Adibatla Kidnap Case: అమ్మాయితో మాట్లాడేందుకే కిడ్నాప్ చేశా: నవీన్రెడ్డి
రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో దంత వైద్య విద్యార్థిని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు కొడుదుల నవీన్రెడ్డి వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.
సెల్ఫీ వీడియోలో మాట్లాడుతున్న నవీన్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్; న్యూస్టుడే, ఆదిభట్ల: రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో దంత వైద్య విద్యార్థిని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు కొడుదుల నవీన్రెడ్డి వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఈ నెల 9న యువతిని కిడ్నాప్ చేసిన అతడు నల్గొండ వెళ్లే మార్గంలో ఆమెను వదిలేసి గోవా చేరాడు. అక్కడ హోటల్లో బస చేశాడు. హోటల్లోని రూమ్ బాయ్ ద్వారా వీడియో తీయించాడు. దాన్ని పెన్డ్రైవ్లో ఉంచి.. హైదరాబాద్కు వస్తున్న బస్డ్రైవర్కు అప్పగించాడు. గురువారం ఉదయం ఆ వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా మీడియాకు చేరింది. 58 నిమిషాల వ్యవధి గల వీడియో ద్వారా నవీన్రెడ్డి పలు అంశాలు వివరించాడు.
‘‘ఎంతోకాలంగా తామిద్దరం కలిసి తిరిగాం. ఆ యువతి తల్లిదండ్రులే మమ్మల్ని దూరం చేశారు. తాను సంపాదించిన సొమ్ముతో ఖరీదైన వస్త్రాలు, సౌందర్య ఉత్పత్తులు కొనుగోలు చేసింది. సన్నిహితంగా ఉన్న మమ్మల్నిద్దర్నీ దూరం చేసేందుకు యువతి మేనమామ, తల్లి పన్నాగం వేశారు. 5-6 నెలలు తనను కలవకుండా దూరం చేశారు. ఇంటికెళ్లినా, కళాశాలకు వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించినా పోలీసు కేసుతో భయపెట్టారు. కొద్దిరోజులుగా ఆమెకు ఎన్నారై పెళ్లి సంబంధాలు వస్తున్నట్టు తెలిసింది. ఈ నెల 9న మన్నెగూడలోని యువతి ఇంట్లో నిశ్చితార్థం జరగబోతోందని 8వ తేదీ రాత్రి తెలిసింది. దాన్ని అడ్డుకొని ఆమెతో మాట్లాడాలనే ఉద్దేశంతో వెళ్లాను.
‘మిస్టర్ టీ’ దుకాణాల్లో పనిచేసే 20 మందిని సహాయంగా తీసుకొని యువతి ఇంటికి చేరాను. ఆమెతో మాట్లాడాలనే ఉద్దేశంతో బలవంతంగా కారులోకి ఎక్కించుకొని తీసుకెళ్లాను. రెండుసార్లు ఆ యువతి కారులో నుంచి దూకేందుకు ప్రయత్నించటంతో ఆపాను. కొట్టలేదు. ముఖాన్ని వెనక్కి నెట్టినపుడు గోరు తాకింది.’’ పర్యాటక ప్రాంతాలకు తాము కలసి వెళ్లిన అంశాలను పంచుకున్నాడు. కిడ్నాప్ చేశాక ఆమె ఇంటి వద్దే వదిలేద్దామని భావించినా, పోలీసులకు లొంగిపోతే ప్రమాదకరమనే ఉద్దేశంతో న్యాయవాది సలహా కోసం ప్రయత్నించినట్టు పేర్కొన్నాడు. సమయానికి ఆ న్యాయవాది స్పందించకపోవటంతో యువతిని మార్గం మధ్యలో వదిలేసి వెళ్లినట్టు తెలిపాడు. ఇంతకాలంగా తమ మధ్య జరిగిన విషయాలు బయటి ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతోనే వీడియో తీసి పంపానంటూ పేర్కొన్నాడు.
పోలీసుల కస్టడీ పిటిషన్
కిడ్నాప్ కేసులో నవీన్రెడ్డిని 8 రోజులు, ఏ5 నిందితుడు చందును 5 రోజుల కస్టడీ కోరుతూ గురువారం ఆదిభట్ల పోలీసుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం శుక్రవారం నిర్ణయం వెలువరించనుంది. ఈ కేసులో ఈ నెల 10న అరెస్ట్ చేసిన ఐదుగురు నిందితులను 2 రోజులు కస్టడీకి కోరారు.
స్నేహితులం మాత్రమే: బాధిత యువతి
కిడ్నాప్ చేసి తన పట్ల దారుణంగా ప్రవర్తించిన నవీన్రెడ్డి ప్రవర్తనతో విసిగిపోయానంటూ బాధిత యువతి ఆవేదన వెలిబుచ్చారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. తామిద్దరం స్నేహంగా ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించారు. నవీన్రెడ్డి వీడియోలో చెప్పేవన్నీ అవాస్తవాలంటూ కొట్టిపారేశారు. అతడు చేసే ప్రతి ఆరోపణ వెనుక కుట్ర దాగుందని, దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తాను ఒంటరిగా వెళ్లలేదన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి వెళ్లొచ్చినట్టు వివరించారు. సంబంధిత బిల్లులు ఉన్నట్టు పేర్కొన్నారు. నవీన్రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని, వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో బయటకు వస్తాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
అక్కడికి రాలేం.. మీరే రండి
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్