ఏప్రిల్ నాటికి వైద్య కళాశాల పనులు పూర్తి: కలెక్టర్
వికారాబాద్లో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులు పురోగతిలో ఉన్నాయని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి అన్నారు.
మాట్లాడుతున్న నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఇతర అధికారులు
వికారాబాద్ కలెక్టరేట్, న్యూస్టుడే: వికారాబాద్లో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులు పురోగతిలో ఉన్నాయని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్రావు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్విలతో కలిసి దృశ్య మాధ్యమంలో మాట్లాడారు. జిల్లా వైద్య కళాశాలపై కలెక్టర్ మాట్లాడుతూ తరగతి గదుల పనులు కొనసాగుతున్నాయని వచ్చే ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేస్తారని తెలిపారు. ఆసుపత్రి నిర్మాణంలో మొదటి, రెండో అంతస్తులో ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ విద్యార్థుల వసతి గృహానికి అవసరమైన భవనాలను పరిశీలించామన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్శర్మ, జిల్లా వైద్యాధికారి పల్వన్కుమార్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ నాగమణి, ఈఈ శ్రీనివాసులు, డీఈలు రవీందర్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నియంత్రికల చుట్టూ కంచెలుండాల్సిదే..
జిల్లాలోని విద్యుత్తు నియంత్రికల చుట్టూ తప్పనిసరిగా కంచెలుండాలని, లేని వాటిని గుర్తించి వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను చేపట్టాలని పాలనాధికారి విద్యుత్తు శాఖాధికారులను ఆదేశించారు. మంగళవారం పల్లె ప్రగతి, విద్యుత్తు, మిషన్ భగీరథ, సీసీ రోడ్లు, ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు. ఆయన ఎంపీడీఓలు, ఎంపీపీలు, ఏపీఓలు, అదనపు పాలనాధికారి రాహుల్శర్మతో కలిసి దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. కార్యక్రమంలో డీపీఓ తరుణ్కుమార్, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డీఈఓ రేణుకాదేవి, మిషన్ భగీరథ ఈఈ బాబుశ్రీనివాస్, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ దేవరాజ్, అదనపు డీఆర్డీఓ స్టీవెన్నిల్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్