ప్రముఖ కవి నిజాం వెంకటేశం హఠాన్మరణం
ప్రముఖ కవి, అనువాదకులు నిజాం వెంకటేశం(74) గుండెపోటుతో మృతిచెందారు. సిరిసిల్లకు చెందిన వెంకటేశం విద్యుత్శాఖలో ఏడీఈగా ఉద్యోగ విరమణ
అడ్డగుట్ట, సికింద్రాబాద్ న్యూస్టుడే: ప్రముఖ కవి, అనువాదకులు నిజాం వెంకటేశం(74) గుండెపోటుతో మృతిచెందారు. సిరిసిల్లకు చెందిన వెంకటేశం విద్యుత్శాఖలో ఏడీఈగా ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్ పద్మారావునగర్లో స్థిరపడ్డారు. ఐదు దశాబ్దాలుగా తెలంగాణ సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు. జగిత్యాలలో పనిచేసే కాలంలో దిక్సూచి అనే కవితా పత్రికను ప్రారంభించి, ఎంతో మంది కొత్త, పాత కవులకు వేదికగా నిలిచారు. అల్లం రాజయ్య కథల సంకలనం ‘భూమి’ నవలతో పాటు పలువురి రచనలను ప్రచురితం చేశారు. 80వ దశకంలో తెలంగాణ కవిత్వానికి చిరునామగా నిలిచిన ఆయన అలిశెట్టి ప్రభాకర్, సుద్దాల అశోక్తేజ వంటి ఎంతోమంది యువ కవులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మృతికి ఆద్యకళ మ్యూజియాల సేకర్త, పరిశోధకులు జయధీర్ తిరుమలరావు సంతాపం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!