logo

అప్పు చెల్లించలేదని రూ.4 కోట్ల కారు దహనం

బాకీ చెల్లించలేదని విలువైన కారును దహనం చేసిన ఘటన ఇది. పహాడీషరీఫ్‌ పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. నార్సింగికి ·చెందిన వ్యాపారి నీరజ్‌కు రూ.4 కోట్ల స్పోర్ట్స్‌ కారు ఉంది.

Updated : 15 Apr 2024 11:48 IST

పహాడీషరీఫ్‌: బాకీ చెల్లించలేదని విలువైన కారును దహనం చేసిన ఘటన ఇది. పహాడీషరీఫ్‌ పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. నార్సింగికి ·చెందిన వ్యాపారి నీరజ్‌కు రూ.4 కోట్ల స్పోర్ట్స్‌ కారు ఉంది. దాన్ని విక్రయిస్తానని మొఘల్‌పురాకు చెందిన మిత్రుడు అమన్‌కు తెలిపాడు. శనివారం అహ్మద్‌ కారును కొనడానికి మామిడిపల్లిలోని తన ఫాంహౌస్‌కు తెమ్మన్నాడు. నీరజ్‌ మిత్రుడు అయాన్‌కు ఇచ్చి పంపించాడు. నీరజ్‌ తమకు రూ.2 కోట్లు బాకీ ఉన్నాడని అహ్మద్‌ చెప్పాడు. కారు చూపించడానికి తెచ్చామని, నీరజ్‌ ఎక్కడున్నాడో తెలియదని అయాన్‌ చెప్పడంతో కారుపై పెట్రోలు చల్లి నిప్పు పెట్టాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని