BJP: వచ్చే 30-40 ఏళ్లు దేశంలో అధికారం మాదే.. తెలంగాణపై ప్రత్యేక ప్రకటన: అస్సాం సీఎం
దేశంలో ప్రతిపక్షాన్ని ఇప్పటికే ప్రజలు మూలన కూర్చోబెట్టారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. వచ్చే 30-40 ఏళ్ల పాటు భాజపానే దేశంలో అధికారంలో
హైదరాబాద్: దేశంలో ప్రతిపక్షాన్ని ఇప్పటికే ప్రజలు మూలన కూర్చోబెట్టారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. వచ్చే 30-40 ఏళ్ల పాటు భాజపానే దేశంలో అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హెచ్ఐసీసీ వేదికగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు కొనసాగాయి. ఈ నేపథ్యంలో హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడారు.
‘‘రాజకీయ తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. చాలా అంశాలకు మార్పు, చేర్పులు సూచించారు. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మూ జీవితంపై ఓ చిత్రాన్ని కూడా తీయాలని సూచించారు. సబ్కా సాత్.. సబ్కా వికాస్ అన్నదే మా పార్టీ నినాదం. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయి. తెలంగాణపై భాజపా కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక ప్రకటన ఉంటుంది. దానికి ముందే రాజకీయ తీర్మానంలోనూ వివిధ అంశాలపై చర్చించాం. కుటుంబ పాలన, రాష్ట్రంలో జరుగుతోన్న అరాచకాలపై చర్చ జరిగింది. త్వరలోనే తెలంగాణలోనూ కుటుంబ పాలన అంతమవుతుంది. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కుటుంబ రాజకీయాలు, జాతి, కులమత ప్రాంత వాదాలను నిరోధించాల్సిన అవసరం ఉందని అమిత్ షా తన తీర్మానంలో ప్రస్తావించారు. పనితీరు ఆధారిత పాలన, అభివృద్ధితో కూడిన పాలనపైనే భాజపా రాజకీయ తీర్మానంలో చర్చించింది’ అని హిమంత పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434