వైకాపా నాయకుల కవ్వింపు చర్యలు
తాడికొండ మండలం మోతడక గ్రామంలో శనివారం వైకాపా అభ్యర్థి మేకతోటి సుచరిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని ప్రధాన రహదారి వద్ద ఉన్న తెదేపా కార్యాలయం వద్ద ఖాళీ ప్రచార రథంతో పాటు వైకాపా అల్లరి మూక వచ్చారు.
మోతడక గ్రామ తెదేపా కార్యాలయం వద్ద అల్లరి చేస్తున్న వైకాపా శ్రేణులు
తాడికొండ, న్యూస్టుడే: తాడికొండ మండలం మోతడక గ్రామంలో శనివారం వైకాపా అభ్యర్థి మేకతోటి సుచరిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని ప్రధాన రహదారి వద్ద ఉన్న తెదేపా కార్యాలయం వద్ద ఖాళీ ప్రచార రథంతో పాటు వైకాపా అల్లరి మూక వచ్చారు. వైకాపా జెండాలతో, కండువాలతో తెదేపా కార్యాలయం ఎదుట జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ అక్కడే ఉన్న తెదేపా అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకపోయింది. ఇంత జరగుతున్న తెదేపా శ్రేణులు శాంతంగా ఉండటంతో వారితో వాగ్వాదానికి దిగారు. ద్విచక్రవాహనాల శబ్దాలు పెంచుతూ కవ్వించారు. తెదేపా నాయకులు వచ్చి సర్ది చెప్పడంతో వాతావరణం సద్దు మణిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
-
సవాల్ స్వీకరించి.. స్పందనగా ఆచరించి
-
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్