కన్నీటి చెమ్మ.. తుడిచేదెవరమ్మా?
ఆహార పదార్థాలు డెలివరీ చేసే యువకుడు.. ఫోన్ నెంబరు ఆసరా చేసుకొని యువతులకు అశ్లీల చిత్రాలు పంపి వేధించేవాడు. అర్ధరాత్రి దాటాక వాట్సాప్లో అసభ్య పదాలతో చాటింగ్ చేసేవాడు.
మహానగరంలో ఆకతాయిల వేధింపులకు పడని కళ్లెం
ఈనాడు, హైదరాబాద్: ఆహార పదార్థాలు డెలివరీ చేసే యువకుడు.. ఫోన్ నెంబరు ఆసరా చేసుకొని యువతులకు అశ్లీల చిత్రాలు పంపి వేధించేవాడు. అర్ధరాత్రి దాటాక వాట్సాప్లో అసభ్య పదాలతో చాటింగ్ చేసేవాడు. అంతర్జాలంలో ఫోన్ నెంబర్లు ఉంచి వ్యభిచారిణులుగా ముద్ర వేస్తానంటూ బెదిరించేవాడు. రైతుబజార్లో కూరగాయలు కొనేందుకు వెళ్లిన మహిళల చేతులు తాకుతూ కొందరి వెకిలిచేష్టలు.. ఇవీ మహానగరంలో మహిళలు/యువతులు ఎదుర్కొంటున్న వేధింపులకు ఉదాహరణలు. అయితే ఇంటా.. బయటా ఎదురయ్యే ఇబ్బందులకు మేమున్నామంటూ ‘షీటీమ్స్’ కొండంత భరోసానిచ్చేవి. కొంతకాలంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో షీటీమ్స్ విభాగాలకు ఇన్ఛార్జిలే ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు బదిలీలవుతుండటం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడటంతో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. కొందరు మౌనంగా ఉండటంతో మరింతగా రెచ్చిపోతున్నారు.
నంబర్ దొరికితే నరకమే
ఎక్కడో ఒకచోట.. ఏదో ఒక సందర్భంలో ఉద్యోగినులు, విద్యార్థినులు, గృహిణులు ఫోన్ నంబర్లు ఇస్తుంటారు. నగదు లావాదేవీల్లోనూ ఫోన్ నంబర్లే కీలకం. వీటితో కొందరు ఆకతాయిలు వేధింపులకు తెగిస్తున్నారు. యాప్ల ద్వారా గొంతు మార్చి నరకం చూపుతున్నారు. షాపింగ్మాల్స్, థియేటర్లు, మెట్రోస్టేషన్ల వద్ద లక్కీడ్రా పేరిట కొందరి వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, మెట్రోరైళ్లు, రద్దీ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల్లో చాటుమాటుగా యువతులు, మహిళలు ఏమరపాటుగా ఉన్న సమయంలో సెల్ఫోన్లతో వీడియోలు, ఫొటోలు తీస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
సూచన: మీకు అవసరమైతే తప్ప ఎవరికీ ఫోన్ నంబరు ఇవ్వొద్దు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్, ఫోన్లు మాట్లాడటం ఎప్పటికైనా అపాయమే.
మాజీలు.. సామాజిక మాధ్యమాలు
అమీర్పేట్కు చెందిన ఓ యువతికి ఓ ప్రైవేటు ఉద్యోగి పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని ప్రస్తావన తేవడంతో దగ్గరైంది. చివరికి అతనికి ముందే పెళ్లయినట్టు తెలుసుకొని దూరంగా ఉంచటంతో అతడు రెచ్చిపోయాడు. ఇద్దరు కలిసున్నప్పుడు తీసిన వీడియోను బాధితురాలి తల్లిదండ్రులకు పంపాడు. చదువులు, కొలువుల సమయాల్లో యువతీ యువకుల మధ్య పరిచయాలు పెరుగుతాయి. వీరిలో కొందరు ప్రేమ, సహజీవనం వరకూ వెళ్తున్నారు. ఇద్దరి మధ్య సయోధ్య ఉన్నంత వరకూ బాగానే ఉంటారు. పొరపొచ్చాలు వచ్చినప్పుడు విడిపోతారు. దీన్ని జీర్ణించుకోలేని కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా అసభ్యకర పోస్టింగ్లతో యువతులను ఇబ్బంది పెడుతుంటారు.
సూచన: ఎవరైనా పరిచయమైతే వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. బాగున్నప్పుడు అన్నీ చెప్పేస్తే అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు అవే వివరాలు తలనొప్పిగా మారతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో గంజాయి, ఎంఎండీఏ స్వాధీనం
[ 17-05-2024]
కూకట్పల్లి ఠాణా పరిధిలోని శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. -
కుండపోత.. జనం ఎదురీత
[ 17-05-2024]
రాజధానిలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. భారీ వానకు ఈదురుగాలులు తోడవ్వడంతో నగరం అతలా కుతలమైంది. -
కట్టుకున్నోడిని చంపేసి.. గుండెపోటని నమ్మించి
[ 17-05-2024]
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను దారుణంగా హతమార్చి గుండెపోటుతో మరణించాడని కట్టుకథ అల్లింది. -
మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు
[ 17-05-2024]
మల్కాజిగిరి భాజపా కార్పొరేటర్ శ్రవణ్కుమార్ సహా మరో ముగ్గుర్ని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
యాసిడ్ కలిపిన నీటితో స్నానం.. విద్యార్థినికి గాయాలు
[ 17-05-2024]
యాసిడ్ కలిపిన బకెట్ను స్నానం నీటికి ఉపయోగించడంతో ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. -
నిధులు మింగేసి.. నాలాలను వదిలేసి
[ 17-05-2024]
రూ.వెయ్యి కోట్లతో నాలాల ఆధునికీకరిస్తామంటూ మూడేళ్ల క్రితం చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ)పై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. -
వందేభారత్ 5 గంటలు ఆలస్యం
[ 17-05-2024]
టైమంటే వందేభారత్.. వందేభారత్ అంటే టైం..అని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ద.మ.రైల్వే వాటి సమాయాలపై సంశయం వచ్చేలా చేస్తోంది. -
హద్దులు చెరిపేసి.. చుట్టూ కంచె వేసి
[ 17-05-2024]
జంట జలాశయాలకు సమీపంలో ప్రభుత్వ, నిషేధిత భూముల వివరాలను సేకరించి కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. -
వరుణుడి ఆట.. అభిమానుల ఇంటి బాట
[ 17-05-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య గురువారం రాత్రి జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
చినుకు పడితే.. కానరాని సిటీ బస్సులు
[ 17-05-2024]
నగరంలో ఏమాత్రం వర్షం పడినా ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారిపోతోంది. -
350 ఫీడర్లలో ట్రిప్పింగ్
[ 17-05-2024]
బంజారాహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలడం, చెట్ల కొమ్మలు కరెంట్ తీగలపై పడటంతో బ్రేక్డౌన్లు ఏర్పడ్డాయి. -
పోకల్వాడ భూముల కబ్జాపై దర్యాప్తు
[ 17-05-2024]
మణికొండ ఐటీ కారిడార్ సమీపంలోని పోకల్వాడలో ఐదెకరాల భూమి కబ్జా వ్యవహారం కీలకమలుపు తిరిగింది. -
ఐసీఎస్ఎస్ఆర్ జాతీయ సదస్సు 29న
[ 17-05-2024]
ఆర్జీ కేడియా వాణిజ్య కళాశాలలో ఈ నెల 29న ‘వ్యాపార పద్ధతులు- కొత్త పరిశోధనలు’ అనే అంశమై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. -
పెండింగ్ డీఏలు ఇప్పించాలి
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించడంతో పాటు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చర్యలు చేపట్టాలని -
అకాల చినుకు..అన్నదాతకు వణుకు
[ 17-05-2024]
రైతన్న అనుకున్నంతా అయింది. అకాల వర్షం పడితే తాము పడిన కష్టం అంతా నీటి పాలవుతుందని నిత్యం ఆకాశంలో మబ్బులు పడితే ఆందోళన చెందుతున్నారు. -
బాహ్య వలయం.. అసంపూర్ణం
[ 17-05-2024]
తాండూరు నియోజకవర్గానికి తొలిసారిగా ‘బాహ్య వలయ రహదారి’ మంజూరైంది. -
సౌకర్యాలు కరవాయె.. రైతన్నకు దిగులాయె
[ 17-05-2024]
ధాన్యం సేకరణ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నటు అధికారులు పేర్కొంటున్నా క్షేత్ర స్థాయిలో అరకొరగానే ఉన్నాయి. -
కులగణన ప్రక్రియ సత్వరం చేపట్టండి
[ 17-05-2024]
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియను వెంటనే చేపట్టి బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కోరారు. -
పురపాలికగా మహేశ్వరం!
[ 17-05-2024]
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం పురపాలికగా ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు 19
[ 17-05-2024]
లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. -
సోమాలియా బాలిక కడుపులో 3.75 కిలోల కణితి తొలగింపు
[ 17-05-2024]
సోమాలియా దేశానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలిక కడుపులో ఉన్న భారీ కణితిని సికింద్రాబాద్లోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించి ఆమెకు ఊరట కల్పించారు. -
సుంకిశాల పనుల్లో జాప్యంపై ఆరా
[ 17-05-2024]
నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై జలమండలి దృష్టి సారించింది. -
‘ఉచిత బియ్యం పంపిణీపై అవగాహన కరవు’
[ 17-05-2024]
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
పోలింగ్పై ఎడతెగని సమీక్ష
[ 17-05-2024]
చేవెళ్ల లోక్ సభకు సంబంధించి ఈనెల 13న సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు పూర్తయ్యాయి. -
పోగొట్టుకున్న 300కళ్లద్దాల ఫ్రేమ్ల అప్పగింత
[ 17-05-2024]
రైల్లో పోగొట్టుకున్న 300 కళ్లద్దాల ఫ్రేమ్ల సెట్లను ఆర్పీఎఫ్ పోలీసులు బాధితునికి అప్పగించిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్లో గురువారం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే