logo

డెంగీతో భద్రతాధికారి మృతి

డెంగీతో శంషాబాద్‌ విమానాశ్రయం భద్రతాధికారి మృతి చెందారు. విమానాశ్రయం అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి(34) కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్‌)లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు

Published : 27 Sep 2022 04:35 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: డెంగీతో శంషాబాద్‌ విమానాశ్రయం భద్రతాధికారి మృతి చెందారు. విమానాశ్రయం అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి(34) కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్‌)లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. కొంత కాలంగా కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో పరీక్షలు చేయించుకోగా డెంగీగా నిర్ధారణ అయింది. ఇంటి వద్ద అపస్మారక స్థితిలో పడిపోయిన ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అతడికి భార్య, ఐదేళ్ల లోపు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని