అవకాశవాదులను తెదేపాలో చేర్చుకోం
వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపు
ఎమ్మెల్యే కరణం, మాజీ ఎమ్మెల్యే ఆమంచిని ఉద్దేశించి చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు
సభా వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న చంద్రబాబు, చీరాల అభ్యర్థి కొండయ్య, తెదేపా నాయకులు
ఈనాడు-బాపట్ల, న్యూస్టుడే-చీరాల అర్బన్: గత సార్వత్రిక ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో తెదేపాపై అభిమానంతో ఏకపక్షంగా ఓట్లేసి గెలిపించారు. కానీ ఇక్కడి నుంచి గెలుపొందిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? పనుల కోసం కక్కుర్తి పడేవాళ్లు రాజకీయాలకు అవసరమా? ఇక్కడ గెలిచి అడ్డదారులు తొక్కారంటూ పరోక్షంగా ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. నన్ను గెలిపిస్తే ఆ పెద్ద మనిషి పార్టీలోకి వస్తానంటున్నారట, అలాంటి వ్యక్తులకు పార్టీలో స్థానం లేదు. ఆయారాం గయారాంలు మనకు అవసరం లేదు. వారికి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నాడు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆయన బ్రతిమిలాడి పార్టీలోకి వచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు పొంది తీరా ఎన్నికలకు ముందు పార్టీమారి వెళ్లిపోయారు. ఇలాంటి అవకాశవాదుల్ని ఇక మీదట పార్టీ ఉపేక్షించదు. ఇలాంటి వారు అవసరం లేదు. ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావులకు ఇబ్బందులు ఉండవా? వాళ్లు అడ్డదారులు తొక్కలేదే? కష్టమైన, నష్టమైన పార్టీలోనే ఉన్నారు కదా? ఇదీ నిబద్ధత అంటే.. అని వారిని ఉద్దేశించి పేరుపేరున చెప్పటంతో సభికుల నుంచి విశేష స్పందన లభించింది. చీరాలలో బుధవారం జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ నిక్కచ్చిగా పార్టీలోనే ఉంటూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అంటిపెట్టుకున్నవారిని పార్టీ ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. అడ్డదారులు తొక్కి వెళ్లిన వ్యక్తులు మళ్లీ పార్టీలోకి వస్తే చేర్చుకోం. గత ఎన్నికల్లో నలుగురు గెలిచారు. ఈసారి పార్లమెంట్ పరిధిలోని ఏడు స్థానాల్లో గెలిపించాలని ప్రజలను కోరారు.
చీరాల నుంచి అమరావతికి గంటన్నరలో..
చరిత్ర కలిగిన చీరాల నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధిపరుస్తానని చంద్రబాబునాయుడు హామీనిచ్చారు. తన హయాంలోనే ఇక్కడ అభివృద్ధి జరిగింది. అమరావతి రాజధానిని జగన్ సర్వనాశనం చేయకుండా అభివృద్ధి చేసి ఉంటే ఇక్కడి నుంచి అమరావతికి గంటన్నరలోనే వచ్చి ఉద్యోగాలు చేసుకుని తిరిగి ఇంటికి చేరుకునేవారు. ఆ పరిస్థితిని జగన్ చెడగొట్టారు. చీరాల, బాపట్ల వాసులు ఉద్యోగాల కోసం ఏ బెంగళూరో, చెన్నై వెళ్లాల్సి రావడం దురదృష్టకరం. ఉద్యోగ, ఉపాధికి చాలా విస్త్రృత అవకాశాలు ఉన్నాయి. తెదేపాను గెలిపిస్తే నియోజకవర్గాన్ని పర్యాటక హబ్గా, ఐటీకి చిరునామాగా మారుస్తానని చంద్రబాబు ఇక్కడి వాసులకు భరోసాను ఇచ్చారు. ఇంటి వద్ద బోరుకొడితే కార్యాలయానికి వచ్చి పనులు చేసుకునేలా వర్కింగ్ స్టేషన్లు నెలకొల్పుతామని వివరించారు. నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి చూపుతామని సభాముఖంగా హామీనివ్వడంతో స్థానిక యువతలో హర్షం వ్యక్తమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
[ 17-05-2024]
పల్నాడులో ఘర్షణలకు కారణమైన పిన్నెల్లి సోదరుల్ని జైలుకు పంపి శాంతి, భద్రతలు కాపాడాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. -
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
అత్తెసరు బోధన.. అరణ్య రోదన..
[ 17-05-2024]
జిల్లాలో 17 చోట్ల హైస్కూల్ ప్లస్ టూ బాలికల జూనియర్ కళాశాలలను ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రారంభించింది. -
తలొగ్గారని తప్పించారు
[ 17-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా 14 సమస్యాత్మక నియోజకవర్గాలుంటే అందులో నాలుగు పల్నాడు జిల్లాలో ఉన్నాయంటేనే ఆలోచించాలి. -
ఎన్నికల రుసుముల్లో కోత!
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పీఓ, ఏపీఓ), అదర్ పోలింగ్ ఆఫీసర్ల(ఓపీఓ)కు చెల్లించే రెమ్యునరేషన్లోనూ కొందరు రిటర్నింగ్ అధికారులు కోత విధించారు. -
మిగ్జాంతోనైనా కళ్లు తెరవరా?
[ 17-05-2024]
మిగ్జాం తుపానుతో గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పంట కాల్వల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో లక్షల ఎకరాల్లో చేతికందొచ్చిన పంట నీటిపాలైంది. -
టిప్పర్ డీజిల్ ట్యాంకు పగలడం వల్లే బస్సు దహనం
[ 17-05-2024]
చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక అధికారులు పరిశీలన చేశారు. -
మార్కెట్ల తరలింపు ఎప్పుడో..?
[ 17-05-2024]
నగరాభివృద్ధి, సదుపాయాల కల్పన విషయంలో గత అయిదేళ్లుగా వైకాపా పాలకులు పట్టించుకున్నది లేదు. -
సర్పంచులకు నిధులు, విధులు లేకుండా చేసిన ప్రభుత్వం
[ 17-05-2024]
కేంద్రం నుంచి విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులు రూ.998.84 కోట్లను పంచాయతీలకు జమ చేయాలని ఏపీ పంచాయతీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కోరారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాటు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆర్వోలకు సూచించారు. -
సర్పంచి ఇంటిపై వైకాపా రౌడీమూక దాడి
[ 17-05-2024]
బెల్లంకొండ మండలంలో వైకాపా రౌడీ మూక ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. -
అద్దంకి నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలి
[ 17-05-2024]
అద్దంకి నియోజకవర్గంలో ఈ నెల 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం దక్కలేదని నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పాణెం హనిమిరెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. -
18 మందిపై కేసుల నమోదు
[ 17-05-2024]
వట్టిచెరుకూరు మండలంలోని కారంపూడిపాడులో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనలపై 15న గ్రామంలోని 18 మందిపై డిప్యూటీ తహసీల్దారు డి.వెంకటరావు కేసులు నమోదు చేశారు. -
అందరికీ థాంక్స్.. సినీ కుటుంబ సభ్యుల ప్రేమ కదిలించింది: పవన్ లేఖ
[ 17-05-2024]
ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి