మా పోస్టల్ బ్యాలట్ ఎక్కడ..?
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్్ బ్యాలట్ నిర్వహణ తీరు గందరగోళంగా మారింది. పీవో, ఏపీవోలు బ్యాలట్ వినియోగంలోనూ స్పష్టత లేదు.
జాబితాలో పేరు లేక వెనుదిరిగిన ఉద్యోగులు
గుంటూరు పశ్చిమ కేంద్రంలో తీవ్రమైన జాప్యం
గంటల తరబడి వరుసలో నిలబడి అవస్థలు బ్యాలట్
వివరాలను తెలుసుకుంటున్న ఉద్యోగులు
ఈనాడు, అమరావతి, కలెక్టరేట్ (గుంటూరు), న్యూస్టుడే: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్్ బ్యాలట్ నిర్వహణ తీరు గందరగోళంగా మారింది. పీవో, ఏపీవోలు బ్యాలట్ వినియోగంలోనూ స్పష్టత లేదు. మంగళవారం నుంచి ప్రారంభమైన ఓపీవోల పోస్టల్ బ్యాలట్ ప్రక్రియలోనూ యంత్రాంగం పని తీరుతో ఉద్యోగులు గంటల పాటు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదు గంటలకుపైగా వరుసలో నిలుచుని బ్యాలట్ వేసేందుకు లోపలికి వెళ్తే జాబితాలో పేర్లు లేవని వెనక్కి పంపడంతో ఎక్కడికి వెళ్లి ఓటు వేయాలంటూ ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో 2గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావడం, ఓటింగ్ అత్యంత నెమ్మదిగా జరగడంతో ఉద్యోగులు గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది.పశ్చిమలో రాత్రి 9గంటలకు ప్రక్రియ ముగిసింది. ఉద్యోగులకు ఇచ్చిన ఆర్డర్లో ఫెసిలిటేషన్ సెంటర్, తేదీతో సహా ముద్రించిన పత్రాలతో కేంద్రాల వద్దకు వచ్చిన వారు అక్కడ పేరు లేకపోవడంతో ఎక్కడైతే ఓటు ఉందో అక్కడికి వెళ్లాలని సూచించడంతో ఉద్యోగులు పడిన బాధలు వర్ణనాతీతం.
- తాడికొండ నియోజకవర్గ పరిధిలో లాంలోని చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునేందుకు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడకు వచ్చిన ఉద్యోగులకు సొంత నియోజకవర్గానికి వెళ్లి ఓటు వేసుకోవాలని సూచించారు. వారు సొంత నియోజకవర్గాలకు వెళ్లినా అక్కడా బ్యాలట్ లేదని చెప్పారు.
- ప్రత్తిపాడు నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ కేంద్రాన్ని నల్లపాడు లయోలా స్కూల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడకు వచ్చిన వారికి బ్యాలట్లో పేరు లేదని చెప్పడంతో సుమారు 50 మంది వెనుదిరిగారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని బ్యాలట్ వేసేందుకు వెళ్లిన వారికి పేరు లేదని చెప్పడంతో వెనుదిరిగారు.
అధికారం అండతో డబ్బుల పంపిణీ
అధికారం అండతో వైకాపా వారు బహిరంగంగానే పోస్టల్ బ్యాలట్కు డబ్బులు పంపిణీ చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ కేంద్రం ఏసీ కళాశాల గేటు వద్దనే అధికార పార్టీ నేతలు తిష్ఠ వేశారు. గుంటూరు తూర్పు వైకాపా అభ్యర్థి అనుచరగణమంతా అక్కడే ఉంటూ స్థానికంగా కారులో కూర్చుని డబ్బుల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. ఉదయం నుంచి ఈ తంతు కొనసాగుతుండగా సాయంత్రం పోలీసులు వచ్చి హడావుడి చేసి అక్కడి నుంచి పంపేశారు. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఉద్యోగుల వివరాలు సేకరించిన వైకాపా నేతలు వారికి ఫోన్లు చేసి ప్రలోభాలతో వారి వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.
పట్టుదలగా ఓటింగ్
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో అనేక ఇబ్బందులు వచ్చినా ఉద్యోగులు మాత్రం పట్టువదలకుండా రాత్రి 9 గంటలకు వరకు వేచి ఉండి ఓటు వేసిన తర్వాతే కదిలారు. ఒకవైపు బారులు తీరిన ఉద్యోగులు, మండుతున్న ఎండ, సాయంత్రం వాన ఇలా వరుస కష్టాలు ఉన్నా వేచిచూసి ఓటేసి వెళ్లడం గమనార్హం.
గందరగోళంతో ఇబ్బంది
శ్రీదేవి, ఉద్యోగిని
ఏసీ కళాశాలలో 7న పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోవాలని ఆర్డర్ కాపీ ఇచ్చారు. ఇక్కడకు వస్తే నా పేరు లేదని చెబుతున్నారు. గుంటూరు పశ్చిమ ఓటరు కాబట్టి ప్రభుత్వ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రానికి వెళ్లమని చెబుతున్నారు. ఆర్డర్ కాపీలో సూచించిన విధంగా ఇక్కడకు వస్తే మళ్లీ అక్కడికి వెళ్లమంటే ఎలా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
[ 19-05-2024]
పోలింగ్ రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక దాడులు, ఘర్షణలపై పల్నాడు జిల్లాలో సిట్ దర్యాప్తు రెండో రోజు కొనసాగుతోంది. -
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన దాడులు, ప్రతిదాడులకు సంబంధించి పోలీసులు పెద్దఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. అదనపు బలగాలు రావడంతో జిల్లా మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకోవడంతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. -
దేవుడి భూమి.. సమర్పయామి
[ 19-05-2024]
దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు. -
పల్నాడును చూసైనా.. కళ్లు తెరవలేదు..
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్కు ముందు రోజు, ఎన్నిక రోజున పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనల్లో కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వైకాపా దాడులకు తెగబడటంతో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
క్షణక్షణం ఉత్కంఠ!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన, ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా పలు గ్రామాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. -
మద్యం దుకాణాలకు 144 సెక్షన్ వర్తించదా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయిదురోజులుగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టణంలోని దుకాణాలను పూర్తిగా మూయిస్తున్నారు. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్
[ 19-05-2024]
పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్ నియమితులయ్యారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చెలరేగిన హింసను నియంత్రించడంలో విఫలమయ్యారన్న కారణంగా జిల్లా కలెక్టర్గా ఉన్న శివశంకర్ను ఎన్నికల కమిషన్ బదిలీ చేయగా ఎస్పీ బిందుమాధవ్పై సస్పెన్షన్ వేటు వేసింది. -
ఎట్టకేలకు కదిలిన అధికారులు
[ 19-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు అధికారులు కదిలారు. అక్రమ తవ్వకాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. -
ఉపాధ్యాయులకు బోధన మెలకువలపై శిక్షణ
[ 19-05-2024]
సీబీఎస్ఈ పాఠశాలల్లో పని చేస్తున్న ఆంగ్లం, సైన్స్(జీవశాస్త్రం), సోషల్ ఉపాధ్యాయులు.. తాము బోధించే పాఠ్యాంశాలపై పూర్తి అవగాహనతో ఉండాలని డీఈవో పి.శైలజ తెలిపారు. -
కరిగిన ఆశలు
[ 19-05-2024]
సాధారణంగా ఉప్పు పంటలకు ఎండలు అనుకూలం. ఉప్పు పంటను ఎండా కాలం పంటగా చెప్పాలి. ఎండల తీవ్రత బాగుంటే ఉప్పు దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం కురిసిన అకాల వర్షాలతో ఉప్పు రైతుకు తీరని నష్టం ఎదురైంది. -
ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులే లక్ష్యం
[ 19-05-2024]
మాతృభూమిపై మమకారంతో ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలు పడి ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులు సొంతూర్లకు వచ్చారు. -
మెట్ట ప్రాంతంలో తీరిన దాహం
[ 19-05-2024]
చుక్క నీటి కోసం విలవిల్లాడిన బొల్లాపల్లి మండలంలోని అయిదు గ్రామాలకు దాహం తీరింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో ఊరచెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. -
రైతులకు నికర ఆదాయమే లక్ష్యం
[ 19-05-2024]
కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించే కేంద్రాలుగా పని చేయడంతో పాటు నికర ఆదాయం సాధించేలా మార్గదర్శకం చేయాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి అటారి పదో జోన్ సంచాలకుడు డాక్టర్ షేక్ ఎన్.మీరా అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!