Hyderabad: హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ వ్యభిచారం.. ముఠా ఉచ్చులో 14,190 మంది మహిళలు
దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ వ్యభిచార ముఠా గుట్టును సైబరాబాద్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా ఉచ్చులో ఏకంగా 14,190 మంది మహిళలు, యువతులు చిక్కుకున్నట్టు సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరించారు.
హైదరాబాద్: అంతర్జాతీయ ఆన్లైన్ వ్యభిచార ముఠా గుట్టును సైబరాబాద్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా ఉచ్చులో విదేశాలకు చెందిన మహిళలతో పాటు వివిధ నగరాలకు చెందిన యువతులు కూడా చిక్కుకున్నారు. మహిళలు, యువతులకు నిర్వాహకులు ఎండీఎంఏ మాదకద్రవ్యాలు అలవాటు చేయడంతో పాటు, బాధిత మహిళల ద్వారా విటులకు కూడా మాదక ద్రవ్యాలు సరఫరా చేయడం ద్వారా మత్తు దందా నిర్వహిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ మాసబ్ట్యాంక్ ప్రాంతానికి చెందిన అర్నవ్ ఈముఠాకు నాయకుడిగా ఉంటూ దందా కొనసాగిస్తున్నట్టు సైబరాబద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
గుట్టు చప్పుడు కాకుండా వెబ్సైట్లు, వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ముఠా ఉచ్చులో ఏకంగా 14,190 మంది మహిళలు, యువతులు చిక్కుకున్నట్టు సీపీ వివరించారు. వీరంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దిల్లీ, ముంబయి, కోల్కతా, అస్సాం, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్, రష్యాకు చెందిన వారని వెల్లడించారు. నిందితులు పలు ప్రాంతాల్లో కాల్సెంటర్లు సైతం ఏర్పాటు చేసినట్టు సీపీ వివరించారు. నిర్వాహకుల దందా మొత్తం ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారని, ప్రధాన నిందితుడు అనుమానం రాకుండా తన ఫోటో కూడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినట్టు చెప్పారు. ఈముఠాలోని మొత్తం 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 39 కేసులు నమోదు చేసి నిందితుల వద్ద నుంచి 34 చరవాణులు, 3 కార్లు, ల్యాప్టాప్, 2.5 గ్రాముల ఎండీఎంఏ మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. యువతులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఈ తరహా ముఠాల ఉచ్చులో చిక్కుకోవద్దని సీపీ సూచించారు. అనుమానం వస్తే డయిల్ 100, వాట్సప్ నెంబర్ 9490617444 కు ఫిర్యాదు చేయాలని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న