logo

గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 9న తిరుపతిలో 20.20 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(07510) తెనాలి 01.58, గుంటూరు 02.20, నడికుడి 04.00, సికింద్రాబాద్‌ 09.10 గంటలకు చేరుతుంది.

Published : 05 May 2024 05:37 IST

గుంటూరు: రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 9న తిరుపతిలో 20.20 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(07510) తెనాలి 01.58, గుంటూరు 02.20, నడికుడి 04.00, సికింద్రాబాద్‌ 09.10 గంటలకు చేరుతుంది. ఈనెల 10వ తేదీన సికింద్రాబాద్‌లో 20.45 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(07027) సత్తెనపల్లి 23.38, గుంటూరు 00.40, విజయవాడ 02.00, బ్రహ్మపూర్‌ 14.45 గంటలకు వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07028) 11న బ్రహ్మపూర్‌లో 16.45 గంటలకు ప్రారంభమై విజయవాడ 03.20, గుంటూరు 04.30, సత్తెనపల్లి 05.23, సికింద్రాబాద్‌ 10.05 గంటలకు చేరుతుంది. ఈనెల 12న సికింద్రాబాద్‌లో 20.00 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(07509) నడికుడి 22.40, సత్తెనపల్లి 23.20, గుంటూరు 23.50, తెనాలి 00.40, తిరుపతి 08.20 గంటలకు వెళ్తుంది. అదేవిధంగా భువనేశ్వర్‌ నుంచి లోకమాన్యతిలక్‌ టర్మినల్‌కు వెళ్లే ప్రత్యేక రైలు(08420) మే, జూన్‌ నెలల్లో ప్రతి బుధవారం భువనేశ్వర్‌లో 23.00 గంటలకు ప్రారంభమై విజయవాడ 12.22, గుంటూరు 13.55, సత్తెనపల్లి 14.40, పిడుగురాళ్ల 15.19, నడికుడి 15.38, సికింద్రాబాద్‌ 19.20, లోకమాన్యతిలక్‌ టర్మినల్‌కు శుక్రవారం 10.30 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08419) మే, జూన్‌ నెలల్లో ప్రతి శుక్రవారం లోకమాన్యతిలక్‌ టర్మినల్‌లో 13.20 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌ 03.30, నడికుడి 06.30, గుంటూరు 09.43, విజయవాడ 10.40, భువనేశ్వర్‌ ఆదివారం 01.45 గంటలకు వెళ్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని