పోస్టల్ బ్యాలట్లో..ప్రలోభాల పర్వం..
ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగించుకునే కేంద్రాల వద్దకు అధికార పార్టీ నేతల అనుచరులు వచ్చి ఉద్యోగులతో మాటలు కలిపి ప్రలోభాలకు తెరలేపారు.
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే, కలెక్టరేట్ (గుంటూరు)
ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగించుకునే కేంద్రాల వద్దకు అధికార పార్టీ నేతల అనుచరులు వచ్చి ఉద్యోగులతో మాటలు కలిపి ప్రలోభాలకు తెరలేపారు. ఓటు వేసేందుకు వెళ్తున్నవారితో తమకు అవకాశమివ్వాలంటూ పీవో, ఏపీవోలతో మాట్లాడారు. కొందరు ఉద్యోగులు మీరెవరిని నిలదీస్తే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోస్టల్ బ్యాలట్ కేంద్రం వద్దకు ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు రావడంపై ఫెసిలిటేషన్ కేంద్రాల్లోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఫెసిలిటేషన్ కేంద్రంలో పలువురు ఉద్యోగులు బ్యాలట్ వినియోగించుకునే క్రమంలో వైకాపాకు చెందిన వారు ఉద్యోగులతో మాట్లాడడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది.
ఉద్యోగులతో మాట కలిపిన ముస్తఫా
- గుంటూరు తూర్పు నియోజకవర్గం ఫెసిలిటేషన్ కేంద్రం ఏసీ కళాశాలలో ఎమ్మెల్యే ముస్తఫా అక్కడే ఉండి బ్యాలట్ వినియోగించుకుని బయటకు వచ్చిన ఉద్యోగులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వైపు వెళ్లకుండా మరోవైపు నుంచి వెళ్లిపోయారు. కొందరైతే తప్పించుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి నల్లపాడు లయోలా స్కూల్లో నిర్వహించిన ఫెసిలిటేషన్ కేంద్రంలో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో పోస్టల్ బ్యాలట్ను మొదలుపెట్టారు. ఆదివారం రోజున పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని కొందరు ఉద్యోగులు సోమవారం ఓటు వేశారు.
ఇబ్బందులు పడ్డాక సదుపాయాలు
జిల్లాలో ఆదివారం నుంచి పోస్టల్ బ్యాలట్ ప్రక్రియ ప్రారంభమైంది. పీవో, ఏపీవోలకు రెండో విడత శిక్షణ ఇచ్చి అక్కడే పోస్టల్ బ్యాలట్ అవకాశం ఇచ్చారు. దీంతో ఆదివారం చాలాచోట్ల ఉద్యోగులు గంటల తరబడి వరుసలో వేచి ఉండాల్సి వచ్చింది. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సోమవారం గుంటూరు నగరంలోని ఏసీ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాలలో ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా సదుపాయాలను కల్పించారు. తొలి రోజున ఇరుకు ప్రదేశాల్లో అన్నింటిని ఒకేచోట కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం ఉదయమే పోస్టల్ బ్యాలట్కు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత ప్రక్రియ ప్రారంభమై సాఫీగా కొనసాగింది.
బారులుదీరి.. గుంటూరు పశ్చిమకి సంబంధించి మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల ఉద్యోగులు ఎక్కువ మంది ఉండడంతో ఓటు వేసేందుకు ఉద్యోగులు బారులు తీరారు. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన ఉద్యోగులు త్వరితగతిన ఓటు వేసి తిరుగు పయనమయ్యారు. తెనాలి, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో రెండోరోజైన సోమవారం సాఫీగా బ్యాలట్ ప్రక్రియ కొనసాగింది. పొన్నూరు నియోజకవర్గంలో ఆదివారం పీవో, ఏపీవోలకు శిక్షణ ఒకచోట, బ్యాలెట్ మరోచోట నిర్వహించారు. దీనిపై ఉద్యోగులు ఇబ్బందులు తెలియజేయడంతో సోమవారం ఒకే కేంద్రంలో నిర్వహించారు.
నేడు ఓపీవోలు, రేపు పోలీసులు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఓపీవోలకు మంగళవారం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల బాలుర పాఠశాలలో నుంచి లాంలోని చలపతి కళాశాలలోకి మార్పు చేశారు. చివరి నిమిషంలో కేంద్రం మార్చడం, అందరికీ ఓటు లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. తాడికొండకు సంబంధించి మంగళ, బుధవారాల్లో జరిగే ఓపీవోలు, పోలీసు, మైక్రో అబ్జర్వర్ల పోస్టల్్ బ్యాలట్ ప్రక్రియ కూడా చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోనే జరపనున్నారు. పొన్నూరులోనూ ఫెసిలిటేషన్ సెంటర్ను వీఎన్ఆర్ కళాశాలలో కొనసాగిస్తున్నారు. ఓపీవోలు మంగళవారం వారికి కేటాయించిన కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. ఎవరైనా ఏదైనా కారణంతో ఓటుహక్కు వినియోగించుకోకపోతే బుధవారం కూడా అవకాశం ఉంటుంది. పోలీసులు, అత్యవసర సేవల సర్వీసుల వారు బుధవారం ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంగళవారం ఎక్కువ మంది ఉద్యోగులు ఓటింగ్కు వస్తారని గుర్తించి ఆ మేరకు ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి తెలిపారు. ఉద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ
[ 18-05-2024]
పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
కనిపించని పోలింగ్ దస్త్రాలు?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
అక్రమం చూస్తారా... అడ్డుకట్ట వేస్తారా?
[ 18-05-2024]
కొల్లిపర మండల పరిధిలోని వల్లభాపురం, మున్నంగి, కొత్తపాలెం, బొమ్మువానిపాలెం, అన్నవరం తదితర గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను సైతం గుత్తేదారులు లెక్కచేయడం లేదు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తూ టన్నుల కొద్దీ తరలిస్తున్నారు. -
వర్షం పలకరింపు.. పుడమి పులకరింపు
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్ జూన్ నెల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. మూడు నెలలుగా మండుటెండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వర్షం రాకతో ఉపశమనం కలిగింది. -
డైరీ, రిజిస్టర్లు ఏమయ్యాయి?
[ 18-05-2024]
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. -
వాడరేవులో రాష్ట్ర గవర్నర్
[ 18-05-2024]
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబంతో సహా చీరాల మండలం వాడరేవుకు శుక్రవారం వచ్చారు. స్థానిక ఐటీసీ అతిథి గృహంలో సేదతీరారు. -
తెలుగు పుస్తకంలో జిల్లా అంశాలు
[ 18-05-2024]
ఈ ఏడాది పదోతరగతి పుస్తకాలు పూర్తిగా మారిపోతున్నాయి. తెలుగు, హిందీ, పీఎస్, ఎన్ఎస్ ఒక్కొక్క పుస్తకం కాగా, గణితం రెండు, ఆంగ్లం మూడు, సాంఘిక శాస్త్రం నాలుగు పుస్తకాలు మొత్తం 13 పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. -
దయచేసి వినండి.. ధరలు అధికం
[ 18-05-2024]
గుంటూరు రైల్వే స్టేషన్లో దూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని గుత్తేదారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా మంచినీరు, బిస్కెట్లు, శీతల పానీయాల అమ్మకాల్లో గరిష్ఠ అమ్మకం ధర కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. -
ఉపాధి కల్పన జేడీ ఇంటిపై పెట్రోలు సీసాతో దాడి
[ 18-05-2024]
రాష్ట్ర ఉపాధి కల్పనశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీ)ఇంటిపై శుక్రవారం గుర్తుతెలియని దుండగులు పెట్రోలు సీసాతో దాడిచేసి ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, ఫిర్యాదుదారుల కథనం ప్రకారం.. రాష్ట్ర ఉపాధికల్పనశాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ (జేడీ) డి.చైతన్య గుంటూరు ఆకులవారితోటలో నివాసం ఉంటున్నారు. -
పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల వ్యాపారం
[ 18-05-2024]
వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామానికి చెందిన ఓ వైకాపా నాయకుడు తన మామిడి పండ్ల వ్యాపారానికి స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకున్నారు. వర్షం కురుస్తుండడంతో ప్రధాన కూడలిలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో మామిడి పండ్ల పెట్టెలను ఉంచి వ్యాపారం చేశారు. -
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలి
[ 18-05-2024]
ప్రతి రైలులో సాధారణ బోగీలు అయిదుకు పెంచాలని బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ పేర్కొన్నారు. దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్లో ప్రధానమంత్రి మోదీకి పంపుతున్న ఉత్తరాలను రాసి శుక్రవారం ప్రదర్శించారు. -
అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?
[ 18-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్జీటీ తీర్పును ఉల్లంఘిస్తూ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసినవారిపై దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రతి జిల్లాలో పోలీసులు, వివిధ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను ఆపే బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. -
పట్టణాల్లోనూ ఓటరు పోటెత్తారు!
[ 18-05-2024]
సాధారణంగా పట్టణాల్లో నివసించేవారికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి గంటలకొద్దీ వేచి ఉండి ఓటేసే సహనం ఉండదు. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చినవారు పట్టణాల్లో స్థిరపడతారు. ఎవరు ఓటేశారు? ఎవరు వేయలేదు? అనేది గ్రహించరని, తమను ఓటేయమని ఎవరూ అడగరని ఓటేయడానికి నిర్లక్ష్యం వహిస్తారు. -
ఈవీఎంల భద్రతపై సమావేశం
[ 18-05-2024]
జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంల భద్రతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి సమావేశంలో పాల్గొన్నారు. -
ఎవరిపై వేటు పడుతుందో..
[ 18-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, మరుసటి రోజు చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు పలువురిపై వేటు వేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో విఫలమైన అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. -
కేసుల్లో ఇరికించి.. చితకబాదారు
[ 18-05-2024]
మాచవరం మండలంలో పోలింగ్ అనంతరం మరుసటి రోజు జరిగిన గొడవల్లో తమను పోలీసులు కేసులు ఇరికించారని, దారుణంగా కొట్టారని తెదేపా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 14న మాచవరం ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా గాయపరిచారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్కు రూ.10 లక్షల బురిడీ
[ 18-05-2024]
మాయ మాటలతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ను బోల్తా కొట్టించిన సైబర్ కేటుగాళ్లు అతని ఖాతా నుంచి రూ.10 లక్షలు స్వాహా చేశారు. పట్టణానికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్కు కొద్ది రోజుల కిందట ఒక ఫోన్ కాల్ వచ్చింది. -
ఎమ్మెల్యే అనుచరులు బెదిరించారు
[ 18-05-2024]
-
సినీ థియేటర్లను బతికించండి
[ 18-05-2024]
నిర్వహణ ఖర్చులు కూడా రాక సినీ థియేటర్లు క్రమంగా మూతపడుతున్నాయని, తెలంగాణలో ఇప్పటికే అ విషయాన్ని అధికారికంగా ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్లోనూ అదే తరహా పరిస్థితులు ఉన్నాయని సినీ దర్శకుడు, మా ఏపీ అధ్యక్షుడు దిలీప్రాజా పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు