బాధ్యత మరిచారు.. భ్రష్టు పట్టించారు!
పౌరులంతా క్షేమంగా సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత పాలకులదే. జగనన్న రాజ్యంలో తాడేపల్లి ప్యాలెస్ ఒక్కటే భద్రంగా ఉంది. ప్యాలెస్ పక్కనే గంజాయి బ్యాచ్లు చెలరేగుతున్నా జగన్ ఉలుకూ పలుకూ లేకుండా శిలలా ఉన్నారు.
గంజాయి బ్యాచ్ల అరాచకాలు
రోడ్డెక్కుతున్న జనం
తాడేపల్లి ప్యాలెస్ నుంచి కిమ్మనని సీఎం జగన్
గంజాయి @ గుంటూరు జిల్లా
న్యూస్టుడే, గుంటూరు నేరవార్తలు
గంజాయి, హుక్కా తయారీ సామగ్రి
పౌరులంతా క్షేమంగా సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత పాలకులదే. జగనన్న రాజ్యంలో తాడేపల్లి ప్యాలెస్ ఒక్కటే భద్రంగా ఉంది. ప్యాలెస్ పక్కనే గంజాయి బ్యాచ్లు చెలరేగుతున్నా జగన్ ఉలుకూ పలుకూ లేకుండా శిలలా ఉన్నారు. సాక్షాత్తూ సీఎం ఇంటి వద్దే గంజాయితో తిరుగుతుంటే జనాలే ఇద్దరు యువకులను పట్టుకుని తాళ్లతో కట్టేసి అప్పగించాల్సి వచ్చింది. వైకాపా ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే వీటి అమ్మకాలు సాగుతుంటే కడుపు రగిలిపోయిన మహిళలు గుంటూరులో పిల్లాపాపలతో కలిసి వచ్చి నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు. మాజీ హోంమంత్రి ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో గంజాయి ఆగడాలు పెచ్చుమీరడంపై ఆందోళనతో ఓ మహిళ ఏకంగా తన బొటన వేలునే తెగనరుక్కుని నిరసన తెలపడం పాలకుల వైఫల్యానికి నిదర్శనం.
ఎన్నికల నేపథ్యంలో గత కొద్దిరోజులుగా పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. రూ.50వేల కంటే అధికంగా తీసుకెళ్తున్నవారి నగదు జప్తు చేస్తున్నారు. అలాంటిది వేల కిలోల గంజాయి గుంటూరుకు రవాణా జరిగిందంటే ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా జిల్లాలోకి ప్రవేశించదనే అనుమానాలు కలుగుతున్నాయి. గుంటూరుకు చెందిన అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు సాగుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అప్పటి ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఓ గంజాయి, మత్తుపదార్థాల ముఠాను పట్టుకున్నారు. ఆ ముఠాలో ఓ ప్రజాప్రతినిధి కుమారుడి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. కొద్ది నెలల కిందట లాలాపేట పోలీసులు ఓ గంజాయి ముఠాను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ ముఠాలో ఓ ప్రజాప్రతినిధి కుమారుడు ప్రధాన సూత్రదారుడిగా తేలడంతో కేసు మాఫీకి ప్రయత్నించి రూ.లక్షలు ముడుపులు పుచ్చుకున్నారనే ఆరోపణతో ఓ సీఐను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఇలా అనేక ప్రాంతాల్లో గంజాయి పట్టుబడిన సందర్భాల్లో సదరు ప్రజాప్రతినిధి తనయుడి ప్రమేయం ఉన్నట్లు తేలడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
ఇలా చిన్నపొట్లాలుగా చేసి అమ్మకాలు
ఎక్కడెక్కడ సమస్య...
గుంటూరు నగరంలోని మణిపురం బ్రిడ్జి సమీపంలో, నగరంపాలెం, నెహ్రూనగర్, శారదాకాలనీ, సంజీవనగర్, న్యూగుంటూరు రైల్వేస్టేషన్ వద్ద, ఏటుకూరురోడ్డు, ఎస్వీఎన్కాలనీ, పట్టాభిపురం, శ్రీనివాసరావుపేట, అరండల్పేట, బృందావన్ గార్డెన్స్ ఇలా అనేక ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ల ఆగడాలు కొనసాగుతున్నాయి.
ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం
జిల్లాలోని గుంటూరు నగరం సహా అనేక ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలపై పోలీసు అధికారులకు, ప్రజాప్రతినిధులకు స్థానిక మహిళలు పదే పదే ఫిర్యాదులు చేస్తున్నారు. తమ ప్రాంతంలో గంజాయి తాగి రౌడీయిజం చేస్తున్నారని, మహిళలను వేధిస్తున్నారంటూ వెంగళాయపాలెంకు చెందిన పలువురు మహిళలు ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయినా గంజాయి అమ్మకాలకు అడ్డుకట్ట పడకపోవడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.
మూడేళ్ల గణాంకాలు...
గంజాయి రవాణా కేసులు 322
అరెస్టయిన నిందితులు 727
సీజ్ చేసిన గంజాయి 4577 కిలోలు
గంజాయి బ్యాచ్ ఆగడాలపై పోలీసులను ప్రశ్నిస్తున్న స్థానిక మహిళలు (పాతచిత్రం)
2024 ఏప్రిల్ 21..
ప్రత్తిపాడు
చికిత్స పొందుతున్న లక్ష్మి
గుంటూరు నగరం స్వర్ణభారతినగర్లో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత అనుచరుల భూకబ్జాలు, గంజాయి బ్యాచ్ల ఆగడాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో లక్ష్మి అనే మహిళ విసిగిపోయింది. మహిళా సంఘం సభ్యులతో కలిసి మానవ హక్కుల సంఘం, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి భవన్లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల వేళ పట్టించుకుంటారో లేదోనని ఏకంగా ఆమె తన బొటన వేలును నరుక్కుని దేశం దృష్టికి సమస్యను తెచ్చారు.
ఎమ్మెల్యే ఏం చేశారు: ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత గతంలో రెండేళ్లు హోంమంత్రిగా పని చేశారు. పోలీసుశాఖ తన గుప్పిట్లో ఉన్నా స్థానికంగా గంజాయి బ్యాచ్ల ఆగడాలు అరికట్టలేకపోయారు. పైపెచ్చు ఆమె అనుచరులపైనే ఆరోపణలతో ఓ మహిళ నిరశన దీక్షకు దిగడం గమనార్హం.
మంగళగిరి
2024 ఏప్రిల్ 21... తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి సమీపంలోని నవోదయకాలనీలో ఇద్దరు యువకులు గంజాయితో అనుమానాస్పదంగా సంచరించారు. దీంతో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి తాళ్లతో కట్టేశారు.అనంతరం పోలీసులను పిలిచి అప్పగించారు. యువకుల వద్ద 900 గ్రాముల గంజాయి లభించింది.ఏకంగా సీఎం నివాసం వద్దే గంజాయితో తిరుగుతున్నా పట్టించుకోలేదంటే పోలీసులు ఎంత ఉదాసీనంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇదీ ఆళ్ల తీరు: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గంజాయి స్థానికంగా గుప్పుమంటున్నా అరికట్టడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు.తరచూ తాడేపల్లి పరిసరాల్లో గంజాయి దొరుకుతోంది.
తెనాలి
ఆంధ్రా ప్యారిస్ తెనాలిలో గంజాయి విక్రయాలు, వినియోగం ఆందోళన కలిగించే పరిణామం. గతంలో పట్టణ రైల్వేస్టేషన్ రోడ్డులో గంజాయి బ్యాచ్ ఉంటారన్న ప్రచారం మాత్రమే ఉండేది. ఇప్పుడు పట్టణంలోని అన్ని ప్రాంతాలు, మండలంలోని గ్రామాల్లోనూ ఇది దొరుకుతోంది. కొత్తగా యువత, విద్యార్థులు సైతం అలవాటు పడుతుండడం తల్లిదండ్రుల్లో కలవరం రేపుతోంది. తెనాలి పట్టణంలోని ఐతానగర్, చినరావూరు, ముత్తంశెట్టివారిపాలెం, కబేళారోడ్డు, చెంచెపేట, మారీసుపేట, ఆర్ఆర్నగర్, సుల్తానాబాద్, బుర్రిపాలెంరోడ్డు, స్టేషన్రోడ్డు, బస్టాండు రోడ్డులో విక్రయాలు సాగుతున్నాయి.
పేరులో అన్నా.. తీరులో సున్నా: తెనాలిలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నా వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఎప్పుడూ స్పందించలేదు. గంజాయి విక్రయాల కట్టడికి పోలీసులపై ఒత్తిడి చేయలేదు.
2024 ఏప్రిల్ 26..
గుంటూరు తూర్పు
రాజీవ్గాంధీనగర్ పదో వీధిలో పగలు, రాత్రి తేడా లేకుండా గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి. గంజాయి తాగి వచ్చి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. అదేమని ప్రశ్నించినవారిపై దాడులు చేస్తున్నారు. చీకటి పడితే మహిళలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి. తమ గోడును ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె నూరిఫాతిమా వద్ద వెళ్లబోసుకున్నా పట్టించుకోలేదని ఆగ్రహంతో పిల్లలు, పెద్దలు, మహిళలు రోడ్లపైకి వచ్చి రాత్రివేళ ఆందోళన చేశారు. అక్కడ పరిస్థితి తీవ్రతకు వారి ఆగ్రహం అద్దం పడుతోంది.
తీరే వేరు: గుంటూరు తూర్పు వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా తీరు ఆరోపణలు వస్తున్నా ఉలకరు, పలకరు.
పొన్నూరు
చేబ్రోలులోని కొమ్మమూరు కాలువ వద్ద మూడు నెలల కిందట ఓ మైనర్ బాలుడు, ఇద్దరు యువకుల నుంచి పోలీసులు 2కిలోల గంజాయి పట్టుకున్నారు. ఇంజినీరింగ్ కళాశాలలే లక్ష్యంగా వీటిని విక్రయిస్తున్నారు. గంజాయి సిగరెట్ రూ.50కి అమ్ముతున్నారు. ఓ బాధిత యువకుడి తల్లి గంజాయి విక్రయించే వైకాపా నేతపై ఏకంగా దుమ్మెత్తిపోసి శాపనార్థాలు పెట్టింది. ఆరు నెలల కిందట ఆరేళ్ల బాలుడిపై వైకాపా కార్యకర్త లైంగిక దాడికి పాల్పడ్డాడు.
కనిపించలేదా కిలారి: పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఏనాడూ ఈ అరాచకాలపై స్పందించలేదు.
గుంటూరు పశ్చిమ
2023 మార్చి 1... ఇద్దరు యువకులు గంజాయి మత్తులో అర్ధరాత్రి వేళ నగరంలో చెలరేగిపోయారు. డబ్బుల కోసం కనిపించిన వారిపై దాడి చేశారు. అరండల్పేట, అమరావతి రోడ్లో దుకాణాల వద్ద కాపలాదారులైన ఇద్దరు వృద్ధులను తలపై మోది కిరాతకంగా హత్య చేశారు. పశ్చిమలో ఇప్పటికీ గంజాయి విక్రయాలు ఆగలే.
అరాచకాలు మరిచిన మద్దాళి: పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మద్దాళి గిరిధర్ ఉన్నారు. అభివృద్ధి పేరుచెప్పి తెదేపా నుంచి వైకాపాలో చేరారు. తన నియోజకవర్గంలో గంజాయి విక్రయాలు పెచ్చుమీరుతున్నా కిమ్మనలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనిపించని పోలింగ్ దస్త్రాలు?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
అక్రమం చూస్తారా... అడ్డుకట్ట వేస్తారా?
[ 18-05-2024]
కొల్లిపర మండల పరిధిలోని వల్లభాపురం, మున్నంగి, కొత్తపాలెం, బొమ్మువానిపాలెం, అన్నవరం తదితర గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను సైతం గుత్తేదారులు లెక్కచేయడం లేదు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తూ టన్నుల కొద్దీ తరలిస్తున్నారు. -
వర్షం పలకరింపు.. పుడమి పులకరింపు
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్ జూన్ నెల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. మూడు నెలలుగా మండుటెండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వర్షం రాకతో ఉపశమనం కలిగింది. -
డైరీ, రిజిస్టర్లు ఏమయ్యాయి?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
వాడరేవులో రాష్ట్ర గవర్నర్
[ 18-05-2024]
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబంతో సహా చీరాల మండలం వాడరేవుకు శుక్రవారం వచ్చారు. స్థానిక ఐటీసీ అతిథి గృహంలో సేదతీరారు. -
తెలుగు పుస్తకంలో జిల్లా అంశాలు
[ 18-05-2024]
ఈ ఏడాది పదోతరగతి పుస్తకాలు పూర్తిగా మారిపోతున్నాయి. తెలుగు, హిందీ, పీఎస్, ఎన్ఎస్ ఒక్కొక్క పుస్తకం కాగా, గణితం రెండు, ఆంగ్లం మూడు, సాంఘిక శాస్త్రం నాలుగు పుస్తకాలు మొత్తం 13 పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. -
దయచేసి వినండి.. ధరలు అధికం
[ 18-05-2024]
గుంటూరు రైల్వే స్టేషన్లో దూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని గుత్తేదారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా మంచినీరు, బిస్కెట్లు, శీతల పానీయాల అమ్మకాల్లో గరిష్ఠ అమ్మకం ధర కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. -
ఉపాధి కల్పన జేడీ ఇంటిపై పెట్రోలు సీసాతో దాడి
[ 18-05-2024]
రాష్ట్ర ఉపాధి కల్పనశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీ)ఇంటిపై శుక్రవారం గుర్తుతెలియని దుండగులు పెట్రోలు సీసాతో దాడిచేసి ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, ఫిర్యాదుదారుల కథనం ప్రకారం.. రాష్ట్ర ఉపాధికల్పనశాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ (జేడీ) డి.చైతన్య గుంటూరు ఆకులవారితోటలో నివాసం ఉంటున్నారు. -
పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల వ్యాపారం
[ 18-05-2024]
వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామానికి చెందిన ఓ వైకాపా నాయకుడు తన మామిడి పండ్ల వ్యాపారానికి స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకున్నారు. వర్షం కురుస్తుండడంతో ప్రధాన కూడలిలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల పెట్టెలను ఉంచి వ్యాపారం చేశారు. -
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలి
[ 18-05-2024]
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలని బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ పేర్కొన్నారు. దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్లో ప్రధానమంత్రి మోదీకి పంపుతున్న ఉత్తరాలను రాసి శుక్రవారం ప్రదర్శించారు. -
అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్జీటీ తీర్పును ఉల్లంఘిస్తూ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసినవారిపై దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రతి జిల్లాలో పోలీసులు, వివిధ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను ఆపే బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. -
పట్టణాల్లోనూ ఓటరు పోటెత్తారు!
[ 18-05-2024]
సాధారణంగా పట్టణాల్లో నివసించేవారికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి గంటలకొద్దీ వేచి ఉండి ఓటేసే సహనం ఉండదు. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చినవారు పట్టణాల్లో స్థిరపడతారు. ఎవరు ఓటేశారు? ఎవరు వేయలేదు? అనేది గ్రహించరని, తమను ఓటేయమని ఎవరూ అడగరని ఓటేయడానికి నిర్లక్ష్యం వహిస్తారు. -
ఈవీఎంల భద్రతపై సమావేశం
[ 18-05-2024]
జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంల భద్రతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి సమావేశంలో పాల్గొన్నారు. -
ఎవరిపై వేటు పడుతుందో..
[ 18-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, మరుసటి రోజు చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు పలువురిపై వేటు వేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో విఫలమైన అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. -
కేసుల్లో ఇరికించి.. చితకబాదారు
[ 18-05-2024]
మాచవరం మండలంలో పోలింగ్ అనంతరం మరుసటి రోజు జరిగిన గొడవల్లో తమను పోలీసులు కేసులు ఇరికించారని, దారుణంగా కొట్టారని తెదేపా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 14న మాచవరం ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా గాయపరిచారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్కు రూ.10 లక్షల బురిడీ
[ 18-05-2024]
మాయ మాటలతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ను బోల్తా కొట్టించిన సైబర్ కేటుగాళ్లు అతని ఖాతా నుంచి రూ.10 లక్షలు స్వాహా చేశారు. పట్టణానికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్కు కొద్ది రోజుల కిందట ఒక ఫోన్ కాల్ వచ్చింది. -
ఎమ్మెల్యే అనుచరులు బెదిరించారు
[ 18-05-2024]
-
సినీ థియేటర్లను బతికించండి
[ 18-05-2024]
నిర్వహణ ఖర్చులు కూడా రాక సినీ థియేటర్లు క్రమంగా మూతపడుతున్నాయని, తెలంగాణలో ఇప్పటికే అ విషయాన్ని అధికారికంగా ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్లోనూ అదే తరహా పరిస్థితులు ఉన్నాయని సినీ దర్శకుడు, మా ఏపీ అధ్యక్షుడు దిలీప్రాజా పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?