూడా పాడైపోతుందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొరుగు రోగుల విభాగానికి వస్తున్న వారికి సీటీ స్కాన్ చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నప్పటికీ వారికి అవకాశం రావడానికి చాలా రోజుల గడువు పడుతోంది. రోగులకు ఆ పరీక్ష పూర్తయితేనే వ్యాధి నిర్ధారణ జరిగి చికిత్స ప్రారంభించడానికి వీలవుతుందని వైద్యులు తెలుపుతున్నారు. దీంతో కొంతమంది తమ సొంత ఖర్చులతో బయట ఆ పరీక్ష చేయించుకుని తిరిగి సర్వజనాసుపత్రికి వచ్చి వైద్యుల సలహాలు తీసుకుంటున్నారు.
సకాలంలో చెల్లించనందునే..
సీటీ స్కాన్ పరికరం తయారీదారుడితో నిర్వహణ కోసం ఏటా ముందస్తుగానే ఒప్పందం చేసుకుని అందుకు అవసరమయ్యే మొత్తం చెల్లించాలి. ఆ ఏడాదిలో ఎన్నిసార్లు ఆ పరికరం పాడైనా ఆ కంపెనీ నిపుణులే బాగు చేస్తారు. అంతేగాకుండా ఏదైనా ఉప పరికరాలు అవసరమైనా పైసా చెల్లించకుండా బిగిస్తారు. ఆ గడువు ముగిసినప్పటికీ నిర్వహణ ఛార్జీలు చెల్లించనందునే ఆ పరికరం బాగు చేసేందుకు తయారీదారు కార్యాలయం నుంచి ఎవరూ రావడంలేదని సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనిపించని పోలింగ్ దస్త్రాలు?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
అక్రమం చూస్తారా... అడ్డుకట్ట వేస్తారా?
[ 18-05-2024]
కొల్లిపర మండల పరిధిలోని వల్లభాపురం, మున్నంగి, కొత్తపాలెం, బొమ్మువానిపాలెం, అన్నవరం తదితర గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను సైతం గుత్తేదారులు లెక్కచేయడం లేదు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తూ టన్నుల కొద్దీ తరలిస్తున్నారు. -
వర్షం పలకరింపు.. పుడమి పులకరింపు
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్ జూన్ నెల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. మూడు నెలలుగా మండుటెండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వర్షం రాకతో ఉపశమనం కలిగింది. -
డైరీ, రిజిస్టర్లు ఏమయ్యాయి?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
వాడరేవులో రాష్ట్ర గవర్నర్
[ 18-05-2024]
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబంతో సహా చీరాల మండలం వాడరేవుకు శుక్రవారం వచ్చారు. స్థానిక ఐటీసీ అతిథి గృహంలో సేదతీరారు. -
తెలుగు పుస్తకంలో జిల్లా అంశాలు
[ 18-05-2024]
ఈ ఏడాది పదోతరగతి పుస్తకాలు పూర్తిగా మారిపోతున్నాయి. తెలుగు, హిందీ, పీఎస్, ఎన్ఎస్ ఒక్కొక్క పుస్తకం కాగా, గణితం రెండు, ఆంగ్లం మూడు, సాంఘిక శాస్త్రం నాలుగు పుస్తకాలు మొత్తం 13 పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. -
దయచేసి వినండి.. ధరలు అధికం
[ 18-05-2024]
గుంటూరు రైల్వే స్టేషన్లో దూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని గుత్తేదారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా మంచినీరు, బిస్కెట్లు, శీతల పానీయాల అమ్మకాల్లో గరిష్ఠ అమ్మకం ధర కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. -
ఉపాధి కల్పన జేడీ ఇంటిపై పెట్రోలు సీసాతో దాడి
[ 18-05-2024]
రాష్ట్ర ఉపాధి కల్పనశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీ)ఇంటిపై శుక్రవారం గుర్తుతెలియని దుండగులు పెట్రోలు సీసాతో దాడిచేసి ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, ఫిర్యాదుదారుల కథనం ప్రకారం.. రాష్ట్ర ఉపాధికల్పనశాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ (జేడీ) డి.చైతన్య గుంటూరు ఆకులవారితోటలో నివాసం ఉంటున్నారు. -
పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల వ్యాపారం
[ 18-05-2024]
వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామానికి చెందిన ఓ వైకాపా నాయకుడు తన మామిడి పండ్ల వ్యాపారానికి స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకున్నారు. వర్షం కురుస్తుండడంతో ప్రధాన కూడలిలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల పెట్టెలను ఉంచి వ్యాపారం చేశారు. -
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలి
[ 18-05-2024]
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలని బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ పేర్కొన్నారు. దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్లో ప్రధానమంత్రి మోదీకి పంపుతున్న ఉత్తరాలను రాసి శుక్రవారం ప్రదర్శించారు. -
అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్జీటీ తీర్పును ఉల్లంఘిస్తూ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసినవారిపై దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రతి జిల్లాలో పోలీసులు, వివిధ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను ఆపే బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. -
పట్టణాల్లోనూ ఓటరు పోటెత్తారు!
[ 18-05-2024]
సాధారణంగా పట్టణాల్లో నివసించేవారికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి గంటలకొద్దీ వేచి ఉండి ఓటేసే సహనం ఉండదు. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చినవారు పట్టణాల్లో స్థిరపడతారు. ఎవరు ఓటేశారు? ఎవరు వేయలేదు? అనేది గ్రహించరని, తమను ఓటేయమని ఎవరూ అడగరని ఓటేయడానికి నిర్లక్ష్యం వహిస్తారు. -
ఈవీఎంల భద్రతపై సమావేశం
[ 18-05-2024]
జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంల భద్రతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి సమావేశంలో పాల్గొన్నారు. -
ఎవరిపై వేటు పడుతుందో..
[ 18-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, మరుసటి రోజు చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు పలువురిపై వేటు వేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో విఫలమైన అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. -
కేసుల్లో ఇరికించి.. చితకబాదారు
[ 18-05-2024]
మాచవరం మండలంలో పోలింగ్ అనంతరం మరుసటి రోజు జరిగిన గొడవల్లో తమను పోలీసులు కేసులు ఇరికించారని, దారుణంగా కొట్టారని తెదేపా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 14న మాచవరం ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా గాయపరిచారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్కు రూ.10 లక్షల బురిడీ
[ 18-05-2024]
మాయ మాటలతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ను బోల్తా కొట్టించిన సైబర్ కేటుగాళ్లు అతని ఖాతా నుంచి రూ.10 లక్షలు స్వాహా చేశారు. పట్టణానికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్కు కొద్ది రోజుల కిందట ఒక ఫోన్ కాల్ వచ్చింది. -
ఎమ్మెల్యే అనుచరులు బెదిరించారు
[ 18-05-2024]
-
సినీ థియేటర్లను బతికించండి
[ 18-05-2024]
నిర్వహణ ఖర్చులు కూడా రాక సినీ థియేటర్లు క్రమంగా మూతపడుతున్నాయని, తెలంగాణలో ఇప్పటికే అ విషయాన్ని అధికారికంగా ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్లోనూ అదే తరహా పరిస్థితులు ఉన్నాయని సినీ దర్శకుడు, మా ఏపీ అధ్యక్షుడు దిలీప్రాజా పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!