ఎన్ని‘కలలు’.. సుడిగాలి పర్యటనలు
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నగరంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరుతో నాలుగు రోజుల పాటు సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు
పార్టీలో ఉత్తేజం నింపేందుకు సీఎం కసరత్తు
నాలుగు రోజులపాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నగరంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరుతో నాలుగు రోజుల పాటు సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగానే భారీ సభలను ఏర్పాటు చేస్తున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ తన హవా కొనసాగించినా.. గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం ఘోరంగా దెబ్బతింది. లోక్సభ ఎన్నికల్లోనైనా మెరుగైన ఫలితాలు సాధించి ఆ లోటును భర్తీ చేసుకోవడంపై సీఎం దృష్టిసారించారు.
నగరంపై పట్టు కోసం..
గ్రేటర్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో 29 శాసనసభ స్థానాలు ఉంటే కేవలం మూడుచోట్ల మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రస్తుతం బల్దియాలోనూ కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. చుట్టుపక్కల ఉన్న నగరపాలక సంస్థ, పురపాలక సంఘాలు భారాస చేతిలోనే ఉన్నాయి. అవిశ్వాస తీర్మానాలతో కాంగ్రెస్ ఒక్కొక్కటిగా తన ఖాతాలో వేసుకుంటోంది. నగరంలో నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా.. సీఎం గురువారం నుంచి నాలుగు రోజులపాటు నగరంలో పర్యటించనున్నారు.
బైరామల్గూడ పైవంతెన ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్: బైరామల్గూడ కూడలిలో నిర్మించిన రెండోస్థాయి పైవంతెన సీఎం ఈ నెల 9న సా.4 గంటలకు ప్రారంభించనున్నారు. శంషాబాద్, ఒవైసీ ఆస్పత్రి వైపు నుంచి బీఎన్రెడ్డినగర్, నాగార్జునసాగర్ వైపు వెళ్లే వాహనాలకు., చింతలకుంట చెక్పోస్టు అండర్పాస్ మీదుగా హయత్నగర్, విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు ఉపయోగకరం. ఇదే కూడలిలో ప్రస్తుతం రెండు లూప్లు నిర్మాణంలో ఉండగా, మొదటి స్థాయి పైవంతెనలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
పెండింగ్ ప్రాజెక్టులకు శ్రీకారం
ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కీలకమైన ప్రాజెక్టులకు రేవంత్రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. పాతబస్తీ మెట్రోతోపాటు సికింద్రాబాద్- రామగుండం, నాగ్పూర్ జాతీయ రహదారిలోనూ ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు. కొన్ని మురుగుశుద్ధి కేంద్రాలనూ ప్రారంభించనున్నారు.
పాతనగరానికి మెట్రోరైలు
చాంద్రాయణగుట్ట, న్యూస్టుడే: పాతబస్తీ మెట్రోపనులకు ఈ నెల 8న సా.5 గంటలకు ఫలక్నుమాలో రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఫరూక్నగర్ బస్సు డిపో దగ్గర బహిరంగ సభ. అక్కడే డ్వాకా మహిళలతో మాటామంతీ ఉంటుంది. కారిడార్-2 జూబ్లీ బస్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు 15 కి.మీ.లు మెట్రో మార్గం నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించి.. 2011లో పనులు ప్రారంభించింది, జెబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం మారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్రెడ్డి పాతబస్తీ మెట్రోపై సమీక్షించి, మార్గాన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఇవీ రోజు వారీ కార్యక్రమాలు
7-03-2024
- ఉదయం 11.30కు హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్ నుంచి తూముకుంట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అల్వాల్ ముత్యాలమ్మ గుడి దగ్గర శంకుస్థాపన.
- మధ్యాహ్నం 1.30కు బంజారాహిల్స్లోని డాక్టర్ బాబూ జగజ్జీవన్రామ్ భవన్ ప్రారంభం.
8-03-2024
- సాయంత్రం 4 గంటలకు జూపార్కుకు సమీపంలో మీరాలం మురుగుశుద్ధి కేంద్రం ప్రారంభం.
- సాయంత్రం 4.30కు ఇబ్రంహీం గోల్కొండ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు భవనాల ప్రారంభోత్సవం.
9-03-2024
- 4.30కు నల్ల చెరువు మురుగుశుద్ధి కేంద్రం ప్రారంభం.
- సాయంత్రం 5 గంటలకు నాగ్పూర్ రోడ్డులో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి కండ్లకోయ దగ్గరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన. ఆ తరువాత అక్కడే బహిరంగ సభ.
12-03-2024
- పరేడ్ గ్రౌండ్లో స్వయం సహాయక సంఘాలతో రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు నిర్వహణ. సమయం నిర్ధారణ కాలేదు.
- అదే రోజు అల్వాల్ టిమ్స్ ఆస్పత్రి ఎదురుగా డాక్టర్ సైరస్ పుణేవాలా అంటువ్యాధుల సెంటర్కు శంకుస్థాపన.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్థానిక సంస్థలపై కాంగ్రెస్ గురి
[ 19-05-2024]
నార్సింగి మున్సిపాలిటీ ఛైర్పర్సన్ దారుగుపల్లి రేఖ, వైస్ఛైర్మన్ వెంకటేశ్యాదవ్(భారాస)లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు నెగ్గాయి. వీరిపై మెజార్టీ సభ్యులు అందజేసిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు మున్సిపల్ కార్యాలయంలో శనివారం రాజేంద్రనగర్ ఆర్డీవో కె.వెంకట్రెడ్డి -
పుస్తకాలకు, బల్లలకు ఆకతాయిల నిప్పు
[ 19-05-2024]
జడ్పీ ఉన్నత పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, బల్లలకు ఆకతాయిలు నిప్పు పెట్టిన సంఘటన తాండూరు మండలం కరణ్కోటలో జరిగింది. శనివారం పాఠశాలలోకి ప్రవేశించిన ఆకతాయిలు సామగ్రి నిల్వ గదిలోకి వెళ్లారు. -
జూలో ఖడ్గమృగాల సంతతి వృద్ధి
[ 19-05-2024]
నగర నెహ్రూ జూ పార్కులో ఖడ్గమృగాల సంతతి క్రమంగా పెరుగుతోంది. వాటి ప్రదర్శన, విశ్రాంతికి మరో ఎన్క్లోజర్ నిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరేళ్ల నుంచి వాటిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్) దత్తత తీసుకొంటోంది. -
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
[ 19-05-2024]
నీటి ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల్లో సరఫరా చేసే విధానం అందుబాటులోకి వచ్చినట్లు జలమండలి ప్రకటించింది. ఇక నుంచి 3-4 రోజులపాటు నిరీక్షణ ఉండదని పేర్కొంది. -
సెప్టెంబరుకు.. ‘సుంకిశాల’ అందేనా?
[ 19-05-2024]
నాగార్జునసాగర్ డెడ్స్టోరేజీ నుంచి సైతం నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టు సెప్టెంబరు నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు జలమండలి సమాయత్తమవుతోంది. -
చిన్న వర్షం.. అతలాకుతలం
[ 19-05-2024]
నగరంలో వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. -
మానసిక కుంగుబాటుతో చందు బలవన్మరణం
[ 19-05-2024]
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) అలియాస్ చందు మానసిక కుంగుబాటుతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. త్రినయని సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న చందు శుక్రవారం మణికొండలో బలవన్మరణానికి పాల్పడటం తెలిసిందే. -
సైబర్ నేరస్థులకు.. ‘మ్యూల్’ ఖాతాలు తెరుస్తూ..
[ 19-05-2024]
సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అయిదుగురు నిందితులను శనివారం అరెస్టు చేశారు. -
గ్రూప్-1 ప్రిలిమినరీకి ముమ్మర ఏర్పాట్లు
[ 19-05-2024]
జిల్లాలో జూన్ 9న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్శర్మ తెలిపారు. -
నాసిరకం ముప్పు.. కావాలి కనువిప్పు
[ 19-05-2024]
వానాకాలం సీజన్ దగ్గర పడుతోంది. పొలాలను శుభ్రం చేసే పనులు ఊపందుకుంటున్నాయి. ఇదే అదనుగా నాసిరంక విత్తనాలు కూడా విపణిలోకి తెచ్చేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారు. -
పర్యవేక్షణ శూన్యం.. ఇసుక మాయం
[ 19-05-2024]
ప్రభుత్వ లక్ష్యానికి, ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా నిర్మాణాలు సాగాలి. గుత్తేదారు దానికి తగినట్లుగా పనులు చేయాలి. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. -
12 శాతం రిజర్వేషన్ కోసం మాదిగ జన సభలు
[ 19-05-2024]
తెలంగాణలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ‘మాదిగ జన సభలు’ నిర్వహిస్తున్నట్లు మాదిగ ఐకాస ఛైర్మన్, తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. -
చెత్త కుప్పలు తొలగించేదెవరు?
[ 19-05-2024]
ఎన్ని చర్యలు తీసుకున్నా పారిశుద్ధ్యం పట్టాలెక్కడం లేదు. నగరవ్యాప్తంగా 23 లక్షల ఇళ్లు ఉన్నాయని అంచనా. వాటన్నింటి నుంచి నిత్యం చెత్త సేకరణకు ప్రస్తుతం 4,500 స్వచ్ఛ ఆటోలున్నాయి. -
అటవీ భూమి కేటాయింపులు సబబే
[ 19-05-2024]
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఇమారత్ కంచ, సరూర్నగర్ మండలం మామిడిపల్లిలో అటవీ భూమిని అటవీయేతర అవసరాలకు ప్రభుత్వం కేటాయించడాన్ని హైకోర్టు సమర్ధించింది. -
ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో టోకరా
[ 19-05-2024]
కొంపల్లిలో ఖరీదైన ప్రాంతంలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ల ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో 350 మంది నుంచి రూ.60 కోట్ల వరకు వసూలు చేసి మోసగించిన ముగ్గురు మోసగాళ్లను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు
[ 19-05-2024]
పలు విశ్వవిద్యాలయాల పేరిట నకిలీ ధ్రువీకరణ పత్రాలు విక్రయిస్తున్న ముఠాలోని సభ్యుడితో పాటు కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తిని మహేశ్వరం ఎస్వోటీ బృందం, చైతన్యపురి పోలీసుల సహకారంతో అరెస్టు చేసింది. -
వారణాసిలో ప్రచారానికి భాజపా బృందం
[ 19-05-2024]
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేంద్రమోదీకి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు 10 మంది సభ్యులతో కూడిన భాజపా బృందాన్ని ఎంపిక చేశారు. -
ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలి
[ 19-05-2024]
రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని, ఒక యాజమాన్యం కింద ఒకే విద్యా సంస్థ ఉండాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
పోరాటయోధుల చరిత్ర గ్రంథస్థం చేస్తాం
[ 19-05-2024]
తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన తొలి పోరాటంలో అమరులైన వీరులు, జైలుకెళ్లిన, అంగవైకల్యం చెందిన యోధుల త్యాగాలు చరిత్రకెక్కలేదని, ఆ త్యాగధనుల జీవితాలను గ్రంథ]స్థం చేస్తున్నట్లు తెలంగాణ -
రైల్వే, ఆదాయపన్నుశాఖలో ఉద్యోగాల పేరుతో మోసం
[ 19-05-2024]
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసగించిన నిందితుడిని ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ ఎస్.రష్మీ పెరుమాళ్ కథనం ప్రకారం.. -
క్యాన్సర్పై సమగ్ర పుస్తకం అభినందనీయం
[ 19-05-2024]
క్యాన్సర్ మహమ్మారికి శాశ్వత పరిష్కారం దిశగా పరిశోధనలు జరగాలని ఓయూ వీసీ ప్రొ.రవీందర్ అన్నారు. విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ (సీపీఎంబీ) డైరెక్టర్ డా.రామకృష్ణ
తాజా వార్తలు (Latest News)
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి